తెలుగు రాజకీయరంగంలో విశేషంగా రాణించిన విశ్లేషకుల్లో గుత్తికొండ నరహరి ఒకరు. 1946 ఎన్నికల సమయంలో నరహరి యువతను ఉద్దేశించి.. పదవులకు రాజీనామాలు చేయమని, స్వాతంత్ర్యం రానున్నందున త్యాగం చేస్తే తరువాత ఉన్నత పదవులు వస్తాయని బోధ చేశాడు. రాడికల్ రాజకీయాలలో అటు కమ్మూనిస్ట్ లను, ఇటు కాంగ్రెస్ వారిని ఎదుర్కొని, తన ధారాళ ఉపన్యాసాలతో జనాన్ని ఆకట్టుకున్నాడు. రాజకీయం అంటే ఏమిటన్న విషయాన్ని తన ప్రతిభతో అందరికీ తెలియజేశాడు. ఇలా ఈ విధంగా రాజకీయరంగంలో అసమాన వక్తగా తనను తాను నిరూపించుకున్నాడు. ఈయన రచయిత, సంపాదకులు కూడా.
జీవిత విశేషాలు :
1918 ఆగస్టు 10వ తేదీన గుంటూరు జిల్లా అమృతలూరు మండలం యలవర్రు గ్రామంలో ఆంజనేయుడు, రాఘవమ్మ దంపతులకు గుత్తికొండ నరహరి జన్మించాడు. గ్రామానికి సమీపంలో వుండే తురుమెళ్ల పాఠశాలలో తన విద్యాభ్యాసం కొనసాగించాడు. ఈయన ఎంతో చురుకైనవాడు. కాలేజీలో చేరకుండానే బర్మాలోని రంగూన్ వెళ్ళి రెండేళ్ళు పత్రికా విలేఖరిగా పనిచేశాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత గుంటూరు ఆంధ్రక్రైస్తవ కళాశాలలో బి.ఎ. పూర్తి చేశాడు. అనంతరం మద్రాస్ లో న్యాయశాస్త్రంలో చేరాడు. అయితే.. ఈ సమయంలోనే ఆయన దృష్టి రాజకీయాలవైపు మళ్లడంతో ఆ న్యాయశాస్త్రాన్ని మధ్యలోనే వదిలేశాడు. ఆ తర్వాత ఎం.ఎన్.రాయ్ ప్రభావంలో ‘నవ్య మానవవాద రాష్ట్ర పార్టి’ కార్యదర్శి అయ్యాడు. 1944లో గూడవల్లిలో, తన మేనమామ కూతురు సరోజినితో వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం లౌకిక పద్ధతిలో జరిగింది.
రాజకీయ జీవితం :
‘నవ్య మానవవాద రాష్ట్ర పార్టి’ కార్యదర్శిగా కొనసాగుతున్న నరహరి.. 1946 ఎన్నికలలో యువతను ఉద్దేశించి ఓ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ‘పదవులకు రాజీనామాలు చేయడండి.. స్వాతంత్ర్యం రానుంది కాబట్టి, పదవులను రాజీనామా చేస్తే ఆ తర్వాత ఉన్నత పదవులు వస్తాయి’ అని బోధన చేశాడు. అంతేకాదు.. రాడికల్ రాజకీయాలలో కమ్మూనిస్ట్, కాంగ్రెస్ వర్గాలను సమర్థవంతంగా ఎదుర్కొని.. తన ధారాళ ఉపన్యాసాలతో ప్రజల్ని ఆకట్టుకున్నాడు. రాజకీయ పాఠశాలలో ఎందరినో సుశిక్షితులను గావించాడు. 1972లో ‘క్షాత్ర ధర్మ పరిషత్’ అనే రాజకీయ పార్టీ పెట్టి, లోక్ సభకు పోటీ చేశాడు. ఆనాడు మధ్యలోనే వదిలేసిన న్యాయశాస్త్రాన్ని (లా) పూర్తి చేసి, 1974లో హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేశాడు.
మరిన్ని విశేషాలు :
* గుంటూరులో పొగాకు కంపెనీ పెట్టి వ్యాపారం చేశాడు. అయితే ఆ వ్యాపారంలో దెబ్బతిన్న తరువాత తన ప్రతిభను రచనలకు వినియోగించాడు. పొగాకు వాణిజ్యం కోసం కంపెనీల ఆర్డర్లు పొందడానికి ఆనాడు జపాన్ వెళ్ళాడు. ఆ తర్వాత అనేక దేశాలు పర్యటించి ఆర్డర్లు తెచ్చాడు. వాణిజ్యపరమైన సమావేశాలు జరిపి, పొగాకు నాణ్యతపై వ్యాసాలు రాశాడు.
* రాష్ట్ర రాడికల్ డెమొక్రాటిక్ పార్టి కార్య దర్శిగా మానవ విలువలను ప్రజలలోకి తీసుకెళ్ళడానికి కృషి చేశాడు. మూఢనమ్మకాలు వున్న జనానికి చక్కగా శాస్తీయ విషయాలు విడమరచి చెప్పడంలో అందెవేశాడు. ‘ములుకోల, ప్రజామిత్ర, సమీక్ష పత్రికల’లో వ్యాసాలు వ్రాసాడు. విహారి, ఆంధ్రా లేబరు పత్రికల సంపాదకత్వం వహించాడు. ఈయన 1985 మార్చి 27న తుదిశ్వాస విడిచాడు.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more