విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా పేరుపొంది, తెలుగువారి ‘‘అన్న’’గా పిలువబడే నందమూరి తారకరామారావుగారి ఖ్యాతి మరోసారి సంతరించుకుంది. చరిత్రలో ఏ తెలుగు నటుడికి లేని గౌరవప్రదమైన స్థానం మన అన్నగారికే దక్కింది. తెలుగు ప్రజల అభిమాన నటుడు అయిన ఎన్టీఆర్... తెలుగు, తమిళం, హిందీ వంటి భాషలలో 400పైగా చిత్రాలలో నటించి... తన ప్రతిభను చాటుకున్నారు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలలో నటించి అందరినీ మెప్పించి.. తెలుగువారి హృదయాలలో శాశ్వతంగా ఒక ఆరాధ్యదైవంగా నిలిచిపోయారు. 44 సంవత్సరాల ఆయన సినీ జీవిత చరిత్రలో మొత్తం 13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక, 44 పౌరాణిక చిత్రాల్లో నటించారు.
ఆ తరువాత తన తెలుగు తమ్ముళ్లయిన ఆంధ్రప్రజలకు మంచి చేయాలనే భావనతో సినీ ప్రపంచాన్ని వదిలేసి, రాజకీయబాటవైపు అడుగులు వేశారు. ఆనాడు రాజకీయపరిస్థితులు చాలా ఘోరంగా నడుస్తున్నాయని... సామాన్య ప్రజలకు నాయకులు ఎటువంటి సేవలు అందించడం లేదని గళం ఎత్తిన ఆ మహానటుడు... తెలుగుదేశం పేరుతో 1982 మార్చి 29వ తేదీన ఒక పార్టీని స్థాపించారు. పార్టీని స్థాపించిన కేవలం 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని కైవసం చేసుకుని, కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు. ఆ విధంగా రాజకీయరంగంలో ప్రవేశించిన తెలుగుఅన్నగారు... మూడు దఫాలుగా 8 సంవత్సరాలవరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆనాటి వరకు ముఖ్యమంత్రిగా ఎక్కువకాలం పనిచేసిన వ్యక్తిగా ఎన్టీఆర్ గారు మొదటిస్థానంలో నిలిచారు.
అంతటి మహానటుడు అయిన నందమూరి తారక రామారావుగారికి ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది. గొప్పనటుడు, ప్రజానాయకుడైన ఈయనగారి జీవిత చరిత్రను ఆంధ్రప్రభుత్వం పదోతరగతి పాఠ్యాంశంలో చేర్చింది. సాంఘిక శాస్త్రంలోని 268వ పేజీలో... అప్పట్లో ఢిల్లీ పెద్దలు చేస్తున్న అవినీతి కార్యకలాపాలపై ఎన్టీఆర్ చేసిన తిరుగుబాటు విధానాన్నీ, వందల ఏళ్ల చరిత్రను కలిగిన కాంగ్రెస్ పార్టీని ఓడించిన విధానాల గురించి పొందుపరిచారు. ఈ విషయంపై ఆయన అభిమానులు, కొందరు రాజకీయనేతలు తమ హర్షం వ్యక్తం చేశారు. తెలుగువారి ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన ఎన్టీఆర్ గారి చరిత్రను ఈ విధంగా పుస్తకంలో పొందుపరచడం ఎంతో గౌరవమైన విషయం అంటూ తమ ఆనందాన్ని అందరితో పంచుకున్నారు.
1923 మే 28వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా పామర్రు మండలంలోని నిమ్మకూరి గ్రామంలో నివాసంవున్న లక్ష్మయ్య చౌదరి, వెంకటరామమ్మ దంపతులకు ఎన్టీఆర్ జన్మించారు. తల్లిదండ్రులు మొదట ఈయనకు కృష్ణ అనే పేరు పెట్టాలనుకున్నప్పటికీ.. మేనమామ ఇచ్చిన సలహా మేరకు తారక రాముడు అనే పేరు పెట్టారు. అది కాస్త తారక రామారావుగా మారిపోయింది.
ఈయన తన పాఠశాల విద్యను విజయవాడలోని మునిసిపల్ హైస్కూల్ లో పూర్తి చేశారు. తరువాత ఎస్ఆర్ఆర్ కాలేజీలో చేరారు. అందులో విశ్వనాథ సత్యనారాయణ తెలుగు విభాగానికి అధిపది. ఒకరోజు ఈయన రామారావును ఒక నాటకంలో ఆడవేషం వేయాల్సిందిగా కోరారు. అయితే దానికోసం మీసాలు తీసేయాల్సి వస్తుందని అందుకు ఆయన నిరాకరించారు. అయినప్పటికీ ఆయన ఆ మీసాలు పెట్టుకునే నాటకంలో ఆడవేషం వేశారు. దాంతో ఆయనకు ‘‘మీసాల నాగమ్మ’’ అనే పేరును తగిలించారు.
ఈయన 20 ఏళ్ల వయస్సులో 1942 మే నెలలో మేనమామ కుమార్తె అయిన బసవ రామతారకంను వివాహం చేసుకున్నారు. పెళ్లయిన తరువాత ఆయన రాసిన పరీక్షల్లో రెండుసార్లు తప్పారు. ఆ తరువాత ఉన్నత చదువులకోసం గుంటూరులోని ఆంధ్రక్రిస్టియన్ కళాశాలలో చేరారు. అక్కడ కూడా నాటక సంఘాలలో చురుకుగా పాల్గొనేవారు. ఆ సమయంలో ‘‘నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్’’ (NAT) అనే నాటక సంస్థను స్థాపించి, కొంగర జగ్గయ్య, ముక్కామల, నాగభూషణం, కేవీఎస్ శర్మతో కలిసి ‘‘చేసిన పాపం’’ వంటి నాటకాల్లో.. ఇంకా తదితర నాటకాల్లో పాల్గొన్నారు.
కుటుంబం :
తారక రామారావు, బసవ తారకం దంపతులకు మొత్తం 11మంది సంతానం. అందులో ఏడుగురు మారులు, నలుగురు కుమార్తెలు. జయకృష్ణ, సాయికృష్ణ. హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ కుమారులు కాగా; గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి, నారా భువనేశ్వరి, కంటమనేని ఉమామహేశ్వరి కుమార్తెలు.
రామారావుగారు కాలేజీ రోజుల్లో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు కొన్ని కారణాల వల్ల వీరి ఆస్తి మొత్తం హరించుకుపోయింది. దాంతో ఆయన జీవనాన్ని సాగించడం కోసం అనేకరకాల పనులు చేశారు. పాల వ్యాపారం, కిరాణా కొట్టు, ముద్రణాలయాన్ని నడపడం వంటి అష్టకష్టాలు పడ్డారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కూడా అప్పులు చేసేవారు కాదు. అలాగే జీవితాన్ని కొనసాగిస్తూ 1947లో పట్టభద్రులయ్యారు. అనంతరం మద్రాసు సర్వీస్ కమీషన్ పరీక్షలు రాశారు. అందులో 1100మంది ఎంపిక కాగా.. వారిలో ప్రథమస్థానంలో వున్న ఏడుగురిలో ఈయన ఒకడుగా నిలిచారు. దాంతో ఆయనకు మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగం లభించింది. అయితే సినిమాలలో నటించాలనే కోరికతో ఆయన ఆ ఉద్యోగాన్ని మూడువారాల తరువాత వదిలేశారు.
సినిమాల్లో ప్రవేశం కోసం ఈయన తన ఫోటోను ఎల్వీ ప్రసాదు గారికి ఇచ్చారు. ఆయన దగ్గరున్న ఫోటోను ప్రముఖ నిర్మాత బిఏ సుబ్బారావుగారు చూసి... అప్పటికప్పుడే ఆయనను ‘‘పల్లెటూరి పిల్ల’’ సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేశారు. అందుకుగాను ఆయనకు అప్పట్లో రూ.1116 పారితోషికం లభించింది. అప్పుడు వెంటనే ఆయన తన సబ్-రిజిస్ట్రార్ ఉద్యోగాన్ని రాజీనామా చేశారు. అయితే ఆ సినిమా రిలీజ్ అవడానికి ముందే ఈయన నటించిన మరోసినిమా ‘‘మనదేశం’’ రిలీజయింది. దాంతో అదే ఆయన మొదటి సినిమా అయింది. 1949లో రిలీజ్ అయిన ఆ సినిమాలో ఒక పోలీస్ ఇన్స్ పెక్టర్ పాత్రలో పోషించారు. 1950లో పల్లెటూరి పిల్ల విడుదలయింది. అదే సంవత్సరంలో ఎల్వీ ప్రసాదు తీసిన ‘‘షావుకారు’’ సినిమా రిలీజయింది. దాంతో ఎన్టీఆర్ తన మకాంను మద్రాసుకు మార్చేశారు.
ఆ విధంగా మొదలయిన ఈయన సినీ ప్రస్థానంలో ఎన్నో సినిమాల్లో నటించారు. అందులో కొన్ని బాక్సాఫీస్ దగ్గర రికార్డుల కలెక్షన్లు సాధించాయి. అందులో పాతాళభైరవి 34 కేంద్రాల్లో 100 రోజులవరకు ఆడి అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ తరువాత వచ్చిన మాయాబజార్ కూడా మంచి విజయం సాధించింది. 1963లో వచ్చిన లవకుశ అతిపెద్ద విజయాన్ని సాధించింది. ఆయన సినిమాల్లోకి వచ్చిన 22
సంవత్సరాలవరకు ఆయన పారితోషికం కేవలం 4 లేదా 5 అంకెల్లోనే వుండేది. 1972 నుంచి ఆయన పారితోషికం లక్షల్లోకి వెళ్లింది.
ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన మొదటి చిత్రం 1961లో తీసిన ‘‘సీతారామ కళ్యాణం’’. ఆ తరువాత 1977లో దానవీరశూరకర్ణలో మూడు పాత్రల్లో నటిస్తూ.. స్వయంగా దర్శకత్వం వహించారు. అలాగే శ్రీరామ పట్టాభిషేకం, అడవిరాముడు, యమగోల, బ్రహ్మర్షి విశ్వామిత్ర వంటి చిత్రాలకు ఈయనే స్వయంగా దర్శకత్వ బాధ్యతలు వహించారు.
1981లో సర్దార్ పాపారాయుడు చిత్రం షూటింగ్ విరామసమయంలో ఒక విలేఖరి... ‘‘మీరు మీ 60వ పుట్టినరోజు సందర్భంగా మీ జీవితానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నారా?’’ అని అడిగాడు. దానికి జవాబుగా ఎన్టీఆర్.. ‘‘తెలుగు ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు. వారికి నేనెంతో రుణపడి వుంటాను. కాబట్టి వారికి నా పుట్టినరోజు నుంచి నావంతుగా 15రోజులు వారిసేవ కోసం కేటాయిస్తాను’’ అని చెప్పారు. ఇదే ఆయన రాజకీయ ప్రవేశానికి మొదటి సంకేతం.
1982 మార్చి 21వ తేదీన ఈయన హైదరాబాదుకు వచ్చినప్పుడు.. అభిమానులు ఈయన్ని ఎర్రతివాచీ పరిచి స్వాగతం పలికారు. దీంతో ఆయన ఎంతో సంతోషపడ్డారు. ఆ నెల 29వ తేదీన కొత్తపార్టీ పెడుతున్నట్టు చెప్పారు. ఆ సమయంలోనే పార్టీ పేరు తెలుగుదేశంగా నిర్ణయించి, ప్రకటించారు. పార్టీ ప్రచారంకోసం చైతన్యరథం ఏర్పాటు చేశారు. ఆ రథంపైనే ఆయన తెలుగుప్రజలకు నినాదాలు చేస్తూ తనవైపుకు రప్పించుకున్నారు. ఆ తరువాతి కాలంలో భారత రాజకీయాల్లో ఆయన కీర్తి ఎంటో ప్రతిఒక్కరికి తెలిసిందే!
1978లో ఆంధ్రప్రదేశ్ లోఅధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ... అంతర్గతంగా కుమ్మలాటలు చేసుకోవడం వల్ల అపకీర్తి పాలయ్యింది. ఐదు సంవత్సరాలకాలంలోనే 4 ముఖ్యమంత్రులు మారిపోయారు. ఢిల్లీలో ముఖ్యమంత్రిని నిర్ణయించి, రాష్ట్రంలో శాసనసభ్యుల ద్వారా నామాకార్థం ఎన్నిక చేసేవారు. దీంతో ప్రభుత్వం అప్రదిష్ట పాలయ్యింది.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more