The Biography of Pandit Madan Mohan Malaviya Who Addressed As Mahaman And Also Played A Key Role In Indian Independence Movement | Indian Great Politicians

Pandit madan mohan malaviya biography addressed as mahamana

Pandit Madan Mohan Malaviya biography, Madan Mohan Malaviya life history, Madan Mohan Malaviya story, Madan Mohan Malaviya special story, Madan Mohan Malaviya updates, indian great politician, mahamana, indian independence movement, indian freedom fighters, indian activisits

Pandit Madan Mohan Malaviya Biography Addressed As Mahamana : The Biography of Pandit Madan Mohan Malaviya was an Indian educationist and politician notable for his role in the Indian independence movement and as the four time president of Indian National Congress. He was respectfully addressed as Pandit Madan Mohan Malaviya[1] and also addressed as 'Mahamana'.

మహాత్మడు... ఆదర్శప్రాయుడు.. ఈ స్వాతంత్ర్య సమరయోధుడు

Posted: 11/13/2015 04:59 PM IST
Pandit madan mohan malaviya biography addressed as mahamana

మదన్ మోహన్ మాలవ్యా... బ్రిటిష్ రాజ్యంలో తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరాడిన ఈయన మహాత్ముడిగా, ఆదర్శప్రాయుడిగా పేరుగాంచారు. ఆనాడు భారత భవిష్యత్తును నిర్థారించడానికి ఏర్పాటైన ‘సైమన్ కమీషన్’ను వ్యతిరేకించడానికి లాలా లజపతి రాయ్, జవహర్ లాల్ నెహ్రూ ఇంకా ఇతర స్వాతంత్ర సమరయోధులతో కలిశారు. 1931లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మహాత్మా గాంధీతో కలిసి కాంగ్రేసు పార్టీకి ప్రాతినిధ్యం వహించారు. ‘సత్యమేవ జయతే’ అనే నినాదాన్ని వ్యాపింపచేశారు. స్వాతంత్ర్యంపై చైతన్యం కల్పించి, ఎందరినో స్వాతంత్ర్యోద్యమాల్లో పాల్గొనేలా ప్రేరణ కల్పించారు. సమకాలిక నాయకుల వలే కులమత భేదములను పోగొట్టడానికి ప్రయత్నించారు. ఈ విధంగా తనవంతు కృషి చేసిన ఈయనకు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డును కేంద్ర ప్రభుత్వం 2014లో ప్రకటించింది.

జీవిత విశేషాలు :

1861 డిసెంబరు 25న అలహాబాదులో ఒక నిష్టులైన హిందూ కుటుంబంలో మూనాదేవి, బ్రిజ్ నాథ్ దంపతులకు మాలవ్య జన్మించారు. వారి పూర్వీకులు మధ్యప్రదేశ్ లోని మాల్వా నుండి వచ్చారు కాబట్టి వారు ‘మాలవీయ’గా పిలువబడతారు. మాలవ్యా సంప్రదాయకంగా రెండు సంస్కృత పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. ఆ తరువాత ఆయన ఆంగ్ల పాఠశాలలో తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. అలహాబాదు జిల్లా పాఠశాలలో చదువుతున్నప్పుడు ఆయన ‘మకరంద్’ అనే కలం పేరుతో కవిత్వం వ్రాయడం ప్రారంభించారు. ఆ కవితలు వివిధ జర్నల్స్, మ్యాగజెన్లలో ప్రచురితమయ్యాయి. 1879లో ముయిర్ సెంట్రల్ కాలేజీ నుండి మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. ఆ కళాశాల ప్రస్తుతం అలహాబాదు విశ్వవిద్యాలయంగా ప్రసిద్ధి చెందినది. కలకత్తా విశ్వవిద్యాలయం నుండి బి.ఎ. లో పట్టభద్రులైనారు. జూలై 1884లో తన ఉద్యోగ జీవితాన్ని అలహాబాదు ఉన్నత పాఠశలలో ఉపాధ్యాయునిగా చేరి ప్రారంభించారు.

1915లో మాలవ్యా బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని వారణాసిలో స్థాపించారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం, ప్రపంచంలోనే పెద్ద విశ్వవిద్యాలయం. ఇందులో 12,000లకు పైగా విద్యార్థులు కళలు, విజ్ఞానశాస్త్రము, ఇంజనీరింగ్, టెక్నాలజీలలో విద్యనభ్యసిస్తున్నారు. 1919 నుండి 1938 మాలవ్యా ఆ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా పనిచేశారు. మాలవ్యా భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షునిగా నాలుగు సార్లు (1909, 1913, 1919, 1932) పనిచేశారు. ఆయన 1934లో కాంగ్రెస్ ను విడిచిపెట్టారు. హిందూ మహాసభలో ముఖ్యమైన నాయకునిగా కూడా ఉన్నారు. ఈయన ‘భారతీయ స్కౌట్స్ అండ్ గైడ్సు’కు ఒక వ్యవస్థాపకుడు. 1909లో అలహాబాదు నుండి వెలువడుతున్న ఆంగ్ల పత్రిక ‘లీడర్’ను స్థాపించింది ఈయనే. ఆయన 1924 నుండి 1946 వరకు హిందూస్థాన్ టైమ్స్ కు చైర్మన్ గా ఉన్నారు. ‘పండిట్’ మదన్ మోహన్ మాలవీయగా పిలువబడే ఈయన.. ‘నోబుల్-మైండెడ్’గా వ్యక్తిగా పేరుగాంచారు కూడా!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madan Mohan Malaviya  Mahamana  Indian Independence Movement  

Other Articles