డ్రగ్స్ కేసులో సెలబ్రిటీల సిట్ విచారణ ఎట్టకేలకు పూర్తయ్యింది. నోటీసులు పంపించిన 12 మంది టాలీవుడ్ ఆర్టిస్టులను రోజుకోకరి చొప్పున పూర్తి చేసేశారు. ప్రముఖ సినీ యువ నటుడు నందు అలియాస్ ఆనందకృష్ణ సిట్ విచారణ ముగిసినట్లయ్యింది. చివరి రోజు విచారణలో భాగంగా నటుడు నందు అలియాస్ ఆనందకృష్ణ హాజరుకాగా, కేవలం మూడే మూడు గంటల్లో విచారణనను పూర్తి చేసి పంపించేశారు.నందు ఎంత స్వేచ్ఛగా విచారణకు వచ్చాడో, అంతే స్వేచ్ఛగా విచారణ నుంచి వెళ్లిపోయాడు.
ఇక నిన్న తనీశ్ ను కూడా కేవలం కొద్ది గంటలే విచారించిన విషయం తెలిసిందే. పూరీ కెల్విన్ ల మధ్యే కాదు.. ఇతర సెలబ్రిటీ లమధ్య కూడా తనీశ్ డ్రగ్స్ సరఫరా చేశారంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే విచారణ తర్వాత బయటకు వచ్చిన తనీశ్ తన పేరును అనవసరంగా బద్నాం చేయొద్దంటూ విజ్నప్తి చేశాడు. తండ్రి చనిపోయిన బాధలో ఉండగా, డ్రగ్స్ నోటీసులు రావటం చాలా బాధించిందని, తనకు సిగరెట్, మందు అలవాట్లు మాత్రం ఉన్నాయని చెప్పుకొచ్చాడు.
ఇక కెల్విన్ ఫోన్ డాటాలో నందు ఫోన్ నెంబర్ ఉండడంతో ఆ దిశగా సిట్ అధికారులు ప్రశ్నలు సంధించారు. విచారణకు ముందు, తరువాత ఎలాంటి ఒత్తిడికి గురికాకపోవడం విశేషం. తనకు ఎలాంటి దురలవాట్లు లేవని నందు స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. అదే విషయాన్ని సిట్ అధికారులకు చెప్పిన నందు విచారణ కేవలం 3 గంటలపాటే సాగింది. సిట్ విచారణ ఎదుర్కొన్న వారిలో నందు మాత్రమే అత్యంత తక్కువ సమయం విచారణ ఎదర్కొన్న వ్యక్తిగా నిలిచాడు.
సుమారు 90 గంటల విచారణలో సేకరించిన వివరాలతో సిట్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయనుంది. కెల్విన్, జిషాన్ తదితర డ్రగ్ సరఫరాదారుల కేసులో సిట్ విచారణ ఛార్జిషీటు కోసం సినీ నటులతో పాటు 27 మందిని విచారించినట్టు సమాచారం. అయితే ముఖ్యమంత్రి హామీ నేపథ్యంలో కేసు విచారణ, సిట్ దర్యాప్తు ఇక ముందుకు సాగుతుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
May 17 | విశ్వనటుడు కమల్ హాసన్ విశ్వరూపం చిత్రం తరువాత ఇప్పటి వరకు ఏ సినిమా రాలేదు. ఆయన రాజకీయ అరంగ్రేటం చేయడంతో సినిమాలకు తాత్కాలికంగా పక్కన బెట్టారు. నుంచి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళు దాటింది.... Read more
May 16 | యంగ్ హీరో విజయ్ దేవరకొండ నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్ళు దాటింది. ప్రస్తుతం ఈయన నటించిన లైగర్ విడుదలకు సిద్ధంగా ఉంది. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల... Read more
May 16 | టాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం వచ్చిన కామెడీ సీక్వెల్ ఇన్నాళ్లకు మళ్లీ అనీల్ రావిపూడి పుణ్యమా అని రూపోందుతోంది. అప్పట్లో శివ నాగేశ్వర రావు తీసిన మనీ.. మనీ మనీ.. చిత్రాలు... Read more
May 09 | టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి. తన నటనతో... డాన్సింగ్తో సినీ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. 2017లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అమె.. భానుమతి పాత్రలో,... Read more
May 09 | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రంలో క్లాస్గా కనిపించాడు. ఇన్నాళ్లు యూత్ ను మాత్రమే ఆకర్షించిన ఆయన తొలిసారి మాస్ ఆడియన్స్ కు చేరువయ్యేలా వైవిద్యమైన చిత్రాన్ని... Read more