ఒకవైపు మండే ఎండలతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా వల్ల తెలుగు ప్రజల్లో వాతావరణం వేడెక్కిపోతుంది. సినీ జనాలు ఈ సినిమా టికెట్ల కోసం తెగ ప్రయత్నిస్తున్నారు. అసలే పవన్ కళ్యాణ్ క్రేజ్ ను దృష్టిలో వుంచుకొని చిత్ర నిర్మాతలు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం భాషలలో కూడా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ విడుదలకు సిద్ధమయ్యాడు.
తమ అభిమాన హీరో సినిమాను మొదటిరోజే చూడాలని అభిమానులు ఎంతగానో ఆరాటపడుతుంటారు. టికెట్ల కోసం ఎంత ఖర్చు అయినా పెడుతుంటారు. కానీ ఓ అభిమాని మాత్రం ఏకంగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా టికెట్ల కోసం 10లక్షల విలువ చేసే ఇల్లును అమ్మేసి టికెట్లు కొన్నాడట. కర్నూల్ జిల్లాలోని ఓ అభిమాని ఇలా టికెట్ల కోసం 10లక్షలు విలువ చేసే ఇల్లు అమ్మేసి టికెట్లు కొన్నాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.
ఈ విషయం విన్న తోటి అభిమానులు షాక్ కు గురవుతున్నారు. అయితే ఈ విషయం ఇంకా పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లిందో లేదో తెలియదు కానీ.. మొత్తానికి ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా టికెట్ల విషయంలో ప్రస్తుతం రచ్చ రచ్చ జరుగుతోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలవుతున్న థియేటర్ల వద్ద టికెట్ల కొరత ఏర్పడింది. ఇప్పటికే చాలా చోట్ల ముందుగానే బడా బాబులు టికెట్లను సొంతం చేసుకొని, భారీ రేటుకు బ్లాక్ లో టికెట్లను విక్రయిస్తున్నారు.
ఇక అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజులో అదరగొడుతున్నాయి. ఈ సినిమాకు వున్న క్రేజ్ దృష్ట్యా థియేటర్ యాజమాన్యాలు కూడా టికెట్ల రేటును పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పలు చోట్ల టికెట్ ధర పెంపుకోసం థియేటర్ల యాజమాన్యాల నుంచి అప్లికేషన్ వెళ్లినట్లుగా తెలిసింది. మొత్తానికి ‘సునామి బాధితులకు పులిహోర పోట్లాలు దొరికితే ఎలా వుంటుందో.... ప్రస్తుతం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ టికెట్లు దొరికితే అలా వుంటుంది’ అనే పరిస్థితి ఏర్పడింది.
- Sandy
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్లో ఇటు ఫ్యామిలీ... Read more