Global cues lift Sensex 104 pts, Nifty fails to hold 7850

Sensex closes 104 points up on value buying global cues

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, Federal Reserve, fiscal consolidation, GDP growth, Today sensex, today nifty, Infosys, Indian rupee, currency, dollar, BHEL, Titan, Tata Motors, Punjab National Bank, ICICI bank, Hindustan Unilever, Hero MotoCorp, International prices, American central bank interest rates, Gold price

The BSE Sensex and NSE Nifty opened in green on Tuesday on the back of firm global markets. Sensex opened 137.78 points up at 25,897.88. Nifty opened 42.15 points up at 7848.75.

వరుసగా రెండో రోజు లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ కు 104 పాయింట్ల లాభం

Posted: 11/17/2015 05:55 PM IST
Sensex closes 104 points up on value buying global cues

విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలతో భారత మార్కెట్లు ఇవాళ లాభాలను నమోదు చేసుకున్నాయి. వరుసగా రెండో రోజు లాభాలలో మార్కెట్లు పయనించడంతో ఒడిదోడుకులు ఎదురైనా మార్కెట్లు లాభాలను ఆర్జించాయి. ఎఫ్ఎంజీసీ, మెటల్స్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్ రంగాలలో పురోగతి సాధించడంతో ఆయా రంగాల సూచీలు లాభాలను నమోదు చేసుకున్నాయి. ఇన్పోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థల షేర్లు అమ్మకాల ఒత్తడికి లోనై నిఫ్టీ ఒడిదోడుకులకు గురైనప్పటికీ లాభాలను నమోదుచేసుకుంది.

డిసెంబరులో జరిగే ద్రవ్య పరపతి సమీక్షలో వడ్డీ రేట్లను పెంచే అంశాన్ని పరిశీలించనున్నామని అమెరికా ఫెడ్ రిజర్వు సంకేతాలు కూడా ఏమాత్రం ప్రభావం చూపలేదు. కాగా ఇవాళ ఉదయం ప్రారంభమైన నాటి నుంచి మార్కెట్లు లాభాలలో పయనించాయి. ఉదయం 94 పాయింట్ల లాభాన్ని నమోదు చేసుకున్న సెన్సెక్స్  మార్కెట్లు ముగిసే సమాయానిక 104 పాయింట్ల లాభాన్ని నమోదు చేసుకుంది. ఫలితంగా సెన్సెక్స్ 25,864 పాయింట్లు వద్ద ట్రేడింగ్ ముగించగా, నిఫ్టీ 31 పాయింట్ల లాభంతో 7838 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించింది.

ఈ క్రమంలో బ్యాకింగ్, బ్యాకింగ్ నిఫ్టీ, కన్జూమర్ డ్యూరబుల్స్, ఐటీ, టెక్నాలజీ సంస్థల సూచీలు నష్టాలను చవిచూడగా, అటో, ఎఫ్ఎంజీసీ, హెల్త్ కేర్, మెటల్స్ , నిఫ్టీ మిడ్ క్యాప్ సంస్థల సూచీలు లాభాలను ఆర్జించాయి. వీటితో పాటు క్యాపిటల్ గూడ్స్, ఆయల్ అండ్ గ్యాస్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, చిన్న మధ్య తరహా పరిశ్రమల సూచీలు కూడా స్వల్ప లాభాలను నమోదు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో గెయిల్, ఐటీసీ, కాయిర్న్ ఇండియా, వేదంతా, అంబుజా సిమెంట్ తదితర సంస్థలు లాభాలను ఆర్జించగా, బిపిసీఎల్; డాక్డర్ రెడ్డీస్ ల్యాబ్, గ్రాసిమ్, బ్యాకం్ అప్ బరోడా, ఇన్పోసిప్ తదితర సంస్థల షేర్లు అధిక నష్టాలను చవిచూశాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Gold and silver  indian rupee  RBI  

Other Articles