ఒకప్పుడు టాప్ రేసులో దూసుకుపోయిన దర్శకుడు పూరీ జగన్నాథ్ గత కొంత కాలంగా కాస్త వెనకబడిన విషయం తెలసిందే. తనకంటూ ఓ ప్రత్యేక శైలిని క్రియేట్ చేసుకున్న పూరీ ఓ సినిమా తీశామా వదిలేశామా అనే విధంగా తయారవడంతో వరుస డిజాస్టర్లు చవిచూడాల్సి వచ్చింది. ఎప్పుడు బ్యాంకాక్ లో హోటల్స్ కూర్చొని కథలు రాసుకునే పూరీ కి ఏ కథలు తట్టడం లేనట్లుంది. అందుకే ఇతడు పాత సినిమాల్ని రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం తాను రాసుకొన్న సొంత స్ర్కిప్టుతో నితిన్ హీరోగా ‘హార్ట్ ఎటాక్ ’ సినిమా తీస్తున్న పూరీ దాని తరువాత కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గత రెండు దశాబ్దాల క్రితం నటించిన ‘అసెంబ్లీ రౌడీ ’ చిత్రాన్ని ఆయన కుమారుడు మంచు విష్ణును హీరోగా పెట్టి తీసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. నితిన్ సినిమా పూర్తవగానే ఈ చిత్రాన్ని ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్లుగా తెరకెక్కించబోతున్నాడు. దీనికి సబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more