ఈ నెల 20వ తేదీలోపు చిన్న పరిశ్రమలకు కరెంటు కష్టాలతోపాటు.. ఇతర డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా చిన్నతరహా పరిశ్రమలు మూసివేస్తామని ఫెడరేషన్ ఆఫ్ ఎపి స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ (ఫ్యాప్సియా) రాష్ట్ర అధ్యక్షుడు ఎపికె రెడ్డి హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగిన ఎపి రీసైకిల్ పేపర్మిల్స్ అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 90 శాతం ఉద్యోగాలలో 80 శాతం రెవెన్యూను చిన్నతరహా పరిశ్రమలే ప్రభుత్వానికి అందిస్తున్నాయన్నారు. తీవ్రమైన విద్యుత్ కోతలతో ఇప్పటికే చిన్న తరహా పరిశ్రమలు నష్టాల్లో కూరుకుపోయాయన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే చిన్నతరహా పరిశ్రమ యజమానులు ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్రంగ యాజమాన్యాలకు పవర్ పాలసీ లేదని, రాష్ట్రానికి విద్యుత్ విధానం ఎంతో అవసరమని గుర్తుచేశారు. రాబోయే కాలంలో ఎన్ని పరిశ్రమలకు కరెంటు అందిస్తారో తేల్చిచెప్పాలని ఎపికె రెడ్డి డిమాండ్ చేశారు. అధికారులు చెబుతున్నట్లుగా విద్యుత్ కోతలకు సకల జనుల సమ్మె కారణం కాదన్నారు. విద్యుత్ రంగ యాజమాన్యాల వైఫల్యం కారణంగానే కరెంటు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తున్నదన్నారు. ఇదే విధానం కొనసాగితే 2016 వరకు కరెంటు కష్టాలు తప్పవని రెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. చిన్న తరహా పరిశ్రమల డిమాండ్లను ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామని ఆయన తెలిపారు. వాటిని ఈ నెల 20వ తేదీలోగా పరిష్కరించకపోతే హైదరాబాద్ని దిగ్భందిస్తామని హెచ్చరించారు. ఆ తర్వాత పరిశ్రమలు మూసివేసి సహాయ నిరాకరణ చేస్తామని రెడ్డి ప్రకటించారు
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more