మదన్ మోహన్ మాలవ్యా... బ్రిటిష్ రాజ్యంలో తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరాడిన ఈయన మహాత్ముడిగా, ఆదర్శప్రాయుడిగా పేరుగాంచారు. ఆనాడు భారత భవిష్యత్తును నిర్థారించడానికి ఏర్పాటైన ‘సైమన్ కమీషన్’ను వ్యతిరేకించడానికి లాలా లజపతి రాయ్, జవహర్ లాల్ నెహ్రూ ఇంకా ఇతర స్వాతంత్ర సమరయోధులతో కలిశారు. 1931లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మహాత్మా గాంధీతో కలిసి కాంగ్రేసు పార్టీకి ప్రాతినిధ్యం వహించారు. ‘సత్యమేవ జయతే’ అనే నినాదాన్ని వ్యాపింపచేశారు. స్వాతంత్ర్యంపై చైతన్యం కల్పించి, ఎందరినో స్వాతంత్ర్యోద్యమాల్లో పాల్గొనేలా ప్రేరణ కల్పించారు. సమకాలిక నాయకుల వలే కులమత భేదములను పోగొట్టడానికి ప్రయత్నించారు. ఈ విధంగా తనవంతు కృషి చేసిన ఈయనకు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డును కేంద్ర ప్రభుత్వం 2014లో ప్రకటించింది.
జీవిత విశేషాలు :
1861 డిసెంబరు 25న అలహాబాదులో ఒక నిష్టులైన హిందూ కుటుంబంలో మూనాదేవి, బ్రిజ్ నాథ్ దంపతులకు మాలవ్య జన్మించారు. వారి పూర్వీకులు మధ్యప్రదేశ్ లోని మాల్వా నుండి వచ్చారు కాబట్టి వారు ‘మాలవీయ’గా పిలువబడతారు. మాలవ్యా సంప్రదాయకంగా రెండు సంస్కృత పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. ఆ తరువాత ఆయన ఆంగ్ల పాఠశాలలో తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. అలహాబాదు జిల్లా పాఠశాలలో చదువుతున్నప్పుడు ఆయన ‘మకరంద్’ అనే కలం పేరుతో కవిత్వం వ్రాయడం ప్రారంభించారు. ఆ కవితలు వివిధ జర్నల్స్, మ్యాగజెన్లలో ప్రచురితమయ్యాయి. 1879లో ముయిర్ సెంట్రల్ కాలేజీ నుండి మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. ఆ కళాశాల ప్రస్తుతం అలహాబాదు విశ్వవిద్యాలయంగా ప్రసిద్ధి చెందినది. కలకత్తా విశ్వవిద్యాలయం నుండి బి.ఎ. లో పట్టభద్రులైనారు. జూలై 1884లో తన ఉద్యోగ జీవితాన్ని అలహాబాదు ఉన్నత పాఠశలలో ఉపాధ్యాయునిగా చేరి ప్రారంభించారు.
1915లో మాలవ్యా బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని వారణాసిలో స్థాపించారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం, ప్రపంచంలోనే పెద్ద విశ్వవిద్యాలయం. ఇందులో 12,000లకు పైగా విద్యార్థులు కళలు, విజ్ఞానశాస్త్రము, ఇంజనీరింగ్, టెక్నాలజీలలో విద్యనభ్యసిస్తున్నారు. 1919 నుండి 1938 మాలవ్యా ఆ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా పనిచేశారు. మాలవ్యా భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షునిగా నాలుగు సార్లు (1909, 1913, 1919, 1932) పనిచేశారు. ఆయన 1934లో కాంగ్రెస్ ను విడిచిపెట్టారు. హిందూ మహాసభలో ముఖ్యమైన నాయకునిగా కూడా ఉన్నారు. ఈయన ‘భారతీయ స్కౌట్స్ అండ్ గైడ్సు’కు ఒక వ్యవస్థాపకుడు. 1909లో అలహాబాదు నుండి వెలువడుతున్న ఆంగ్ల పత్రిక ‘లీడర్’ను స్థాపించింది ఈయనే. ఆయన 1924 నుండి 1946 వరకు హిందూస్థాన్ టైమ్స్ కు చైర్మన్ గా ఉన్నారు. ‘పండిట్’ మదన్ మోహన్ మాలవీయగా పిలువబడే ఈయన.. ‘నోబుల్-మైండెడ్’గా వ్యక్తిగా పేరుగాంచారు కూడా!
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more