మానవుడు సృష్టించిన అద్భుతమైన సృష్టిలో ‘రాక్ గార్డెన్’ ఒకటి. చండీగఢ్లో సుఖ్నా సరస్సుకు దగ్గరలో వున్న రాతి ఉద్యానవనంలో అందరినీ ఆశ్చర్యచికితుల్ని చేసే చెత్త, వ్యర్థాలతో తయారైన విగ్రహాలు వున్నాయి. పట్టణంలో పనికిరాని వస్తువులు, విరిగిన సిరామిక్ రాళ్ల ఆధారంగా నృత్యభంగిమల్లో శిల్పాలు, సంగీతకారుల శిల్పాలు, జంతువులకు సంబంధించిన శిల్పాలు తయారుచేయబడి వున్నాయి. ఈ విధంగా ప్రత్యేక విగ్రహాలు కలిగిన ఈ పార్క్ దేశంలో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గుర్తించబడుతోంది.
విశేషాలు :
చండీగఢ్లోని ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగంలో రోడ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న ‘నెక్ చంద్’ అనే వ్యక్తి ఈ వినూత్న గార్డెన్ ని సృష్టించాడు. 1957లో 12 ఎకరాల స్థలంలో 18 ఏళ్లపాటు కృషి చేసి దేశంలోనే ప్రత్యేక ఉద్యానంగా దీన్ని తీర్చిదిద్దాడు. ఇది ప్రస్తుతం సుమారు నలభై ఎకరాలకు విస్తరించింది. వాస్తవానికి అప్పటి ప్రభుత్వం ఈ గార్డెన్ ఏర్పాటుపై నిషేధం విధించింది. అయినప్పటికీ ఇతను పట్టువదలకుండా 18 ఏళ్లపాటు చీకటి రాత్రుల్లోనే ఎవరికీ తెలియకుండా ఈ రాతి తోటను సృష్టించాడు. రాత్రివేళ రహస్యంగా సమీపంలోని అడవికి వెళ్లి, రాళ్లను చేతులతో మోసుకొచ్చేవాడు. కొండ ప్రాంతాలకు సైకిల్ పై వెళ్లి పెద్ద పెద్దరాళ్లను తీసుకువచ్చేవాడు. కూల్చివేసిన భవనాల నుంచి వ్యర్థాలను సేకరించి తెచ్చేవాడు. వీటన్నింటి మిశ్రమంతో ఎన్నోరకాల శిల్పాలను ఏర్పాటు చేశాడు. ఈ పార్క్ కోసం 50 మంది శ్రామికులు రేయింబవళ్లు ఏకాగ్రతతో పని చేశారు.
అలా 18 ఏళ్లు శ్రమించిన అనంతరం ఈ గార్డెన్ 1975లో వెలుగులోకి వచ్చింది. అప్పుడు ప్రభుత్వం.. నెక్ చంద్ శ్రమను గుర్తించి, అందులోని విగ్రహాలను పట్టణంలో పనికిరాని వస్తువులను, విరిగిన సెరామిక్ రాళ్ల ద్వారా తయారుచేయబడినవిగా సూచించింది. ఎన్నో ప్రత్యేకతలతో ఆ గార్డెన్ రూపుదిద్దుకోవడంతో 1976లో ఈ పార్క్ను ప్రభుత్వం పబ్లిక్ ప్లేస్గా గుర్తించి.. ప్రజల సందర్శనకు అనుమతి ఇచ్చింది. 1983లో ఈ ఉద్యానం పేరిట ప్రత్యేక తపాలా బిళ్ళను వెలువరించారు. ఇందులో కృత్రిమ జలపాతాలు మరియు చెత్త,యితర వ్యర్థాలతో (గాజువస్తువులు, గాజులు, టైల్సు, సిరామిక్ కుందలు, సింకులు,విద్యుత్ వ్యర్థపదార్థాలుమొదలైనవి) చేయబడిన యితర విగ్రహాలు విస్తరింపబడి ఉన్నాయి. ఈ గార్డెన్ ఎంత అద్భుతంగా మలచబడిందంటే.. ‘ఒక్క మనిషి ఇంతటి అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించగలడా?’ అని ఆశ్చర్యపోక తప్పదు. ఈ గార్డెన్ కి తరచూ 5వేల మంది సందర్శకులు విచ్చేస్తుంటారు.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more