భారతీయ కార్పొరేట్ రంగంలో ఎంతో ఆసక్తి రేకెత్తించిన వొడాఫోన్ కేసులో సుప్రీం కోర్టు తన తీర్పు వెలువరించింది. చీఫ్ జస్టిస్ ఎస్ హెచ్ కపాడియా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం వొడాఫోన్కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. వొడాఫోన్ 11 వేల కోట్ల రూపాయల ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని సుప్రీం స్పష్టం చేసింది. అంతేకాకుండా ఇప్పటికే ట్యాక్స్ కోసం వసూలు చేసిన రూ. 2,500 కోట్ల రూపాయల్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖను ఆదేశించింది. వొడాఫోన్ కంపెనీ ఇదివరకు హచ్సన్ అనే కంపెనీ చేతిలో ఉండేది. ఇవి రెండూ విదేశీ కంపెనీలు. హచ్సన్కు ఇండియా విభాగమైన హచ్సన్ ఎస్సార్ను బ్రిటన్కు చెందిన వొడాఫోన్ కొనుగోలు చేసింది. కంపెనీ పేరును వొడాఫోన్గా మార్చింది.ఇందులో హచ్కు భారీ పెట్టుబడి లాభం వచ్చింది. ఈ లాభంపై ట్యాక్స్ కట్టాలని ఆదాయపు పన్ను శాఖ నోటీసు ఇచ్చింది. హచ్ కొనుగోలు ఒప్పందం భారత ప్రభుత్వ ఆదాయపు పన్ను పరిధిలోకి రాదని పన్ను కట్టాల్సిన పని లేదని వొడాఫోన్ వాదిస్తూ వస్తోంది. సుప్రీం తీర్పుతో వొడాఫోన్ వాదన నిజమని తేలింది.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more