దేశంలో ఆహార ద్రవ్యోల్భనం మళ్లీ పెరిగింది. ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఇటీవల వ్యక్తం చేసిన అనుమానాలను నిజం చేస్తూ జనవరి మాసంలో ఆహార ద్రవ్యోల్భణం 5.11 శాతానికి పెరిగిందని కేంద్ర విడుదల చేసిన తాజా గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంతుకు క్రితం నెల డిసెంబర్ 2014తో పోల్చితే ద్రవ్యోల్భణం 0.83 శాతం పెరిగిందని కేంద్ర గణంగాలు స్పష్టం చేస్తున్నాయి. గత ఏడాది డిసెంబర్ మాసంలో నమోదైన 4.28 శాతం ద్రవ్యోల్భణం.. క్రమంగా జనవరి మాసంలో 5.11 శాతానికి పెరిగింది. గ్రామీణ భారతంలో ద్రవ్యోల్భణం 5.25గా నమోదు కాగా, పట్టణ భారతంలో 4.96శాతంగా నమోదైంది.
కాగా ఇటీవల ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మాట్లాడుతూ ద్రవ్యోల్భణం అంశం ఇంకా రిజర్వు బ్యాంకును అందోళన పరుస్తుందని అన్నారు. ప్రతి ద్రవ్యోల్భణ వాతావరణలో కొనసాగేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నా ఈ అంశంతో రిజర్వుబ్యాంకు ఇంకా అందోళన చెందుతూనే వుందన్నారు. ప్రతి ద్రవ్యోల్భణ విధానాలను అవలంభించడం మనకు చాలా సులభమన్నారు. ఎందుకంటే ఎక్కడైతే ద్రవ్యోల్భణం పెరుగదలకు కారణమవుతుందో.. అక్కడ తప్ప అన్ని వాతావరణాలలో తాము పోరాడుతున్నామన్నారు. దీన్ని బట్టి తామింకా సంప్రదాయ ద్రవ్య విధానంలోనే వున్నామని రఘురామ్ రాజన్ అన్నారు.
మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడువ రోజు కూడా లాభాలను నమోదు చేసుకున్నాయి. సెన్సెక్ 271 పాయింట్ల లాభాన్ని ఆర్జించి 28 వేల 805 పాయంట్ల వద్ద ముగియగా, అటు నిఫ్టీ కూడా 84 పాయింట్ల లాభంతో 8 వేల 712 పాయింట్ల లాభాన్ని ఆర్జించింది. ఈ నేపథ్యంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, బిహెచ్ఇఎల్, సిప్లా, గెయిల్, మారుతి సుజుకీ సంస్థల షేర్లు లాభాలను అర్జించగా, హిందుస్తాన్ యూనీ లీవర్, బజాజ్ అటో, భారతీ ఎయిర్ టెల్, కోల్ ఇండియా, ఎస్ బి ఐ సంస్థల షేర్లు నష్టాలను చవి చూశాయి.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more