ప్రజలకు ఎల్ల వేళల డబ్బును అందుబాటులోకి ఉంచేందుకు బ్యాంకులు ఏటీఎం మిషన్లను పెట్టింది కానీ వాటి నిర్వహణ, రక్షణ మాత్రం మరచింది. దీంతో ఏటీఎం ల్లో దొంగ తనాలు, ఏటీఎం సెంటర్లలో ప్రజల పై దాడులు జరుగుతున్నాయి. ఇటీవల బెంగుళూరులో ఓ మహిళ పై దాడి జరిగిన నేపథ్యంలో ఏటీఎం ల వద్ద భద్రత కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తే, రక్షణ కల్పించలేమని, వాటి నిర్వహణ వ్యయాన్ని మేం మోయలేమని చేతులెత్తేసింది.
ఆ మధ్య రాత్రి వేళల్లో ఏటీఎం సెంటర్లను మూసి వేయాలని నిర్ణయం తీసుకుంటూ ఆర్ బీఐకి ఓ లేఖ రాశారు. కానీ భధ్రత తప్పని సరి అని భావించిన బ్యాంకులు వాటి నిర్వహణ కోసం అయ్యే వ్యయాలను ఎలా రాబట్టుకోవాలనే దాని పై ద్రుష్టి సారించింది. ఇందులో భాగంగా ఏటీఎంలలో కూడా ప్రకటనలు ఉంచడం, విత్డ్రాయల్ చార్జీలు పెంచడం వంటి అంశాలను పరిశీలిస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వీటన్నింటిలో నిఘా కెమెరాలు (లోపల, బైట), సమీప పోలీస్ స్టేషన్ని అప్రమత్తం చేసేలా అలారమ్లు మొదలైనవి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
అలాగే సుశిక్షితులైన సెక్యూరిటీ గార్డులను కూడా నియమించాలి. ఇంత భారీస్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయడమన్నది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే, బ్యాంకులు ఇందుకు నిధులు సమీకరించుకునే ప్రయత్నాల్లో పడ్డాయి. బీమా, మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు మొదలైన వాటి ప్రకటనలను ఏటీఎంలలో ప్రదర్శించడం ద్వారా కొంత మేర ఆదాయం సమకూర్చుకోవచ్చని బ్యాంకులు భావిస్తున్నాయి.
ఇక ఉచిత లావాదేవీల సంఖ్యను కూడా తగ్గించాలని యోచిస్తున్నాయి. సొంత బ్యాంకు ఏటీఎంలలో సైతం ఉచిత లావాదేవీలను ఐదుకు పరిమితం చేయడంపైనా బ్యాంకులు దృష్టి సారిస్తున్నాయి. అయితే ప్రజల పై భారాన్ని మోపి ఏటీఎం సెంటర్లలో భధ్రతను పెంచాలనే ఆలోచన పై ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more