ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తామని ఎన్నికలకు ముందు చెప్పిన వైఎస్ జగన్.. అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని అమలు చేసేందుకు మాత్రం కొర్రీలు పెడుతున్నారా.? అంటే ఔనన తప్పదు. ఎన్నికలకు ముందు ప్రకటించిన నవరత్నాలతో ప్రజలు ఆ పార్టీకి బ్రహ్మరథం పట్టడంతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఒకొక్కటిగా పథాకాలను ప్రవేశపెడుతూ వస్తోంది. ఈ క్రమంలో అధికశాతం మందితో ముడిపడిన పథకాలు రేషన్ కార్డులు, పింఛన్ల అన్న విషయం అందరికీ తెలిసిందే.
దీంతో ఈ రెండు పథకాలకు విద్యుత్ వినియోగంతో ముడిపెట్టిన వైసీపీ ప్రభుత్వం.. ఇక్కడే అసలు కొర్రీలు పెట్టింది. విద్యుత్ వినియోగం అధికంగా వుంటే సబ్సీడీలపై లభించే రేషన్ కానీ.. లేక ఫించన్లు కానీ ఇవ్వలేమని స్పష్టం చేస్తోంది. తాజాగా నియమితులైన గ్రామ వాలెంటీర్లు.. ఈ వివరాలను సేకరించి.. వాటిపై దృష్టిపెట్టనున్నారని కూడా సమాచారం. అంతేకాదు నాలుగు చక్రాల వాహనాలు (టాక్సీలు మినహాయించి) వున్న ఏ ఒక్కరికి కూడా ఆహార భద్రత కింద రేషన్ లభించదని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
ఇక రేషన్ పోందాలంటే ఎంత విద్యుత్ ను వినియోగించాలి.. ఫించను రావాలంటే ఎంత విద్యుత్ ను వినియోగించాలన్న వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకు రెండు వందల యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగం చేసే ఏ ఒక్కరికి కూడా నిత్యావసర సరుకులు రేషన్ దుకాణాల్లో సబ్సీడి ధరలపై లభించవని ముడిపెట్టింది. అలాగే నెలకు మూడు వందల యూనిట్ల కన్నా అధికంగా విద్యుత్ వినియోగం చేసేవారికి ఫించను కూడా లభించదని తాజాగా వెల్లడించింది. ఈ క్రమంలో ఇల్లు అద్దెకిచ్చే స్తోమత ఉన్నవారు ఫించన్లకు ఎలా అర్హులని కూడా విద్యుత్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
ఇక ఉచిత విద్యుత్ పథకంలోనూ కొర్రీలు పెట్టిన విద్యుత్ అధికారులు.. ఇకపై సొంత ఇళ్లలో నివాసముండే వారికి కూడా ఈ వెసలుబాటును వర్తింపజేయమని చెబుతున్నారు. ఇదిలావుంటే.. ఇన్నాళ్ల పాటు భర్త ఆధార్, భార్య అధార్ కార్డులు వేర్వేరుగా వున్నా ఇకపై భార్యభర్తల అధార్ ను కలసి ఒక యూనిట్ గా పరిగణలోకి తీసుకోనున్నారు. ఇకపై ఇల్లు, వాణిజ్య, వాప్యార, పారిశ్రామిక, ఇత్యాది ఏ సేవా రంగంలోనైనా భార్యభర్తల యూనిట్ నే పరిగణలోకి తీసుకోనున్నారు.
రాష్ట్రంలో నిజమైన అర్హులకు పథకాలు పూర్తిస్థాయిలో అందాలంటే.. ఈ నిబంధనలను వర్తింపజేయాలని కూడా ప్రభుత్వం కృతనిశ్చయంతో వుంది. ఈ మేరకు నూతన సవరణలు అమల్లోకి తీసుకోవాలని కూడా యోచిస్తోంది. అయితే తాజా సవరణలపై ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతకాలు కూడా చేశారని సమాచారం. దీంతో ప్రభుత్వం పథకాలను ప్రవేశపెట్టి.. వాటిని అందుకోనీయకుండా కొర్రీలు పెడుతొందని ఇన్నాళ్లు నిబంధనలను ఉల్లఘించిన పథకాల లబ్దిని పోంది.. తాజా అదేశాలతో లబ్దికి దూరమవుతున్న పలువరు అరోపిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more