స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ముగిశాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు లాభాలలో పయనించడంతో పాటు అసియా మార్కట్లు నుంచి వచ్చిన సానుకూల పవనాలు కూడా మార్కెట్లు లాభాలలో నడిచేలా చేశాయి. గత ఏడాది జనవరి మాసం నుంచి మార్కట్లు ఎరుగని భారీ లాభాలను ఇవాళ అందుకున్నాయి. దాదాపు సంవత్సర కాలంగా లేని లాభాలను అందుకోవడంతో మదుపరులు కూడా కొనుగోళ్లకు ఆసక్తి కనబర్చారు. దీనికి తోడు మెటల్స్ రంగంలోని కంపెనీల ఈక్విటీలను సొంతం చేసుకునేందుకు ఇన్వెస్టర్లు ప్రయత్నించారు.
షార్ట్ కవరింగ్ పెద్దఎత్తున జరగడంతో భారత స్టాక్ మార్కెట్ బుల్ హైజంప్ చేసింది. గ్లోబల్ మార్కెట్లలో ర్యాలీ ఎఫ్ఐఐల సెంటిమెంట్ ను పెంచిందని, ద్రవ్యోల్బణం తగ్గిందన్న గణాంకాలు ఈక్విటీలకు మద్దతుగా నిలిచాయని మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానించారు. నిఫ్టీ సూచికకు అత్యంత కీలకమైన 7,150 పాయింట్లపైన కొనుగోలు మద్దతు కనిపించింది. సెషన్ ఆరంభంలోనే క్రితం ముగింపుతో పోలిస్తే, 150 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్, ఆపై మరే దశలోనూ వెనుదిరిగి చూడలేదు. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ 2.50 లక్షల కోట్లకు పైగా పెరిగింది.
బీఎస్ఈలో మొత్తం 2,776 కంపెనీల షేర్లు ట్రేడ్ కాగా, 1,993 కంపెనీలు లాభాల్లోను, 668 కంపెనీల షేర్లు నష్టాల్లోనూ నడిచాయి. సోమవారం నాటి సెషన్ ముగిసేసరికి సెన్సెక్స్ 568 పాయింట్ల లాభంతో 23,554.12 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 182 పాయింట్ల లాభంతో 7,162.95 పాయింట్ల వద్ద ముగిశాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 3.47 శాతం, స్మాల్ క్యాప్ 3.35 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 45 కంపెనీలు లాభాల్లో నడిచాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, వీఈడీఎల్, టాటా స్టీల్, హిందాల్కో, ఎల్అండ్ టీ తదితర కంపెనీలు లాభపడగా, భారతీ ఎయిర్ టెల్, హిందుస్థాన్ యూనీలివర్, ఐడియా, హెచ్డీఎఫ్సీ తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more