‘తెలుగు కళామతల్లి ’ నుండి ఓ నట మహాదిగ్గజం సుధూరాలకు వెళ్లి పోయాడు. ఈ మాటలకు సినీ కళామతల్లే కాకుండా, యావత్తు సినీ లోకం చిన్నబొయి శోక సముద్రంలో మునిగింది. ఏడు దశాబ్దాల పాటు వెండితెర పై తెలుగు వారిని అలరించిన ‘నట సామ్రాట్ ’ ‘దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ’ అక్కినేని నాగేశ్వర రావు అస్తమించాడు. ఆయన తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన తీరు, పంచిన ఆనందాన్ని మరచి పోవడం అంత తేలికైన విషయం కాదు. వివిధ పాత్రల్లో ఆయన నటన అనన్య సమామాన్యం. మూడు తరాల నటులతో కలిసి నటించిన నవయువ యువకుడు అక్కినేని.
చిన్న వయస్సులో చదువు మానేసినా... మనిషి అనే వాడు సమాజంలో ఎలా ఉండాలి, ఎలా బతకాలి, ఎలా మెలగాలి, ఎలా మెలగకూడదు... ఎలా బతక కూడదో కూడా ఆయన నిజ, నట జీవితంలో చెప్పిన గొప్ప వ్యక్తి. ఆయన నేడు మన నుండి వెళ్లి పోయాడన్న మాట గుండెను పిండేస్తున్నా, ఇక ఆయన లేడని గుండెను దిటవు చేసుకోక తప్పదు. ఓ సినిమాలో ‘‘కన్నీళ్ళకే బతికించే శక్తి ఉంటే... అవి ఏనాడో కరువైపోయేవి ’’. ఒకవేళ అలాంటి శక్తి ఉంటే యావత్తు తెలుగు సినీ ప్రేక్షకులు ఒక్క కన్నీటి బొట్టును దారపోసి అక్కినేనిని బతికించుకునే వారే కదా ? ఇటీవల అనారోగ్యం పాలైనప్పుడు ప్రేక్షకులు దీవిస్తే నిండు నూరేళ్ళు బతకగలలని చెప్పిన ఆయన ఇలా వదిలి వెళ్లడం కాస్తంత బాధ కరమే.
అక్కినేని బాల్యం..
అక్కినేని నాగేశ్వర రావు కృష్ణాజిల్లా గుడివాడ తాలూకాలోని వెంకట రాఘవపురంలో 1924 సెప్టెంబర్ 20న పున్నమ్మ, వెంకటరత్నం దంపతులకు ఐదో సంతానంగా జన్మించారు. నాలుగో తరగతి లోనే చదువుకు స్వస్తి చెప్పి, నాటక రంగం పై ఆసక్తితో చిన్నతనం నుంచే నాటకల్లో వేషాలు వేసేవారు. ఈయనకు ఆ కళ ఎవరు నేర్పింది కాదు. దైవదత్తంగా ఆయనకు అబ్బింది. స్టేజ్ పై అక్కినేని ధరించిన తొలి పాత్ర ‘నారదుడు ’. వెంకటరాఘవపురంలో పిల్లలందరూ కలిసి వేసిన ‘సత్యహరిశ్చంద్ర’ నాటకంలో పట్టుబట్టి అక్కినేనితో నారద పాత్రను వేయించారు.
కారణం ఆ ఊళ్లో ఆయన మంచి పాటగాడు కావడమే. ఆ తర్వాత ఏఎన్నార్ నటించిన పాత్ర చంద్రమంతి. తర్వాత ‘కనకతార’ అనే నాటకంలో తారగా నటించారు. అప్పట్నుంచీ నాటకాల్లో స్త్రీ వేషాలు విరివిగా రావడం మొదలయ్యాయి. ‘సత్యహరిశ్చంద్ర ’ నాటకంలో మాతంగకన్య, ‘భక్తకుచేల’ నాటకంలో మోహిని, ‘సారంగధర’ నాటకంలో చెలికత్తె పాత్ర ఇలా ఖాళీ లేకుండా నాటకాలు వేస్తూ ఉండేవారు. రంగస్థల కళాకారునిగా అక్కినేని తొలి పారితోషికం అర్థరూపాయి. ఆ స్థాయి నుంచి అయిదొందలు తీసుకునే స్థాయికి ఎదిగారు.
సినిమా వైపు అడుగులు...
నాటకాల్లో మంచి పేరు తెచ్చుకున్న అక్కినికి పదిహేడేళ్ళ వయసులో 1940లో ‘ధర్మపత్ని ’ తొలి సినిమా అవకాశం దక్కింది. పి.పుల్లయ్య దర్శకత్వంలో ‘ధర్మపత్ని ’ సినిమా షూటింగ్ కొల్హాపూరులో మొదలైంది. అందులోని ఓ పిల్లాడి వేషం కోసం అక్కినేని తీసుకున్నారు. ఆ సినిమాలోని పిల్లలపై తీసిన ఓ పాటలో అక్కినేని కనిపిస్తారు. అందులో అక్కినేనికి ఒక్క డైలాగు లేకపోయినా... తొలిసారి తెరపై కనిపించారు. అలా మొదలైన సినిమా ప్రస్థానం నేటి వరకు కొనసాగింది. 1944 లో మే 8వ తేదీన సినీ నటుడిగా మద్రాసులో ప్రస్థానం ప్రారంభించిన అక్కినేని, ‘కీలు గుర్రం ’ ‘బాల రాజు ’ చిత్రాలతో జానపద కథానాయకుడిగా, మాస్ హీరోగా తనదైన ముద్రను వేసుకున్నాడు. అక్కినే నాగేశ్వరరావు సినీ జీవితాన్ని మలుపు తిప్పడమే కాకుండా, ఆయన కెరియర్లో ఓ మైలు రాయిగా మిగిలిపోయిన చిత్రం దేవదాసు.
ఈ చిత్రం 1953 జూన్ 26వ తేదీన విడుదల అయ్యి ఎన్నో సంచలనాలు స్రుష్టించింది. ఎన్నో ప్రేమ కథలు, కుటుంబ కథలు చేసే అక్కినేని ఆయన నటించిన తొలి అసాంఘిక చిత్రం ‘సంసారం’. అక్కినేని కేవలం నటుడే కాదు మంచి గాయకుడు కూడా. తొలినాళ్ళలో ఆయన సినిమాకు ఆయనే పాటలు కూడా పాడుకునే వాడు. నట సామ్రాట్ గా పేరు తెచ్చుకున్న అక్కినేని ఎన్టీఆర్ తో కలిసి నటించిన తొలి మల్టీ స్టారర్ చిత్రం ‘పల్లెటూరి పిల్ల ’. ఆ తరువాత మిస్సమ్మ, తెనాలి రామక్రుష్ణ, చిత్రాల్లో ఆయనతో కలిసి పనిచేశారు.
హీరో పాత్రల్లోనే కాకుండా, చక్రపాణి, ప్రేమించి చూడు లాంటి చిత్రాల్లో హస్యస్పద పాత్రల్లో నటించి మెప్పించారు. ఆయన తొలిసారిగా ‘సుడిగుండాలు ’ సినిమాకు గాను మొదటి ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. కేవలం తెలుగు తెర పైనే కాకుండా తమిళ తెర పై కూడా ప్రేక్షకుల్ని అలరించి అక్కడి వారిని మెప్పించారు. ‘కీలుగుర్రం ’ ఆయన తొలి తమిళ అనువాద చిత్రం అయితే, ఓర్ ఇరువు, అన్బుమగళ్, అతిశయపెణ్, దైవమేతునై, ఎంగళ్ సెల్వి, పెణ్ మనం లాంటి తమిళ చిత్రాల్లో నటించారు.
అక్కిని ఎవర్ గ్రీన్ చిత్రాలు....
ముగ్గురు మరాఠీలు(1946) మాయాలోకం(1945) చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న అక్కినేనికి ‘బాలరాజు’(1948) చిత్రం స్టార్ని చేసింది. ఆ వెంటనే వచ్చిన మరో జానపదం ‘కీలుగుర్రం ’(1949) ఆయన్ను నంబర్వన్ని చేసింది. దేవదాసు(1953), అనార్కలి(1955), బాటసారి(1961), మూగమనసులు(1964), మనసేమందిరం,(1966), ప్రేమనగర్(1971), దేవదాసు పళ్లీపుట్టాడు(1978), ప్రేమాభిషేకం(1981), ప్రేమమందిరం(1981), అమరజీవి(1983)... ఇలా చెప్పుకుంటూ పోతే... ఎన్నో ప్రేమకథలు. దక్షిణాదిన ఇన్ని ప్రేమకథల్లో నటించిన హీరో మరొకరు లేరు. అందులోనూ పాత్ర పాత్రకూ వ్యత్యాసం. అక్కినేని భక్తునిగా పేరుతెచ్చిన చిత్రాలు విప్రనారాయణ(1954), భక్తజయదేవ(1961), భక్తతుకారం(1973), మహాకవి క్షేత్రయ్య(1976), చక్రధారి(1977), శ్రీరామదాసు(2006). ఇక అక్కినేని నటించిన చివరి చిత్రం ‘మనం ’. మూడు తరాల నటులు కలిసి నటించిన ఈ చిత్రం త్వరలో విడుదల కాబోతుంది.
పట్టుదలకు మరో పేరు అక్కినేని...
ఎన్నెన్ని ప్రేమ కావ్యాలు, ఎన్నెన్ని కుటుంబ గాధలు, ఎన్నెన్ని ఆధ్యాత్మికానందాలు, ఎన్నెన్ని పురాణపాత్రలు.. ఒకానొక దశలో తెరపై మానవ బంధాలన్నింటిలో అక్కినేనినే చూసుకుంది ప్రేక్షకలోకం. ప్రేమికుడంటే అక్కినేని. కొడుకంటే అక్కినేని. భర్త, అన్న, తమ్ముడు, మరిది, తండ్రి, తాత.. ఇలా అన్ని బంధాల్లో అక్కినేనినే చూసుకున్నారు. తెలుగుతెరపై అజరామరమైన సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక పాత్రలతో రంజింపజేసి ‘నటసామ్రాట్ ’ బిరుదుని సార్థకం చేసుకున్నారాయన. కార్యదీక్షను ఇంటిపేరుగా మార్చుకున్న నిత్య కృషీవలుడు అక్కినేని..
నిరంతరం నటననే శ్వాసించిన అభినయ నటరాజు అక్కినేని. చెన్నపట్టణంలో వేళ్లూనుకుపోయిన. మన సినిమాను తెలుగునేలకు తరలించిన అభినవ భగీరథుడు అక్కినేని. 82 ఏళ్ల తెలుగు సినిమాతో.. 72ఏళ్ల పాటు ప్రయాణించి తెలుగు సినీ సహోదరుడు అక్కినేని. అక్కినేని జీవన ప్రస్థానంలో ఎన్నో మలుపులు. ఎన్నో ఒడిదుడుకులు. హీరోగా నిలదొక్కుకోడానికి ఆయన చేసిన సాహసాలు ఎన్నో. విమర్శించిన వారితోనే పొగిడించుకున్న దీక్షాదక్షుడు అక్కినేని.
అవార్డులు - బిరుదులు :
తెలుగు తెర పై తనదైన శైలిలో రాణిస్తున్న అక్కినేని కి 1957 లో నట సామ్రాట్ అనే బిరుదు ఇచ్చారు. 1968 లో పద్మ శ్రీ అవార్డు, 1977 లో కళా ప్రపూర్ణ , 1989 లో రఘపతి వెంకయ్య నాయుడు అవార్డు, 1991 లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, 1993 లో గౌరవ డాక్టరేట్ ని, 1995 లో అన్నా అవార్డు ను తమిళనాడు ప్రభుత్వం నుండి అందుకున్నాడు. 1996 లో ఎన్టీఆర్ జాతీయ ఫిలిం అవార్డు ను , 1998 లో పద్మ భూషన్ ని, 2011లో పద్మ విభూషణ్ అవార్డు, 2012 లో తానా జీవిత సాఫల్య ఫురస్కారం అందుకున్నాడు. ఇవే కాకుండా నాలుగు సార్లు ఫిలిం ఫేర్ అవార్డులు, (సుడి గుండాలు, మరపురాని మనిషి, సీతా రామయ్య గారి మనవరాలు, బంగారు కుటుంబం). మేఘ సందేశం, బంగారు కుటుంబ చిత్రాలకు నంది అవార్డులు, మధ్య ప్రదేశ్ ప్రభుత్వం నుండి కాళిదాసు కస్తుబౌ అవార్డు.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more