సినీ నటుడు విశాల్ కు చెందిన చిత్ర నిర్మాణ సంస్థ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ (వీఎఫ్ఎఫ్) సభ్యత్వాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తూ తమిళ నిర్మాతల మండలి (టీఎఫ్పీసీ) ఈ నిర్ణయం తీసుకుంది. విశాల్ తాజాగా ఓ తమిళ మేగజిన్ కు ఇచ్చిన ఇంటర్వూలో పలు వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
‘పైరసీని అరికట్టడంలో తమిళ సినీ నిర్మాతలు తీవ్రంగా విఫలమయ్యారు. వాళ్ల మీటింగులు బోండాలు, బజ్జీల గురించి చర్చించటానికే తప్ప ఇండస్ట్రీకి ఏ మాత్రం ఉపయోగం ఉండదు’ అని విశాల్ వ్యాఖ్యానించాడు. దీనిపై ఆగ్రహించిన ప్రముఖ నిర్మాతలు విశాల్ తమకు క్షమాపణ చెప్పాలంటూ నడియాగర్ సంఘాన్ని ఆశ్రయించారు. అంతేకాదు ఇటీవలే తమిళ నిర్మాతల మండలి అతనికి నోటీసులు కూడా జారీ చేసింది. దీనిపై విశాల్ కూడా స్పందిస్తూ టీఎఫ్ పీసీకి ఓ లేఖ ద్వారా సమాధానం పంపాడు.
విశాల్ ఇచ్చిన వివరణ లేఖపై అసంతృప్తి వ్యక్తం చేసిన కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై న్యాయపోరాటం చేస్తానని విశాల్ అంటున్నాడు. నిర్మాతల మండలి నిర్ణయం నాకు షాక్ కాదు, ఆశ్చర్యం కలిగించింది. ఇంతకు ముందు నటుడు కరుణాస్ ఇలాంటి వ్యాఖ్యలే చేసినప్పుడు చర్యలు తీసుకోలేదు. నడిఘర్ లో గతంలో ఇలాంటి పరిస్థితులే చోటుచేసుకున్నప్పుడు పోటీ చేశాం. ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకుంటున్నాం. నిర్మాతల మండలి ఎన్నికల్లో కూడా పోలీ చేస్తాం అంటూ విశాల్ ప్రకటించాడు. కాగా, బయటి బ్యానర్ లలో కాకుండా, సొంత కంపెనీ వీఎఫ్ఎఫ్ ద్వారానే విశాల్ చాలా సినిమాలు తీస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే సీనియర్ నటుడు శరత్ కమార్ మీద విశాల్ పోలీస్ కేసు పెట్టబోతున్నాడట. నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఉన్నపుడు శరత్ కుమార్.. సంఘంలో మరో కీలక పదవిలో ఉన్న మరో సీనియర్ నటుడు రాధారవి కలిసి అక్రమాలకు పాల్పడినట్లు విశాల్ గుర్తించాడట. నడిగర్ సంఘానికి చెందిన ఓ స్థలాన్ని వాళ్లిద్దరూ అక్రమంగా సొంతం చేసుకున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నడిగర్ పరిణామాలు మరోసారి సౌత్ జనాలకు వివాదాల విందును పంచటం ఖాయంగా కనిపిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more