రెడ్ ఎంఐ ప్లాగ్ షిప్ తో భారతీయ విఫణిలో సంచలనాలకు తెరతీస్తున్న చైనాకు చెందిన షియోమీ సంస్థ.. మరో నూతన ఉత్పాదనతో మార్కెట్లోకి రానుంది. ఇప్పటికే దేశీయ మార్కెట్లో అందులోనూ మరీ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల విభాగంలో రారాజులా వెలుగొందిన సామ్ సంగ్ ను వెనక్కి నెట్టి దూసుకుపోతున్న షియోమీ.. మరో నూతన స్మార్ట్ ఫోన్ ను ఈ నెల 14న దేశీయ విఫణిలో అవిష్కరించనుంది. ఇటీవలే రెడ్ ఎంఐ నోట్ 5, 5 ప్రోలను ఆవిష్కరించిన షియోమీ.. రెడ్ ఎంఐ 5ఏ మోడల్ ను కూడా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.
ఇలా నిత్యం తన నూతన అవిష్కరణలో భారతీయుల అదరణను చూరగోన్న ఈ సంస్థ.. నెల వ్యవధిలోనే రెండు టీవీలను మార్కెట్లోకి ప్రవేశపెట్టి.. టీవీల విక్రయాలలో కూడా తనదే పైచేయి సాధించాలని ఊవ్విళ్లూరుతుంది. ఈ క్రమంలో ఈ నెల 14న మరో స్మార్ట్ ఫోన్ ను షియోమీ సంస్థ విడుదల చేయబోతోంది. అది రెడ్ ఎంఐ 5ఏకి అదనపు ఫీచర్లతో వస్తున్న నూతన ఉత్పాదన లేక పూర్తిగా భిన్నంగా వస్తున్న మరొ నూతన స్మార్ట్ ఫోనా..? అన్న విషయంలో మాత్రం కంపెనీ ఇంకా రహస్యంగానే వుంచింది. అయితే అది రెడ్ మీ 5 కావచ్చని, లేదా మరో స్మార్ట్ టీవీ కావచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు.
రెడ్ ఎంఐ 4కు తదుపరి జనరేషన్ మోడల్ 5గా రానుంది. 4ఏ మోడల్ స్థానంలో 5ఏను తీసుకురాగా, రెడ్ ఎంఐ 4, 2017 మోడల్ కు సమాంతరంగా మరో స్మార్ట్ ఫోన్ ను ఇంకా విడుదల చేయలేదు. కనుక ఈ నెల 14న ఆవిష్కరించే మోడల్ అదేనని భావిస్తున్నారు. రెడ్ ఎంఐ 5 మోడల్ లో 5.7 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే, 1.8 గిగాహెర్జ్ ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 450 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ నౌగత్ 7.1 వెర్షన్ ఓఎస్, ఎంఐయూఐ 9, 2జీబీ, 3జీబీ ర్యామ్, 16జీబీ, 32జీబీ వెర్షన్లతో ఈ మోడల్ ను కంపెనీ తీసుకొస్తున్నట్టు సమాచారం. ఇంకా 12 మెగా పిక్సల్స్ రియర్ కెమెరా, ఎల్ ఈ డీ ఫ్లాష్, ముందు భాగంలో 5మెగా పిక్సల్స్ కెమెరా, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి.
(And get your daily news straight to your inbox)
Jan 30 | అంతర్జాతీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ తన కొత్త ఎక్స్7 సిరీస్ 5జీ మొబైల్ ఫోన్లను ఫిబ్రవరి 4న భారత్ లో అవిష్కరించనుంది. ఈ నేపథ్యంలో వాటి ధరలు ఎలా వుంటాయన్న... Read more
Dec 30 | ప్రస్తుత సంవత్సరం 2020 నెటిజనుల విమర్శలు, వ్యంగోక్తుల తరహాలోనే నిజంగా ఈ ఏడాదికే వైరస్ సోకిందా.? అంటే కాదనక తప్పదు. కరోనా వైరస్ సోకిన ఈ ఏడాది వస్తూనే యావత్ ప్రపంచ వాణిజ్యాన్ని లాక్... Read more
Dec 09 | కేఫ్ కాఫీ డే దేశవ్యాప్తంగా పలువురు కాఫీ ప్రియులను అలరించే ఓ పెద్ద బ్రాండ్. ఈ సంస్థ ఎవరిది.. ఎవరు ప్రారంభించారు.. అన్న వివరాలు గత ఏడాది వరకు ఎవరికీ తెలియదు. అయితే గత... Read more
Sep 25 | అంతర్జాతీయంగా బంగారం ధరల పతనం కొనసాగుతోంది. అటు క్రూడ్ అయిల్ తో పాటు ఇటు డాలర్ బలాన్ని పుంజుకోవడంతో క్రమంగా గత కొన్నాళ్లుగా బంగారంపై పెట్టుబడులు పెట్టిన మదుపరులు అమ్మకాలకు మొగ్గచూపుతున్న కారణంగా అంతర్జాతీయంగా... Read more
Aug 22 | దేశీయ విపణిలోకి మరో విద్యుత్ ద్విచక్రవాహనం వచ్చింది. పుణెకు చెందిన స్టార్టప్ కంపెనీ టెక్నో ఎలెక్ట్రా మోటార్స్ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాన్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది, ఈ సరికొత్త ఇ-మోపెడ్ ‘సాథీ’ని దేశీయ విపణిలోకి తీసుకువచ్చింది.... Read more