హైందవ ఆధ్యాత్మిక జగత్తులో విధాత అర్థాంగిగా విశిష్ఠస్ధానం కలిగిన సరస్వతీదేవికి దేశంలో కేవలం రెండు ఆలయాలే వున్నాయి. అందులో ఒకటి ఉత్తర భారతదేశంలోని కాశ్మీరంలో ఉన్న ‘శరణాలయం’ కాగా.. రెండోది తెలంగాణా రాష్టంలోని ఆదిలాబాద్ జిల్లాలోని ‘బాసర’ గ్రామంలో వుంది. చదువుల తల్లిగా పిలువబడే ఈమె అనుగ్రహం ప్రతిఒక్కరి మీద వుంటే సుఖసంతోషాలతో జీవితాన్ని గడుపుతారని భక్తుల విశ్వాసం. అంతేకాదు.. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు తొలి అక్షరాభ్యాసాన్ని బాసరలోని సరస్వతీదేవి ఆలయంలోనే జరిపిస్తారు.
ఆలయ చరిత్ర : బాసరలో వున్న సరస్వతీదేవి ఆలయం అతి పురాతనమైనది. ఆదికవి వాల్మీకిమహర్షి బాసరలో సరస్వతీదేవి ప్రతిష్ఠ చేసాడనీ., ఇక్కడే శ్రీమద్రామాయణాన్ని కూడా రచించాడనీ ‘బ్రహ్మాండ పురాణం’లో ఉన్నట్లు పెద్దలు చెప్తారు. ఈ ఆలయం క్రీ.శ.4వ శతాబ్దికి పూర్వం నుంచీ వుందని.. ఈ క్షేత్రం రాష్ట్రకూటుల కాలంనాటిదనీ ఈ ఆలయం దగ్గర లభించిన శిలాశాసనాలు ఆధారంగా చరిత్రకారులు చెబుతున్నారు. ఎంతో విశిష్ట చరిత్రను కలిగిన ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించేందుకు నిత్యం భక్తులు విచ్చేస్తుంటారు. ఈ ఆలయం కారణంగా బాసరలో అభివృద్ధి పనులు వేగవంతం అవుతున్నాయని, భవిష్యత్తులో ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని భావిస్తున్నారు.
ఆలయ విశేషాలు : బాసరలో వున్న సరస్వతీదేవి ఆలయం సమచతురస్రాకారంలో ఉంటుంది. ఆలయానికి దక్షిణభాగాన కోనేరు ఉంది. దీనిని ‘గుండం’ అని పిలుస్తారు. దానికి ప్రక్కగా ఒక సమాధి ఉంది. దానిని ‘వాల్మీకి సమాధి’ అని అర్చకులు భక్తులకు పరిచయం చేస్తారు. శివరాత్రి మొదలు ఇక్కడ ఉత్సవాలు చేస్తారు.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more