‘బాహుబలి’ చిత్రం సృష్టించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. విశ్వవ్యాప్తంగా ప్రశంసలు పొందడంతోపాటు అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణాది సినిమాగా సంచలనం సృష్టించింది. తెలుగు సినిమా చరిత్రలోనే కాదు... ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ సంచలనంగా నిలిచిన ‘బాహుబలి’.. ఇండియన్ డొమెస్టిక్ మార్కెట్లో అత్యధిక వసూలు చేసిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అన్ని బాషల్లో కలిపి ఈ చిత్రం దాదాపు 650 కోట్లు వసూలు చేసిన అందరినీ ఆశ్చర్య పరిచింది.
ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని చాటిచెప్పిన సినిమాగా పేరుగాంచింది. ఇలా లెక్కపెట్టుకుంటూపోతే.. ఆ సినిమాను పొడిగేందుకు మాటలు చాలవేమో అన్నంతగా సత్తా చాటింది. ఇన్ని రికార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమా బుల్లితెరపై మరో సంచలనం సృష్టించేందుకు సన్నద్ధమైంది. ఇప్పటిదాకా కాస్తోకూస్తో డబ్బులు ఇచ్చుకుని తమ ప్రోడక్టులను బుల్లితెరపై ప్రచారం చేసుకున్న కొన్ని ప్రైవేట్ కంపెనీలకు ఈ సినిమా చుక్కలు చూపించనుంది.
ఈ సినిమా శాటిలైట్ హక్కులను ‘మా టీవీ’ దాదాపు 18 కోట్ల రూపాయలకు కొన్న విషయం తెల్సిందే! దసరా సందర్భంగా అక్టోబర్ 25న ఈ మూవీని బుల్లితెరపై ప్రసారం చేయనున్నారు. అయితే.. తెలుగు ఇండస్ట్రీలోనే ఇదివరకెన్నడూ లేనంతగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ భారీగా అమ్ముడుపోయాయి. దీంతో మాటీవి యాజమాన్యం అంత పెద్ద మొత్తాన్ని తిరిగి రాబట్టుకోవాలని ఉద్దేశంతో.. ఈ సినిమా బ్రేక్ టైమ్ లో కాస్త ఎక్కువ డబ్బుల్ని యాడ్స్ ద్వారా వసూలు చేసేందుకు ప్లాన్ వేసింది. బ్రేక్ టైమ్లో కేవలం 10 సెకన్ల యాడ్కు దాదాపు రూ. 2.5 లక్షల రూపాయలు చెల్లించాలని యాజమాన్యం రేట్ ఫిక్స్ చేసింది. ఈ విషయం తెలిసిన కొన్ని కంపెనీలు తొలుత ఆశ్చర్యానికి గురైనా.. ఆ తర్వాత అంత మొత్తం ఇచ్చేందుకు అంగీకరించినట్లు సమాచారం. నిజానికి.. ఇప్పటి వరకు ఏ సినిమాకు యాడ్స్ ఇంత ఖరీదుగా లేవు. ఇంకా చాలా తక్కువగానే వుంటాయి. దీన్ని బట్టే ‘బాహుబలి’ సినిమా క్రేజ్ ఎంత వుందో అర్థం చేసుకోవచ్చు. అయితే.. ‘బాహుబలి’ లాంటి సినిమా బుల్లితెరపై ప్రసారం అవుతున్నప్పుడు దాని బ్రేక్ టైంలో అంత మొత్తం ఇవ్వడంలో ఆశ్చర్యం ఏమీ లేదని ట్రేడ్ వర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి.
కేవలం ఆ సినిమాను బుల్లితెరపై వేసినప్పుడే కాదు.. ఆ చిత్రం వేసే ఓ రోజు ముందు అంటే 24వ తేదీన తమ షూటింగ్ అనుభవాల గురించి రాజమౌళితోపాటు ప్రభాస్, రానా, తమన్నా, అనుష్కలు వివరించనున్నారు. వారి ఇంటర్వ్యూలను దాదాపు రెండు గంటలపాటు ఈ ఛానల్ టెలికాస్ట్ చేయనుంది. అప్పుడు కూడా బ్రేక్ సమయంలో 10 సెకన్ల యాడ్ కు రూ.2.5 లక్షలు చెల్లించాల్సి వుంటుంది. దీన్ని బట్టి చూస్తుంటే.. మాటివికి ‘బాహుబలి’ సినిమా ద్వారా శాటిలైట్ కొనుగోలు చేసిన డబ్బుల కంటే మరింత ఎక్కువ లాభాలు వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more