దేశీయ కార్ల దిగ్గజం మారుతీ సుజుకి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ఇగ్నిస్ మోడల్ బుకింగ్స్ ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. వాహన ప్రియుల కోసం మారుతీ సుజుకి తీసుకువస్తున్న ఇగ్నస్ కారు బుకింగ్లను ప్రారంభిస్తున్నట్టు మారుతీ తెలిపింది. ఈ నెల 13 నుంచి డెలివరీలు ప్రారంభించనున్న ఈ కారును కొనుగోలు చేయాలని భావించే వాహన ప్రియులు కంపెనీ నెక్సా వెబ్సైట్లో రూ.11,000కు ఇగ్నిస్ను బుక్ చేసుకోవాలని కంపెనీ పేర్కొంది. ఈ ఏడాది భారీ ఎత్తున్న లాంచ్ చేయబోయే మోడళ్లలో ఇగ్నిస్ ఒకటి.
దేశీయంగా నెక్సా లైన్-అప్లో విక్రయిస్తున్న మోడళ్లలో ఇది మూడోది. 2016 ఢిల్లీ ఆటో ఎక్స్పో మొదటిసారి దీన్ని ప్రదర్శించారు. పూర్తిగా కొత్త డిజైన్లో ఈ కారును తీసుకురావడం కంపెనీకి అత్యంత కీలకంగా మారింది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో ఇగ్నిస్ 14 వేరియంట్లలో అందుబాటులోకి వస్తుంది. గుజరాత్లో ఏర్పాటుచేసిన కొత్త ప్లాంటులో ఈ కారును కంపెనీ తయారుచేసింది. మహింద్రా కేయూవీ 100కి పోటీగా ఇగ్నిస్ మోడల్ మార్కెట్లోకి రాబోతుంది. అయితే దీని ధర మాత్రం 5 లక్షల రూపాయల నుంచి 7 లక్షల రూపాయల వరకు ఉంటుందని కంపెనీ వర్గాల సమాచారం.
ఇగ్నిస్ మోడల్ ప్రత్యేకతలు...
1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్
1.3 లీటర్ డీజిల్ ఇంజిన్
5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్సిమిషన్, దాంతో పాటు ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్
ఎల్ఈడీ డీఆర్ఎల్స్తో హెడ్ల్యాంప్స్
నావిగేషన్తో టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్
ఆపిల్ కార్ప్లే
యూఎస్బీ
ఏయూఎక్స్
భద్రతా పరమైన ఫీచర్లు: యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్
డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్
(And get your daily news straight to your inbox)
Dec 30 | ప్రస్తుత సంవత్సరం 2020 నెటిజనుల విమర్శలు, వ్యంగోక్తుల తరహాలోనే నిజంగా ఈ ఏడాదికే వైరస్ సోకిందా.? అంటే కాదనక తప్పదు. కరోనా వైరస్ సోకిన ఈ ఏడాది వస్తూనే యావత్ ప్రపంచ వాణిజ్యాన్ని లాక్... Read more
Dec 09 | కేఫ్ కాఫీ డే దేశవ్యాప్తంగా పలువురు కాఫీ ప్రియులను అలరించే ఓ పెద్ద బ్రాండ్. ఈ సంస్థ ఎవరిది.. ఎవరు ప్రారంభించారు.. అన్న వివరాలు గత ఏడాది వరకు ఎవరికీ తెలియదు. అయితే గత... Read more
Sep 25 | అంతర్జాతీయంగా బంగారం ధరల పతనం కొనసాగుతోంది. అటు క్రూడ్ అయిల్ తో పాటు ఇటు డాలర్ బలాన్ని పుంజుకోవడంతో క్రమంగా గత కొన్నాళ్లుగా బంగారంపై పెట్టుబడులు పెట్టిన మదుపరులు అమ్మకాలకు మొగ్గచూపుతున్న కారణంగా అంతర్జాతీయంగా... Read more
Aug 22 | దేశీయ విపణిలోకి మరో విద్యుత్ ద్విచక్రవాహనం వచ్చింది. పుణెకు చెందిన స్టార్టప్ కంపెనీ టెక్నో ఎలెక్ట్రా మోటార్స్ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాన్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది, ఈ సరికొత్త ఇ-మోపెడ్ ‘సాథీ’ని దేశీయ విపణిలోకి తీసుకువచ్చింది.... Read more
Jul 15 | రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త టెక్నాలజీలను తీసుకొస్తున్నట్టు ఇవాళ ప్రకటించింది. జియో ప్లాట్ ఫామ్స్ లో భాగంగా జియో గ్లాస్, జియో టీవీ ప్లస్, జియో మార్ట్ లను తీసుకొస్తున్నట్టు రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్... Read more