డెరివేటివ్ల సిరీస్ ముగింపు సెషన్లో 2013 ఆగస్టు తర్వాత మొదటిసారి దేశీయ మార్కెట్లు భారీ స్థాయిలో నష్టపోయాయి. అటు రూపాయి విలువ కూడా భారీ స్థాయిలో పడిపోయి అల్ టైమ్ కనిష్ట స్థాయిని పడిపోయింది.ఇవాళ్టి ట్రేడింగ్ లో 30 పైసలు కోల్పోయి 68.86 స్థాయిని రూపాయి తాకింది. అంతర్జాతీయ స్థాయిలో డాలర్కు డిమాండ్ పెరగడం, విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను తరలించడంతో రూపాయి మరింత క్షీణించింది. క్రితం రోజు కూడా 31 పైసలు కోల్పోయిన రూపాయి నిన్నటి క్లోజింగ్ 68.56 నుంచి మరింతగా దిగజారింది.
దీంతో ఆర్బీఐ రంగంలోకి దిగి, భారీ ఎత్తున డాలర్ అమ్మకాలు చేపట్టింది. ఏకంగా 50 కోట్ల మిలియన్ డాలర్లను విక్రయించడంతో రూపాయి కొంత కోలుకుని, 18 పైసల నష్టంతో 68.74వద్ద ముగిసింది. భారత క్యాపిటల్ మార్కెట్ల నుంచి తరలిపోతున్న అవుట్ఫ్లోస్తో రూపాయి విలువ భారీ స్థాయిలో పడిపోతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే కొన్ని నెలల్లో రూపాయి విలువ 70కి పడిపోయిన ఆశ్చర్యం లేదని పేర్కొంటున్నారు. గతంలో 2013 ఆగస్ట్లో రూపాయి తన జీవితకాల కనిష్ఠ స్థాయి 68.85ని తాకింది. ఇవాళ 68.84 రూపాయల కనిష్టస్థాయిని తాకింది.
రెండు రోజుల వరుస లాభాలతో మురిపించిన స్టాక్ మార్కెట్లు ఇవాళ మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం అరంభమైన సమయం నుంచి సూచీలు నెలచూపులు చూడటం ప్రారంభమైంది. దీంతో ఉదయం పది గంటల సమయానికి సెన్సెక్స్ 100 పాయింట్ల నష్టంతో 25,952వద్ద, నిఫ్టీ 39పాయింట్ల నష్టంతో 7994వద్ద ట్రేడింగ్ సాగించాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 140, నిఫ్టీ 50 పాయింట్లకు పైగా నష్టపోయాయి. మరోసారి మార్కెట్లు కీలక మద్దతుస్థాయిలకు దిగువకు పడిపోయాయి. సెన్సెక్స్ 26000 నిఫ్టీ 8000 పాయింట్ల కిందికి దిగజారాయి. ఇక ముగింపు సమయానికి సెన్సెక్స్ 192 పాయింట్లు నష్టంతో 25 వేల 860 పాయింట్ల వద్దకు చేరుకోగా, అటు నిఫ్టీ 68 పాయింట్ల నష్టంతో 7వేల 965 పాయింట్ల వద్ద ముగిసి.. కీలకమైన 8000 మార్కుకు దిగువకు చేరాయి.
ఈ నేపథ్యంలో అటో రంగంతో పాటు బ్యాంకింగ్, బ్యాంకింగ్ నిఫ్టీ, హెల్త్ కేర్, అయిల్ అండ్ గ్యాస్ కన్జూమర్ డ్యూరబుల్స్ సూచీలు భారీ నష్టాల్లో పయనించగా, చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమల సమాఖ్యలుతో పాటు ఎఫ్ఎంజీసీ సూచీలు స్వల్ప నష్టాలను ఎదుర్కోన్నాయి. కాగా ఐటీ, మెటల్స్ సూచీలు భారీ లాభాలను అర్జించాగా, టెక్నాలజీ, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ సూచీలు స్వల్ప లాభాలను అర్జించాయి. ఈ క్రమంలో హిండాల్కో, బ్యాంక్ అప్ బరోడా, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, ఏసీసీ, అంబుజా సిమెంట్స్ తదితర సంస్థల షేర్లు అధిక లాభాలను ఆర్జించగా, జీ ఎంటర్ట్మైనెంట్, టాటా మోటార్స్, టాటా మోటార్స్ డీజీల్, కోటక్ మహీంద్రా, ఏషియర్ మోటార్స్ తదితర సంస్థల షేర్లు నష్టాల్లో కూరుకుపోయాయి.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more