పార్లమెంటులో ఇటీవల కేంద్రబడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఆ సందర్భంగా టీమిండియా విజాయాన్ని ప్రస్తావనకు తెచ్చారు. టీమిండియా కుర్రాళ్ల విజయదాహానికి అస్ట్రేలియా సిరీస్ విజయం ఓ నిదర్శనమని దాని గురించి ప్రస్తావించారు. అయితే తాజాగా వచ్చిన ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) ప్రకటించిన ప్రజాస్వామ్య సూచీలో భారత ర్యాంకు దిగిపోవడానికి సంకేతమేమిటో కూడా అమె పార్లమెంటులో చెబుతారా.. లేక మీడియా ముఖంగా దేశ ప్రజలకు చెబుతారా.? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
భారత్ దేశంలో ఎన్డీయే ప్రభుత్వం దేశ పౌరుల కోసం అనేక సరికొత్త విధానాలను అవలంభిస్తూ అనేక మార్పులు తీసుకువచ్చిందని నిత్యం గోప్పలు చెప్పే కేంద్రమంత్రులు, బీజేపి సహా ఎన్డీఏ భాగస్వామ్యపక్షాల నేతలు.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా బాసిల్లుతున్న భారత్ లో ప్రజాస్వామ్య సూచీ ఎందుకు తగ్గిందో చెప్పగలరా.? గడచిన 70 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఏ ప్రభుత్వం చేయలేని పనులు సాధించామని బీరాలు పోతున్న నేతలు.. క్రమక్రమంగా దేశంలో దేశపౌరులకు ప్రజాస్వామ్యం కల్పించిన స్వేచ్ఛ కూడా హరించుకుపోతున్నదన్న విషయం అసలు తెలుసా.?
అధికారంలో వుంటూ అన్ని సౌఖ్యాలు అనుభవిస్తున్న అధికార పక్షం నేతలకు.. గ్రామీణ ప్రజల నుంచి నానాటికీ హరించుకుపోతున్న స్వేఛ్ఛా స్వతంత్రాల గురించి..ఏం తెలుస్తుందన్న ప్రశ్నలు వినబడుతున్నాయి. 2014లో 7.92 పాయింట్ల స్కోరుతో ప్రపంచంలోనే 27వ స్థానంలో ఉన్న భారత్ కేవలం ఏడేళ్ల కాలంలో ఎందుకు 53వ స్థానానికి దిగజారిందన్న వివరణను బీజేపి పెద్దలు కానీ.. కేంద్రప్రభుత్వ అధికారులు కానీ.. కనీసం కేంద్రమంత్రులైనా వివరించగలరా.? అసలు ఈ అంశంపైన వారు అసలు దృష్టి సారించారా.?.
ప్రజాస్వామ్యానికి దేవాలయమైన పార్లమెంటులో తొలిసారిగా అడుగుపెడుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ శిరస్పు నేలకు తాకించి మరీ మొక్కారు. అయితే అదే దేవాలయంలో కోలువైన దేవుడు దేశవ్యాప్తంగా ప్రజలల్లో వుంటాడన్న విషయం కూడా ఆయనకు తెలియంది కాదు. ప్రజల సుఖసంతోషాల్లో.. ప్రజాస్వామ్య దేవాలయానికి కొత్త వెలుగులు వస్తాయని, అదే వారు కష్టనష్టాల్లో ఉంటే అందుకు వ్యతిరేక ఫలితాలు వుంటాయన్న విషయం కూడా తెలుసు. అన్ని తెలిసిన పెద్దలు ఇప్పటికే దిగజారిన ప్రజాస్వామ్య సూచిని ఇకనైనా మెరుగుపరుస్తారో.? లేదో వేచిచూడాల్సిందే.!
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more