ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ కి రెండవసారి చైర్మన్ గా ఎన్నికైన అడ్వకేట్ ఎ.నరసింహారెడ్డి తన జీవితంలో ఒక్క న్యాయ సంబంధిత కార్యకలాపాలే కాక మరెన్నో విషయాల్లో బాధ్యతలను స్వీకరించారు. ఆయన గురించి నాలుగు మాటలు-
జనవరి 10, 1952 లో, మహబూబ్ నగర్ జిల్లా బాలమూర్ లో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించిన నరసింహారెడ్డి మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ లో ఇంటర్ మీడియేట్ వరకూ చదివి హైద్రాబాద్ సిటీ కాలేజ్ లో బి.కాం, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1977లో న్యాయవిద్యలో పట్టా పుచ్చుకుని, 1978లో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ లో అడ్వకేట్ గా నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత 1984 వరకూ జూనియర్ గా జి.హరిదత్తా రెడ్డి దగ్గర పనిచేసారు. 1985లో డి.ప్రకాశరెడ్డి, ఏ గోపాలరెడ్డి లతో కలిసి ఎ.గోపాలరెడ్డి హైకోర్టు జడ్జిగా నియామకం జరిగేంత వరకూ లా ప్రాక్టీసు చేసారు.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన జిల్లా, ప్రత్యేక న్యాయస్థానాల్లోను, భూ ఆక్రమణ న్యాయస్థానాల్లోను, హైకోర్టులోను ఎక్కువగా సివిల్ కేసులను చేపట్టారు. రెవిన్యూ అథారిటీస్ ముందుకొచ్చిన అనేక కేసులను కూడా తీసుకున్నారు.
1995 నుండీ ఉస్మానియా యూనివర్శటీ కి లోయర్ కోర్టు స్టాండింగ్ కౌన్సిల్ గానూ, తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున హైద్రాబాద్ జంటనగరాలు, రంగారెడ్డి జిల్లాలలో స్టాండింగ్ కౌన్సిల్ గానూ బాధ్యతలను స్వీకరంచారు.
న్యాయపరమైన బాధ్యతలే కాకుండా సమాజంలో ఇతర కార్యక్రమాలలో కూడా ప్రవేశమున్న నరసింహారెడ్డి ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ కి చైర్మన్ గానూ, హైద్రాబాద్ జిల్లా ఆథ్లెటిక్ అసోసియేషన్ కి ఛీఫ్ పాట్రన్ గానూ వ్యవహరించారు. అనంత జ్యోతిర్మయి సేవా సంస్థకి నరసింహారెడ్డి సంస్థాపక అధ్యక్షులు.
1995, 2000, 2006 సంవత్సరాలలో మూడుసార్లు ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ కి సభ్యుడిగా ఎన్నికైన నరిసింహారెడ్డి, బార్ కౌన్సిల్ ఆఫి ఇండియా రూల్ 42 కింద స్థాపించిన కమిటీలో 2001 నుంచీ సభ్యులే. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లోని క్రమశిక్షణ కమిటీలోనూ సభ్యుడిగా ఎన్నుకోబడి, 1995 నుంచి 2006 వరకూ పనిచేసారు. 2005 లో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ కి వైస్ చైర్మన్ గానూ, 2006 లో చైర్మన్ గానూ ఎన్నుకోబడ్డారు.
తిరిగి 2012 లో మరోసారి నరసింహారెడ్డి సేవలను వినియోగించుకోవటం కోసం సభ్యులు, చైర్మన్ స్థానానికి పోటీ చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి స్వయానా పినతండ్రైన నల్లారి ద్వారకానాథ్ రెడ్డి ని ఓడించి నరసింహారెడ్డికి పట్టం కట్టారు.
న్యాయవిభాగంలో ఎన్నో సంవత్సరాల అనుభవం గల ఎ.నరసింహారెడ్డిని చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినందుకు అభినందనలు తెలియజేస్తూ, ఆంధ్రావిశేష్ ఆయన ఇంకా ఎన్నో ఉన్నత పదవులనలంకరించి ఇంకా ఎన్నో ముఖ్యమైన బాధ్యతలు చేపట్టి సంపాదించిన విలువైన అనుభవాన్ని మరింతగా సమాజాభివృద్ధికి వినియోగిస్తారని కాంక్షిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more