దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలను అర్జించాయి. ఇవాళ అర్జించిన లాభాలతో ఏడు మాసాల గరిష్ట స్థాయిని మార్కెట్లు అందుకున్నాయి. ఉదయం మార్కెట్లు ప్రారంభం కాగానే నష్టాలను చవిచూసిన మార్కెట్లు అప్పటి నుంచి తీవ్ర ఒడిదోడుకులకు లోనయ్యాయి. చివరి సెషన్ లో చివరి గంట మాత్రమే లాభాలతో దూసుకెళ్లాయి. మధ్యాహ్నం 2:20 గంటల సమయంలో 26,720 పాయింట్ల వద్ద ఉన్న సెన్సెక్స్, 3:10 గంటలకు 26,864 పాయింట్లకు చేరుకుంది, అటు నిఫ్టీ కూడా 8200 పాయింట్ల మార్కును అధిగమించింది.
దీంతో ఇవాళ మార్కెట్ ముగిసేసరికి సెన్సెక్స్ 129.21 పాయింట్ల లాభంతో 26,843.14 పాయింట్ల వద్ద ముగియగా, అటు నిఫ్టీ కూడా 39 పాయింట్ల లాభంతో 8,218.95 పాయింట్ల వద్దకు చేరాయి. కాగా ఇవాళ ఉదయం నుంచి దేశీయ సూచీలు అటుపోట్లను ఎదుర్కోని కుదుపులకు గురవుతున్నాయి. మొత్తంగా 2,786 కంపెనీల షేర్లు ట్రేడింగ్ లో పాల్గొనగా, 1,259 కంపెనీల షేర్లు లాభాలను ఆర్జించగా, 1,361 కంపెనీల షేర్లు నష్టాలను నమోదు చేశాయి. కాగా 166 కంపెనీల షేర్లు తటస్థంగా నిలిచాయి.
ఇవాళ్లి ట్రేడింగ్ లో అన్ని సూచీలు లాభాల బాటలోనే పయనించగా, కన్జూమర్ డ్యూరబుల్స్, హెల్త్ కేర్. సూచీలు మాత్రం నష్టాలను ఎదుర్కోన్నాయి. బ్యాంకింగ్, బ్యాంకింగ్ నిఫ్టీ, క్యాపిటల్ గూడ్స్, మెటల్స్ రంగాలకు చెందిన షేర్లు అధిక లాభాలను ఆర్జించగా, అటో, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, అయిల్ అండ్ గ్యాస్, మధ్య తరహా, చిన్న తరహా పరిశ్రమల సూచాలతో పాటు ఐటీ, టెక్నాలజీ, ఎంఎంజీసీ సూచీలు కూడా స్వల్పలాభాలను నమోదు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో యస్ బ్యాంక్, కోల్ ఇండియా, హిందాల్కో, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్ తదితర కంపెనీలు తదితర సంస్థల షేర్లు లాభాలను ఆర్జించగా, విప్రో, హెచ్సీఎల్ టెక్, ఇన్ ఫ్రాటెల్, సన్ ఫార్మా, లుపిన్ తదితర సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more