Mega Family members donates 6 lakhs to maa for poor artists | Nagababu Press meet

Mega family members donates 6 lakhs to maa for poor artists

mega family, ram charan, allu arjun, sai dharam tej, varun tej, chiranjeevi, nagababu, rajendra prasad news, movie artist association, shivaji raja news, ram charan controversy, chiranjeevi controversy, rajendra prasad controversy, maa controversy

Mega Family members donates 6 lakhs to maa for poor artists : Mega Family Members Donates 6 Lakhs To MAA for Poor Artists. Nagababu Has Given This Cheque To Rajendra Prasad In Oath Ceremony.

‘మా’కి నిర్వచనం మెగాఫ్యామిలీ.. పేదలకు ‘6’ర్థిక సహాయం!

Posted: 04/20/2015 01:47 PM IST
Mega family members donates 6 lakhs to maa for poor artists

‘నా’ అన్న పదం ఒక్కరికి మాత్రమే గుర్తింపునివ్వడంతోపాటు స్వార్థానికి అర్థమిస్తుంది... కానీ ‘మా’ అన్న పదం నలుగురిని ఉత్సాహపరచడంతోపాటు అందరినీ ఏకతాటిపై నిలుపుతుంది. ఇదే నిర్వచనానికి ‘మెగాఫ్యామిలీ’ నాటికి, నేటికి ప్రతిరూపంగా నిలుస్తోంది. అదెలా అంటారా..? సినీ ఇండస్ట్రీలోనే కాకుండా సహజంగా జరిగే ప్రమాదాల్లో తమ ఆస్తులను, ఆత్మీయులను కోల్పోయిన వారికి మొత్తంగా కాకపోయినా.. కనీసం తమవంతు కృషిగా విరాళాలు అందిస్తూ ఇతరులకు నిదర్శనంగా నిలుస్తుంది ఈ ఫ్యామిలీ!

ఇందుకు ఉదాహరణగా.. ఇటీవలే విధ్వంసం సృస్టించిన హుధూద్ తుపాను నేపథ్యంలో ఈ ఫ్యామిలీలో వున్న అందరూ హీరోలు కలిసి రూ.కోటికి పైగా డబ్బులు విరాళంగా ఇచ్చారు. అంతేకాదు.. ప్రాణాలను అరచేతిలో పట్టుకుని చివరిశ్వాస తీసుకుంటున్న చిన్నారులను వీరు ఆదుకుంటున్నారు. పవన్ ఇలా ఓ అమ్మాయి ప్రాణాలను కాపాడగా.. రాంచరణ్ కూడా ఆయన బాటలోనే నడుస్తూ ఓ అబ్బాయి చికిత్సకు విరాళంగా రెండు లక్షలు ఇచ్చాడు. అలాగే.. ఇటీవలే యూట్యూబ్ లో హల్ చల్ చేసిన ఓ చిన్న కుర్రాడికి ఆర్థికపరంగా ఆదుకుంటానని, అతని చదువుకు అయ్యే ఖర్చును అంతా భరిస్తానని హామీ కూడా ఇచ్చాడు. ఇలా.. ఎంతోమందిని ఏదో ఒకరకంగా ఈ మెగాఫ్యామిలీలోని కుటుంబసభ్యులు విరాళాలు ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా పేదకళాకారులకోసం ఈ ఫ్యామిలీ మెంబర్స్ రూ.6 లక్షలు విరాళమిచ్చి అందరికీ మరోసారి ఆదర్శంగా నిలిచారు.

nag-rajendra-cheque

వివరాల్లోకి వెళ్తే.. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ‘మా’ ఎన్నికల పోరులో నటకిరీటి రాజేంద్రప్రసాద్ 87 ఓట్లతో గెలుపొందిన విషయం తెలిసిందే! ఇప్పటికే ఆయన ప్రమాణస్వీకారం అయిపోయింది కూడా! ఈ నేపథ్యంలోనే ‘మా’ కోసం మెగా ఫ్యామిలీ హీరోలు రూ. 6 లక్షల విరాళం అందించారు. రామ్ చరణ్ 2 లక్షలు, అల్లు అర్జున్ 2 లక్షలు, వరుణ్ తేజ్ 1 లక్ష, సాయి ధరమ్ తేజ్ 1 లక్ష విరాళం ఇచ్చారు. రాజేంద్రప్రసాద్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా నాగబాబు ఇందుకు సంబంధించిన చెక్ ఆయనకు సమర్పించారు. దీంతో ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా కొనసాగుతూ కోట్లు సంపాదిస్తున్న ఇతర హీరోలు కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం విరాళాలు అందిస్తే బావుటుందని, ఇలా విరాళాలు ఇవ్వడం ద్వారా పేదకళాకారులకు సహాయం చేసిన వారవుతారని పలువురు ఆర్టిస్టులు అభిప్రాయ పడుతున్నారు.

ఈ సందర్భంగానే రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ... పేద కళాకారులకు మంచి చేయాలనే తాను ఈ ఎన్నికల్లో పోటీ చేసానని, సంకల్పబలమే తమను ముందుకు నడిపించిందని చెప్పుకొచ్చారు. కార్పస్ ఫండ్, పెన్షన్ డబ్బులు ఎక్కడి నుండి తీసుకొస్తారనే ఆందోళన అవసరం లేదు. ‘నాగబాబుగారు విరాళంతో మొదలు పెట్టారు. విదేశాల్లోని మిత్రులు కూడా విరాళాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో పూర్తి స్థాయిలో మార్పు తీసుకొస్తాం’ అన్నారు. త్వరలోనే జనరల్ బాడీ మీటింగు ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mega Family  Nagababu  Rajendra Prasad  MAA Controversy  

Other Articles