‘నా’ అన్న పదం ఒక్కరికి మాత్రమే గుర్తింపునివ్వడంతోపాటు స్వార్థానికి అర్థమిస్తుంది... కానీ ‘మా’ అన్న పదం నలుగురిని ఉత్సాహపరచడంతోపాటు అందరినీ ఏకతాటిపై నిలుపుతుంది. ఇదే నిర్వచనానికి ‘మెగాఫ్యామిలీ’ నాటికి, నేటికి ప్రతిరూపంగా నిలుస్తోంది. అదెలా అంటారా..? సినీ ఇండస్ట్రీలోనే కాకుండా సహజంగా జరిగే ప్రమాదాల్లో తమ ఆస్తులను, ఆత్మీయులను కోల్పోయిన వారికి మొత్తంగా కాకపోయినా.. కనీసం తమవంతు కృషిగా విరాళాలు అందిస్తూ ఇతరులకు నిదర్శనంగా నిలుస్తుంది ఈ ఫ్యామిలీ!
ఇందుకు ఉదాహరణగా.. ఇటీవలే విధ్వంసం సృస్టించిన హుధూద్ తుపాను నేపథ్యంలో ఈ ఫ్యామిలీలో వున్న అందరూ హీరోలు కలిసి రూ.కోటికి పైగా డబ్బులు విరాళంగా ఇచ్చారు. అంతేకాదు.. ప్రాణాలను అరచేతిలో పట్టుకుని చివరిశ్వాస తీసుకుంటున్న చిన్నారులను వీరు ఆదుకుంటున్నారు. పవన్ ఇలా ఓ అమ్మాయి ప్రాణాలను కాపాడగా.. రాంచరణ్ కూడా ఆయన బాటలోనే నడుస్తూ ఓ అబ్బాయి చికిత్సకు విరాళంగా రెండు లక్షలు ఇచ్చాడు. అలాగే.. ఇటీవలే యూట్యూబ్ లో హల్ చల్ చేసిన ఓ చిన్న కుర్రాడికి ఆర్థికపరంగా ఆదుకుంటానని, అతని చదువుకు అయ్యే ఖర్చును అంతా భరిస్తానని హామీ కూడా ఇచ్చాడు. ఇలా.. ఎంతోమందిని ఏదో ఒకరకంగా ఈ మెగాఫ్యామిలీలోని కుటుంబసభ్యులు విరాళాలు ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా పేదకళాకారులకోసం ఈ ఫ్యామిలీ మెంబర్స్ రూ.6 లక్షలు విరాళమిచ్చి అందరికీ మరోసారి ఆదర్శంగా నిలిచారు.
వివరాల్లోకి వెళ్తే.. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ‘మా’ ఎన్నికల పోరులో నటకిరీటి రాజేంద్రప్రసాద్ 87 ఓట్లతో గెలుపొందిన విషయం తెలిసిందే! ఇప్పటికే ఆయన ప్రమాణస్వీకారం అయిపోయింది కూడా! ఈ నేపథ్యంలోనే ‘మా’ కోసం మెగా ఫ్యామిలీ హీరోలు రూ. 6 లక్షల విరాళం అందించారు. రామ్ చరణ్ 2 లక్షలు, అల్లు అర్జున్ 2 లక్షలు, వరుణ్ తేజ్ 1 లక్ష, సాయి ధరమ్ తేజ్ 1 లక్ష విరాళం ఇచ్చారు. రాజేంద్రప్రసాద్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా నాగబాబు ఇందుకు సంబంధించిన చెక్ ఆయనకు సమర్పించారు. దీంతో ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా కొనసాగుతూ కోట్లు సంపాదిస్తున్న ఇతర హీరోలు కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం విరాళాలు అందిస్తే బావుటుందని, ఇలా విరాళాలు ఇవ్వడం ద్వారా పేదకళాకారులకు సహాయం చేసిన వారవుతారని పలువురు ఆర్టిస్టులు అభిప్రాయ పడుతున్నారు.
ఈ సందర్భంగానే రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ... పేద కళాకారులకు మంచి చేయాలనే తాను ఈ ఎన్నికల్లో పోటీ చేసానని, సంకల్పబలమే తమను ముందుకు నడిపించిందని చెప్పుకొచ్చారు. కార్పస్ ఫండ్, పెన్షన్ డబ్బులు ఎక్కడి నుండి తీసుకొస్తారనే ఆందోళన అవసరం లేదు. ‘నాగబాబుగారు విరాళంతో మొదలు పెట్టారు. విదేశాల్లోని మిత్రులు కూడా విరాళాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో పూర్తి స్థాయిలో మార్పు తీసుకొస్తాం’ అన్నారు. త్వరలోనే జనరల్ బాడీ మీటింగు ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more