వర్మ వంగవీటి సినిమా విడుదలై యావరేజ్ టాక్ మూటగట్టుకుంది. అయితే కావాలనే కొందరు పనిగట్టుకుని సినిమా టాక్ చెడగొడుతున్నారని అంటున్నాడు ఈ వివాదాల దర్శకుడు. సినిమా రిలీజ్ అయ్యాక కొందరు రంగను విలన్ గా చూపించారంటూ.. కులాన్ని హేళన చేశారంటూ ఇలా ఎవరి వర్షన్ లో వాళ్లు విమర్శలు వినిపించారు. అది క్రమంగా సినిమాపై కూడా పడింది. దీంతో రంగంలోకి దిగిన వర్మ ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాడు.
తానేం అధ్యయనం మొత్తం అధ్యయనం చేయలేదని, తాను విన్నది, కొందరు చెప్పింది మాత్రమే ఓ సినిమాగా అల్లుకుని తీశానని అంటున్నాడు. వంగవీటిని విలన్ గా చూపించాలనో లేక దేవినేని ఫ్యామిలీని పాజిటివ్ లో చూపించాలన్న ఉద్దేశం తనకు ఏ మాత్రం లేదని చెప్పుకొచ్చాడు. కాంట్రవర్సరీలతో క్యాష్ చేసుకోవాలనుకుంటే తాను వేరే జోనర్ సినిమాలు తీసేవాడిని కదా అని అంటున్నాడు. గాంధీ కథ కన్నా నాకు వంగవీటి కథే బాగా అనిపించింది. అందుకే దానిని సినిమాగా మలిచా. నేను సిద్ధార్థ కాలేజీలో చదువుకునే రోజుల్లో కొన్ని ఘటనలు చూశాను. వాటిని కూడా ఇందులో చేర్చాను. పిరియాడిక్ ఈవెంట్లలాగా కాకుండా మొత్తం ఒకే టైంలో జరిగినట్లుగా వరుసగా చూపించాను. ఇక్కడ లాజిక్కులు కూడా వెతకాల్సిన పని లేదన్నాడు.
ఇంకా కొందరు కులాన్ని కించపరిచానని అంటున్నారు. కానీ, కుల ప్రస్తావన ఎక్కడా లేకుండా సినిమా తీశానని మీరే(యాంకర్ ను ఉద్దేశించి) అంటున్నారు. ఇది చాలదా? నేను వివాదాస్పదంగా సినిమా తెరకెక్కించలేదని చెప్పటానికి అంటూ తెలిపాడు. మొత్తానికి తాను ఎవరి మనోభావాలను దెబ్బతీయలేదని, అలాగని ఉన్నది ఉన్నట్లు చూపించానని కూడా చెప్పటం లేదని, తనక్కూడా క్లారిటీ లేకపోవటంతోనే వంగవీటి మరణంను మిస్టరీగా వదిలేశానని అంటున్నాడు.
హెచ్ ఆర్సీలో ఫిర్యాదు...
అయితే వంగవీటి రంగా అభిమానులు మాత్రం ఈ వాదనతో ఏకీభవించటం లేదు. సంఘం శనివారం మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో విడుదలైన ‘వంగవీటి’ చిత్రంలోని పలు సన్నివేశాలు కాపుల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయంటూ ఈ సందర్భంగా హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసింది. వెంటనే ఆ సన్నివేశాలను తొలగించాలని రంగా అభిమానుల సంఘం కోరింది.
ఈ ఫిర్యాదుపై స్పందించిన హెచ్ఆర్సీ....జనవరి 16లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ సెన్సార్ బోర్డును ఆదేశించింది. కాగా ‘వంగవీటి’ సినిమాపై మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నిన్న ఏపీ డీజీపీ సాంబశివరావుని కలిశారు. తాము చెప్పిన అభ్యంతరాలను రాంగోపాల్వర్మ పరిగణనలోకి తీసుకోలేదని, సినిమాలోని అభ్యంతరకర దృశ్యాలను వెంటనే తొలగించాలని రాధాకృష్ణ విజ్ఞప్తి చేశారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more