Sensex rebounds from 1-year low; realty, metal stocks steal the show

Nifty gains around 1 percent rebounds from one year lows

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, Federal Reserve, fiscal consolidation, GDP growth, Today sensex, today nifty, Infosys, Indian rupee, currency, dollar, BHEL, Titan, Tata Motors, Punjab National Bank, ICICI bank, Hindustan Unilever, Hero MotoCorp, International prices, American central bank interest rates, Gold price

Indian shares jumped nearly one per cent on Tuesday, rebounding from their lowest levels in a year.

లాభాలతో ముగిసిన మార్కెట్లు.. ఏడాది కనిష్టస్థాయి నుంచి కోలుకున్న నిఫ్టీ..

Posted: 08/25/2015 06:12 PM IST
Nifty gains around 1 percent rebounds from one year lows

అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి మారకం విలువ కొంత మేరకు పుంజుకోవడంతో ఇవాళ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిసాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూపాయలు 65. 91గా నమోదుకావడం.. దీనికి తోడు ప్రభుత్వం నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ బిల్లు అమోదానికి మరో మారు ప్రయత్నం చేస్తామన్ని హామి నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఐరోపా నుంచి వచ్చిన సానుకూల పవనాలు.. దేశీయ మార్కెట్లను లాభాల్లోకి తీసుకెళ్లగా.. చైనా నుంచి వచ్చిన ప్రతికూల పవనాలు సూచీలను కుదుపులకు లోను చేశాయి. ముఖ్యంగా చైనా ఆర్థిక సంక్షోభం మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.

ఉదయం శుభసూచకాన్ని ఇస్తూ లాభాలతో ప్రారంభమైన మార్కెట్లకు ఐరోపా నుంచి వచ్చిన సానుకూల పవనాలు దోహదం చేయగా,.. మధ్యాహ్నం సమయానికి చైనా మార్కెట్ల నుంచి వీచిన ప్రతికూల పవనాలు మార్కెట్లను ఒడిదోడుకులకు లోనూ చేశాయి. ఉదయం 380 పాయింట్లను ఆర్జించి లాభాలతో దూసుకుపోతున్న మార్కెట్లు నుంచి మధ్యాహ్న సమయానికి మరింత పెరిగాయి. సుమారుగా 450 పాయింట్ల లాభంతో వేగంగా పరిగెత్తుతున్న మార్కెట్లను చైనా నుంచి వచ్చిన ప్రతికూల పవనాలు దెబ్బతీశాయి. దీంతో మార్కెట్ మార్కెట్ ముగిసే సమయానికి  సెన్సెక్స్ 291 పాయింట్ల లాభంతో 26,032 దగ్గర,  నిఫ్టీ 72 పాయింట్ల లాభంతో 7881 వద్ద ముగిసింది..

అటో, బ్యాంకింగ్, బ్యాకింగ్ నిఫ్టీ, మెటల్స్, అయిల్ అండ్ గ్యాస్, హెల్త్ కేర్ మధ్య తరహా పరిశ్రమల సూచీలు అధిక లాభాలను గడించాయి. క్యాపిటల్ గూడ్స్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, ఎఫ్ఎంజీసీ, కన్జూమర్ డ్యూరబుల్స్, చిన్న తరహా పరిశ్రమలు, టెక్నాలజీ సూచీలు స్వల్ప లాభాలను అర్జించాయి. ఐటీ మినహా ఇతర అన్ని సూచీలు లాభాలను అర్జించాయి. ఈ క్రమంలో యస్ బ్యాంక్, టాటా మోటార్స్, వెదాంత, బిసిసిఎల్; కోల్ ఇండియా తదితర సంస్థలు షేర్లు అధిక లాభాలను గడించగా, టాటా పవర్, అంబుజా సిమెంట్స్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, హెచ్ డి ఎఫ్ సి, హెచ్ సి ఎల్ టెక్ సంస్థల షేర్లు అధిక నష్టాలను చవిచూశాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Gold and silver  indian rupee  RBI  

Other Articles