యూపీఏ ప్రభుత్వం మరో భారీ ప్రజాకర్షక పథకాన్ని తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. పేదరిక రేఖ(బీపీఎల్)కు దిగువనున్న కుటుంబాలకు ఉచితంగా మొబైల్ ఫోన్లు, నెలకు 200 నిమిషాల టాక్టైం ఇస్తే ఎలా ఉంటుందా అని యోచిస్తోంది! ఈ పథకం సాధ్యాసాధ్యాలపై ప్రణాళికా సంఘం ఇప్పటికే అధ్యయనం కూడా ప్రారంభించింది. వచ్చేవారం ప్రధాని మన్మోహన్ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఈ పథకాన్ని ప్రకటించే అవకాశముంది. ‘గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ ఫోన్ సేవలను మరింత విస్తృతం చేసేందుకు గాను బీపీఎల్ కుటుంబాలకు ఉచితంగా మొబైల్ ఫోన్లు అందించాలని అనుకుంటున్నాం. ఈ పథకం ప్రజలకు ఏ మేరకు లబ్ధి చేకూరుస్తుందన్న దానిపై టెలీకమ్యూనికేషన్స్ విభాగంతో చర్చిస్తున్నాం’ అని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాం టెక్ సింగ్ అహ్లూవాలియా పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. ఒకవేళ ఇది అమల్లోకి వ స్తే... రైతుల రుణ మాఫీ పథకం తర్వాత యూపీఏ సర్కారు తెచ్చిన మరో భారీ ప్రజాకర్షక పథకం అవుతుంది. దేశంలో 6.52 కోట్ల బీపీఎల్ కుటుంబాలున్నాయి. వీరికి ఉచితంగా మొబైల్ ఫోన్లు, టాక్టైం ఇవ్వడానికి ప్రభుత్వానికి ఏటా రూ.7 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్ల వరకూ ఖర్చవుతుంది.
ఎన్నికల గిమ్మిక్కు... బీజేపీ: బీపీఎల్ కుటుంబాలకు చెందిన వారికి ఉచితంగా మొబైల్ ఫోన్లు పంపిణీ చేయాలన్న సర్కారు ఆలోచనను ఎన్నికల గిమ్మిక్కుగా బీజేపీ కొట్టి పారేసింది. పేదల ఆకలి తీర్చడం ప్రభుత్వానికి ప్రథమ కర్తవ్యమని, వారికి మొబైల్ ఫోన్లు ఇవ్వడం కాదని హితవు చెప్పింది. అసలు సమస్యల నుంచి జనం దృష్టి మళ్లించేందుకే ప్రభుత్వం ఇలాంటి చౌకబారు ఎన్నికల గిమ్మిక్కులకు పాల్పడుతోందని బీజేపీ నేత బల్బీర్ పుంజ్ విమర్శించారు. ధరల మోతతో సామాన్యుడి నడ్డి విరిచిన ప్రభుత్వం, ఇలాంటి ప్రకటనల ద్వారా వారికి పుండు మీద కారం చల్లుతోందని బీజేపీ అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తొలుత పేదలకు రెండు పూటలా భోజనం పెట్టాలని, కనీసం మొబైల్ ఫోన్ల పట్టుకునే బలం వారికి కలిగించాలని బీజేపీ మరో అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ అన్నారు. నిరుపేదలకు మొదల కూడు, గూడు కావాలని, ఖాళీ కడుపులతో మొబైల్ ఫోన్లను వారేం చేసుకుంటారని ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more