ఒకప్పుడు సినిమా రంగంలో హీరోలు నిర్మాణ రంగంలో చాలా తక్కువగా ఉండేవారు. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ లాంటి వాళ్లు కూడా ఎస్టాబ్లిష్ అయ్యేంత వరకు వేరే బ్యానర్ లలోనే సినిమాలు తీసి పారితోషకం అందుకునేవారు. ఆ తర్వాత పరిస్థితి దారుణంగా మారిపోయింది. హీరోలే సినిమాలను నిర్మించటం, వారి బంధువులు, దగ్గరి మనుషులతో పంపిణీ చేయించటం లాంటి కొత్త కొత్త సాంప్రదాయాలకు తెరలేపారు. దీని ద్వారా ప్రస్తుతం పరిస్థితి ఎలా తయారయ్యిందంటే డిస్ట్రిబ్యూటర్ అనే వాడు కనుమరుగు అయిపోయే స్థాయికి చేరుకున్నాడని చెబుతున్నాడు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా.
1975 లో మధుసూదన్ నామా స్థాపించిన శ్రీ అభిషేక్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూటర్ సంస్థ ఈ మధ్యే నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. కేశవ, బాబు బాగా బిజీ చిత్రాలను నిర్మించాడు అభిషేక్ నామా. టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న పరిణామాలను వివరిస్తూ స్టార్ హీరోలపైన సంచలన వ్యాఖ్యలే చేశాడు. ఒకప్పుడు నైజాంలో 40 మంది పంపిణీ దారులు ఉండేవారు, క్రమక్రమంగా ఇప్పుడు ఆ సంఖ్య కనుమరుగు అయ్యే స్థాయికి చేరుకుంది. నేను, దిల్ రాజు, సునీల్ మాత్రమే మిగిలాం. కొద్దిరోజులు పోతే అసలు డిస్ట్రిబ్యూటర్ అనే పదమే వినిపించకుండా పోతుందేమో అని ఆందోళన వ్యక్తం చేశాడు.
ఇక కొందరు బయ్యర్లు స్టార్ హీరోల సినిమాలను ఏదో బిల్డప్ కు రిలీజ్ చేసుకుంటారే తప్ప, అసలు దాని వల్ల రూపాయి లాభం కూడా ఉండదని తేల్చేశాడు. భారీ రేటుకు హక్కులు కొంటున్న మరికొందరు పరువు పోతుందన్న ఉద్దేశ్యంతో టాక్స్ కూడా కలుపుకుని షేర్ కలెక్షన్లుగా చెబుతున్నారని, కానీ, అందులో చాలా తేడా ఉంటుందని చెప్పాడు. ఒక్కోసారి పెట్టిన రేటు కూడా కలెక్షన్లు రావని తేల్చాడు. ప్రస్తుతం టాప్ హీరోలుగా ఉన్న వారి సినిమాల కంటే నాని, శర్వానంద్, నిఖిల్ చిత్రాల ద్వారా నాలుగు రూపాయలు డిస్ట్రిబ్యూటర్ వెనకేసుకోగలుగుతున్నారని, ఈ పరిస్థితి మారాలంటే ముందు హీరోలు మారాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అభిషేక్ చేసిన ఈ వ్యాఖ్యలపై టాలీవుడ్ లో హాట్ డిస్కషన్ మొదలైంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more