దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ప్రారంభంతోనే కుప్పకూలాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంతో మార్కెట్లు కుదేలయ్యాయి. నల్లధనం, అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తామని చెబుతూ కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం 500, 1000 రూపాయల కరెన్సీ నోట్లను రద్దు చేయడం మదుపరులకు రుచించకపోవడంతో దేశీయ సూచీలపై దాని ప్రబావం వడింది. ఈ నేపథ్యంలో గత వారం రోజుల నుంచి పతనం దిశగా పయనిస్తున్న మార్కెట్లు ఇవాళ కూడా అదే దారిలో పయనించాయి.
ఉదయం ప్రారంభంతోనే మార్కెట్లు కుదేలయ్యాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా నష్టపోయి ట్రేడింగ్ సాగించగా, అటు నిఫ్టీ కూడా 121 పాయింట్ల నష్టంలో ట్రేడింగ్ సాగించింది. దీంతో ఆరంభంలోనే సెన్సెక్స్ 332 పాయింట్లు కోల్పయి 26 వేల 500 మార్కుకు దిగువకు జారీ ట్రేడింగ్ కొనసాగించింది. నిఫ్టీ కూడా 121 పాయింట్ల నష్టంతో 8200 కీలక మార్కు దిగువకు చేరి ట్రేడింగ్ సాగించింది. ఇక ముగింపు సమయానికి సెన్సెక్స్ ఏకంగా 514 పాయింట్లు నష్టపోయి 26 వేల 304 పాయింట్ల వద్దకు చేరుకోగా, అటు నిఫ్టీ కూడా 188 పాయింట్లకు పైగా నష్టపోయి 8వేల 108 పాయింట్ల వద్ద ముగిసి.. కీలకమైన 8100 మార్కుకు ఎగువకు చేరుకుంది.
ఈ నేపథ్యంలో ఐటీ సూచీలు స్వల్పంగా లాభాలను అందుకోగా మిగిలిని అన్ని సూచీలు నష్టాలలోనే పయనించాయి. ముఖ్యంగా అటో, బ్యాంకింగ్, మెటల్స్, బ్యాంకింగ్ నిఫ్టీ, చిన్నతరహా, మధ్య తరహా, మధ్య తరహా సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంజీసీ సహా మిగిలిన అన్ని రంగాల సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, టెక్నాలజీ రంగాల సూచీలు నెలచూపులు చూశాయి. ఈ క్రమంలో బ్యాంక్ అఫ్ బరోడా, ఐడియా సెల్యూలార్, ఎస్ బీఐ, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, విప్రో, హెచ్ యూఎల్ తదితర సంస్థల సూచీలు అధిక లాభాలను ఆర్జించగా, టాటా మోటార్స్, టాటా మోటార్స్ (డీజిల్), గ్రాసిమ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, హెచ్ డీఎఫ్ సీ తదితర సంస్థల షేర్లు నష్టాల్లో కూరుకుపోయాయి.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more