పవర్ స్టార్ పవన్ కళ్యాన్ మొట్ట మొదటి సారి భారీ సభ పెడుతున్న విషయం తెలిసిందే. ఈ సారి మాత్రం లక్షలాది మంది జనంలోనే జనసేనాధిపతి మాట్లాడబోతున్నాడు. రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు జరగనట్లుగా 5 నుంచి 6 లక్షల మంది యువతతో ఈ సభ నిర్వహించనున్నట్లు జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి.
రేపు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే సభలో పవన్ సుదీర్ఘంగా పార్టీ విధి, విధానాలను, సిద్ధాంతాలను వివరిస్తారని చెప్పాయి. అందుకోసం జనసేన పార్టీ ఈ నెల 27న విశాఖపట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహించతలపెట్టింది. ఈ సభకు ప్రచారంగా రాష్టవ్య్రాప్తంగా ప్రతీ గ్రామంలో బైక్ ర్యాలీలు నిర్వహించాలని పవన్ అభిమానులకు పిలుపునిచ్చింది.
విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ‘యూత్ ఫర్ నేషన్, ఫైట్ ఫర్ నేషన్' అనే నినాదంతో ఈ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అలాగే యువత కోసం పవన్ ప్రత్యేక శ్రద్ధతో కంపోజ్ చేయించిన గీతంతోపాటు జనసేన సిద్ధాంతాలకు సంబంధించి ఆయన తన స్నేహితుడు సహకారంతో రచించిన ‘ఇజం' పుస్తకాన్ని ఆవిష్కరిస్తారని చెప్పాయి.
అంతేకాకుండా తనపై ఇతర పార్టీ నేతలు చేసిన తీవ్ర విమర్శలకు పవన్ అంతే ధీటుగా సమాధానమివ్వనున్నాడని తెలుస్తోంది. పార్టీ ఆవిర్భావం తర్వాత నిర్వహిస్తున్న తొలి భారీ బహిరంగ సభకావడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశముంది కాబట్టి అందుకు తగ్గట్లుగానే పవన్ సన్నిహితులు దగ్గరుండి మరీ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ముఖ్యంగా సభకు హాజరయ్యే మహిళల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జనసేన సభకు వచ్చే అభిమానులకు, ఆత్మీయులకు, శ్రేయోభిలాషులకు తగిన ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇందిరా ప్రియదర్శిని స్టేడియం జనసేన పార్టీ జెండాలతో నిండిపోయినట్లు తెలుస్తోంది .
ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more