మనిషి అభివృద్ధికి ప్రభుత్వం కల్పించాల్సిన అత్యంత ముఖ్యమైన సదుపాయాలు రెండు. ఒకటి రవాణా, రెండు విద్యుత్తు... ఈ రెండూ పుష్కలంగా ఉన్నచోట ఉపాధికి కరవుండదు. కరవుకు చోటుండదు. అరవై ఐదేళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా లక్ష గ్రామాలకు ఈ రెండూ అస్సలు లేవు. అలాంటి గ్రామాలే లక్ష్యంగా వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు యోగేశ్వర్కుమార్.
ఉత్తరాఖండ్... ఉత్తరభారతంలోని పైకొసన కొండలు కోనల్లో ఉండే రాష్ట్రం. అక్కడ సమతలమైన భూమి చాలా తక్కువ. దీంతో గ్రామాలకు విద్యుత్ లైన్లు వేయాలంటే చాలా కష్టం. పైగా పల్లెలు కూడా చాలా చిన్నవి. సగటున ఒక్కోదాంట్లో 50 నుంచి 300 ఇళ్లుంటాయి. ఈ నేపథ్యంలో వాటికి విద్యుత్ సరఫరా చేయడం అంటే ఏ ప్రభుత్వానికైనా అసాధ్యం.ఇప్పటికే ఇండియాలో విద్యుత్ పంపిణీలో లోపాల వల్ల వేల కోట్లు ఆవిరవుతున్నాయి. ఎంతో విద్యుత్ వృథా అవుతోంది. పైగా కొండల్లో ఉండే ఆ గ్రామాలకు విద్యుత్ లైన్లు వేయడం అంటే రూపాయి ఆదాయం కోసం వంద రూపాయలు ఖర్చు పెట్టినట్లు లెక్క. వీరికి భవిష్యత్తులో కూడా వెలుగులు రావడం కష్టమే. ఈ విషయాన్ని గర్తించి, అక్కడి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు సిద్ధమయ్యారో వ్యక్తి. ఆయనే యోగేశ్వర్కుమార్ (30).
ఢిల్లీ ఐఐటీ పట్టభద్రుడైన యోగేశ్వర్ కొండలు, లోయల్లోని ఉత్తరాఖండ్ గ్రామాల్లో విసృ్తతంగా పర్యటించారు. వారికి విద్యుత్ సదుపాయం కల్పించే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు. అప్పుడు, ఆయన కనుగొన్న మార్గమే సూక్ష్మ జల విద్యుత్ కేంద్రాలు. వాటిని పల్లెల్లోప్రవేశపెట్టడం ద్వారా చిన్న గ్రామాలకు విద్యుత్ కష్టాలు తీరిపోతాయన్నది ఆయన ఆలోచన. దానికోసం ఎంతో పరిశోధన చేశారు. చాలా కాలం శ్రమించారు.కేవలం కరెంటు ఇవ్వడం మాత్రమే ఆయన లక్ష్యం కాదు, విద్యుత్తో అంధకారం తొలగించడంతో పాటు దాన్ని ఉపాధి కల్పనకు వినియోగించుకుని కొనుగోలు శక్తి పెంచడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మార్చాలన్నది ఆయన లక్ష్యం. దీన్నే ‘ఎంపవర్ ఓవర్ పవర్’ అంటారాయన. ఏదో స్వచ్ఛంద సంస్థల నుంచి డబ్బు తేవడం, దాన్ని ఖర్చు పెట్టడం అనే పద్ధతిలో కాకుండా కమ్యూనిటీ పవర్ జనరేషన్ సిద్ధాంతాన్ని అనుసరించారు. అంటే గ్రామీణులను ప్రాజెక్టులో భాగస్వాములను చేసి దాని ఉత్పత్తి, పంపిణీ, నిర్వహణ, అమ్మకం బాధ్యతలన్నింటినీ గ్రామస్థులకే అప్పగిస్తారు.ఒక్కో ప్రాజెక్టు నుంచి పలు చోట్ల విద్యుత్ ఉత్పత్తవుతుంది. దాన్నంతా ఒక చోటుకు తెచ్చి ఇళ్లకు, గ్రామాలకు వికేంద్రీకరణ చేస్తారు. ఈ కార్యకలాపాలకు సంబంధించి తన ఢిల్లీ కార్యాలయంలో యోగేశ్వర్ ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
ఈ విధంగా ఆయన ఇప్పటివరకు సుమారు 15 మైక్రో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు నెలకొల్పారు. ఒకవేళ ఆ గ్రామాలకు ప్రభుత్వం కరెంటు సరఫరా కల్పించి ఉంటే వీరు ప్రస్తుతం చెల్లిస్తున్న దానికంటే రెండు రెట్లు ఎక్కువ చెల్లించాల్సి వచ్చేది. వీటిలో పంపిణీ నష్టాల నివారణ, స్థానిక ఉత్పత్తి, స్వయం నియంత్రణ ద్వారా ఖర్చు తక్కువవుతోంది. అందుబాటులో విద్యుత్ దొరుకుతోంది.వెలుగులతో ఆగలేదు
యోగేశ్వర్ పలు భారత ప్రభుత్వ సంస్థలతో కలిసి ఆ గ్రామీణుల కోసం పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా ఆయన వారి ఉపాధిని బాగా పెంచారు. అక్కడ ఎక్కువ మంది ఉన్ని ఉత్పత్తి చేస్తారు. ఆ ఉన్ని కిలో రూ.20కి అమ్ముడుపోతోంది. దాన్ని ప్రాసెస్ చేసి అమ్మితే రూ.30 పలుకుతుంది. కానీ చాలా టైం తీసుకుంటుంది. అందుకే ఈ చిన్న మెకానిజం ఉపయోగించి దాన్ని ఆరు రోజుల్లో ప్రాసెస్ చేసే అవకాశం కల్పించారు. దీని ద్వారా ధర పెరిగింది.ఉన్ని ఉత్పత్తి కూడా పెరిగింది. ఇప్పుడు ఆ గ్రామాలకే కాదు, ఆ జీవితాలకూ వెలుగొచ్చింది. యోగేశ్వర్ ఉత్తరాంచల్ గ్రామాలకే కాకుండా సరిహద్దుల్లోని కొన్ని ఇతర రాష్ట్రాల్లోని గ్రామాలకు మేధో సాయం చేసి వారు సొంతగా విద్యుత్ సదుపాయం ఏర్పాటుచేసుకోవడానికి తోడ్పడ్డారు. ఆయణ్ని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎన్నో సంస్థలు మనస్ఫూర్తిగా అవార్డులతో ముంచెత్తాయి. అందుకే అంటారు... ఇలాంటివారు ఊరికి ఒక్కరైనా ఉండాలని!
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more