తమిళ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన నడిగర్ సంఘం ఎన్నికలు గరం గరంగా మారాయి. మిత్రుల్లా కలిసి వున్న తమిళ నటీనటుల మధ్య తీవ్రంగా కోల్డ్ వార్ మొదలయ్యింది. ఒకరికొకరు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో నటుడు శరత్ కుమార్, విశాల్ లు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ నడిగర్ సంఘం ఎన్నికలు ఈనెల 18న జరుగనున్నాయి. ఎన్నికలకు మరో 10 రోజుల గడువే ఉన్నందువల్ల ఒకరిపై ఒకరు విమర్శలు చేసేసుకుంటూ, ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా శరత్ కుమార్ టీం మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. శరత్ కుమార్ జట్టు నుంచి నడిగర్ సంఘానికి ఉపాధ్యక పదవికీ శింబు పోటీ చేస్తున్నాడు.
ఈ సంధర్భంగా శింబు మాట్లాడుతూ విశాల్ పై భారీగా ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒక కుటుంబం లాంటి నడిగర్ సంఘాన్ని విశాల్ చీల్చే ప్రయత్నం చేస్తున్నాడని, అలా చేస్తే చూస్తూ కూర్చోమని శింబు చెప్పుకొచ్చారు. అలాగే నడిగర్ సంఘం భవన నిర్మాణ భాధ్యతలను ఎస్.పి.ఐ సినిమాస్ సంస్థకు అప్పగించడంలో తప్పేముందని శింబు ప్రశ్నించారు.
Video Courtesy: Thanthi TV
అంతే కాకుండా నటుడు పూచి మురుగన్ నడిగర్ సంఘ భవన నిర్మాణ వ్యవహారంలో కోర్టులో వేసిన పిటీషన్ను వాపస్ తీసుకోవాలని చెబితే ఎందుకు వాపస్ తీసుకోలేదని, భవనాన్ని పడగొట్టినప్పుడు ఎందుకు రెస్పాండ్ అవలేదని శింబు ప్రశ్నించారు. సంఘం పక్కకే రానివారు అవినీతి, అక్రమాలు అని ఆరోపించడమా? సీనియర్ నటులు నడిగర్ సంఘం కోసం ఎంతో కృషి చేసారు. అందులో విశాల్కు ఏం అర్హత ఉందని నడిగర్ సంఘం వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు, అసలు ప్రశ్నించే అర్హత విశాల్ కు ఎక్కడ వుందని శింబు ఆగ్రహం వ్యక్తం చేసారు.
అయితే నడిగర్ సంఘం సమైక్యంగా ఉండాలని తాము కోరుకుంటున్నామని, అందుకోసం ఎన్నికల పోటి నుంచి తప్పుకోవడానికి కూడా తాము సిద్ధమేనని శింబు చెప్పుకొచ్చారు. మరి శింబు మాటలపై విశాల్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఏదేమైనా కూడా మొన్నటి వరకు మిత్రుల్లా వున్న ఈ నటుల మధ్య ప్రస్తుతం మాటల యుద్ధం బాగానే కొనసాగుతుందని అర్థమవుతోంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more