ధేశంలో వున్న సంపన్నుల డబ్బు వివరాలు త్వరలో భయటకురానున్నాయి. పన్నును తప్పించుకుని ఖండాంతరాలు ఎగురుకుంటూ వెళ్లిన డబ్బు వివరాలు త్వరలో కేంద్ర ప్రభుత్వానికి అందనున్నాయి. సప్త సముద్రాలు దాటి వెళ్లిన డబ్బును తిరిగి దేశంలోనే రానుంది. విదేశాల్లో డబ్బును దాటిన కుబేరులు, నల్లకుబేరులుగా ముద్రపడటానికి ఎంతో సమయం లేదు. త్వరలోనే సంపన్నులు డబ్బు వివరాలు వెల్లడవుతాయన్న సమాచారంతో.. వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
ఈ విషయమై త్వరలోనే భారత్, స్విస్ ప్రభుత్వ అధికారులు హై లెవల్ కమిటీ భేటీ కానుంది. ఈ నెల చివరి వారంలో స్విస్ ప్రభుత్వ ఉన్నతాధికారులతో మన దేశ ఉన్నతాధికారులు భేటీకానున్నట్లు సమాచారం. ఈ భేటీ నల్లధన కుబేరుల వివచాలతో పాటు అక్కడి బ్యాంకులో మనవారు దాచుకున్న డబ్బుల వివరాలను కూడా వారు దేశ ఉన్నతాధికారులకు అందజేయనున్నారు. నల్లధనం వెనక్కు తీసుకువచ్చే అంశంలో వున్న చిక్కుముడులన్నింటినీ తొలగించే అవకాశాలున్నాయి.
కేంద్రంలో కొలువుదీరిన ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం, ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీ మేరకు..ఆయన నల్లధనాన్ని వెనక్కు తీసుకువచ్చే అంశంలో దృష్టి కేంద్రీకరించింది. ఈ నేపథ్యంలో స్వస్ అధికారులు కూడా నల్లధన కుబేరుల జాబితాను అందించుందుకు సిద్దమయ్యారు. కాగా భారత్ ప్రభుత్వ అధికారులతో తమ దేశ ఉన్నతాధికారుల సమావేశంలో త్వరలోనే వుంటుందని అక్కడి ఫెడరల్ శాఖ ఆర్థిక విభాగం అధికార ప్రతినిధి తెలిపారు. అయితే ఈ భేటీలో నల్లధన కుబేరులు వివరాలను భారత ప్రభుత్వానికి అందిస్తారా..? వారి డబ్బు వివరాలను కూడా అందిస్తారా..? లేదా అన్న విషయాలను మాత్రం తెలియజేయలేదు.
కాగా స్విజ్జర్ ల్యాండ్ ప్రభుత్వానికి వున్న న్యాయపరమైన అంశాలతో పాటు డబ్బును తీసుకురావడంలో.. వున్న ఇబ్బందులపై ఇరు దేశాల ఉన్నతాధికారులు సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more