మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ నటించిన 'రంగస్థలం' చిత్రంలో ఫుల్ లెంగ్త్ రంగమ్మత్త క్యారెక్టర్ తో తనలోని నటిని తన అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులకు తన అభినయాన్ని రుచి చూపించి నూటికి నూరు మార్కులు వేసుకున్న యాంకర్ అనసూయ, తాజాగా ఓ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తూ ఓ ట్వీట్ చేసింది. అమె ట్వీట్ అందుకున్న పోలీసులు అఘమేఘాలపై స్పందించారు. అమెతో సమస్య ఏంటో తెలుసుకుని.. సదరు తప్పిదానికి పాల్పడిన వ్యక్తికి జరిమానా విధించేందుకు చర్యలు కూడా చేపట్టారు.
అసలేం జరిగింది. ఎందుకు హైదరాబాద్ పోలీసులు ఓ టాక్సీ డ్రైవర్ కు జరిమానా విధించారన్న వివరాల్లోకి వెళ్తే.. నిన్న సాయంత్రం రాత్రి 7.30 గంటలకు అనసూయ తన కారులో బంజారాహిల్స్ రోడ్డు నెంబరు రెండులోని పార్క్ హయాత్ హోటల్ నుంచి వస్తుండగా, ఓ టాక్సీ ప్లేట్ వున్న కారు డ్రైవర్.. ప్యాసెంజర్లు వెనుక సీట్లలో వుండగానే.. తన మొబైల్ ఫోనులో సంభాషించుకుంటూ కారును నడుపుతున్నాడు. దీనిని వీడియో తీసిన అనసూయ దీనిని హైదరాబాద్ ట్రాపిక్ పోలీసులను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
ఈ ఘటన తనను భయపెట్టిందని, గతంలో వేరొకరు చేసిన తప్పు.. తనను ప్రమాదానికి గురిచేసిందని.. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని వదలద్దని చెప్పింది. రహదారులపై ఇష్టమొచ్చినట్టు డ్రైవ్ చేసేవారికి ఇతరుల ప్రాణాలంటే లెక్కలేదా? అని ప్రశ్నించింది. అనసూయ పెట్టిన ట్వీట్ పై స్పందించిన హైదరాబాద్ పోలీసులు వెంటనే స్పందించిన.. కారు నెంబరు, తేది, సమయంతో కూడిన వివరాలను అందిస్తే ఇలాంటి తప్పులు పునారావృతం కాకుండా తాము నోటీసులు అందజేస్తామని పోలీసులు చెప్పడంతో మరో వీడియోను కూడా షేర్ చేసింది అనసూయ. రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించడం, వాహనదారులు పాటింపజేసేలా చేయడం తమ బాధ్యత కూడా అని మరీ పేర్కోంది. ఇప్పుడీ ట్వీట్ వైరల్ అవుతోంది.
Dear @HYDTP This scares the life out of me sir.. I already faced an accident because of someone else’s fault.. please do not let such careless drivers get away with doing anything they want to.. they do not have right on the lives of everyone else on the road..please sir
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more