ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతిపక్ష టీడీపీకి చెందిన సీనియర్ నాయకులు ఓటమి చవిచూడగానే.. తమకు రాజకీయ మనుగడను ప్రసాదించి.. రాజకీయ జీవితాన్ని అందించిన తెలుగు దేశం పార్టీని కాదని.. పక్క చూపులు చూస్తున్నారు. దీంతో వారిని నిలువరించడం కూడా పార్టీ అధినేతకు కష్టసాధ్యంగా మారిపోయింది. ఇప్పటికే అనేకమంది నేతలు పార్టీలు మారగా... మరికొందరు కూడా ఇదే ఆలోచనతో ఉన్నట్టు చాలాకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.
రాజకీయంగా నిలదొక్కుకునేందుకు పలు అవకతవకలకు పాల్పడిన నేతలకు ఇప్పుడు అధికార పార్టీ శరణాగతవాత్సల్యాన్ని అందిస్తూ.. అభయానిస్తోందన్న వార్తలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇన్నాళ్లు రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీని తూర్పరబట్టిన పలువురు నేతలు ఎలాంటి జంకుబోంకు లేకుండా ఆ పార్టీలోకి వెళ్లి.. తాజాగా పదవులు కూడా పోందిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు మొహమాటం అడ్డువచ్చిన నేతలు మాత్రం కేంద్రంలోని అధికార పార్టీ బీజేపి తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారు.
ఇందులో రెండు లాభాలున్నాయని వార్తలు కూడా వున్నాయి. బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకుంటే.. రాష్ట్రంలోని పార్టీ వారిపై అవకతవకలకు సంబంధించి ఎలాంటి కేసులు నమోదు చేయదని.. ఇక తమ వారే కాబట్టి కేంద్రం కూడా తమ గూటికి చెందిన పక్షిని రక్షించుకుంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రంలోని బీజేపి పార్టీ తమ పాలిట రక్షణ అవాసంగా మారిందని టాక్ కూడా వినిపిస్తోంది. ఇక ఇతర పార్టీల నేతలను తమ గూటికి రప్పించుకునేందుకు బీజేపీయే ఇలాంటి ప్రయత్నాలకు శ్రీకారం చుడుతుందన్న అరోపణలు వినబడుతున్నాయి.
ఈ క్రమంలో తాజాగా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా ఇలాంటి వారి జాబితాలో చేరేందుకు సిద్దమవుతున్నారని వార్తలు తెరపైకి వస్తున్నాయి. టీడీపీ అధిష్టానంపై గుర్రుగా వున్న వంశీ పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఓ కేసు విషయంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వల్లభనేని వంశీ త్వరలోనే పార్టీ మారడం ఖాయమనే ప్రచారం సాగుతోంది. ఇలాంటి ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో వల్లభనేని వంశీ... ఎంపీ సుజనా చౌదరిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీ సుజనా చౌదరికి ఎమ్మెల్యే వంశీకి మొదటి నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ కారణంగానే ఆయన ఎంపీ సుజనాను కలిశారని పలువురు భావిస్తుంటే... పార్టీ మారతారన్న ప్రచారం సాగుతున్న సమయంలో ఎంపీ సుజనాను వంశీ కలవడం రాజకీయంగా కలకలం రేపుతోంది. సుజనాను కలిసిన వంశీ... ఆయనతో కలిసి ఒకే కారులో ఒంగోలుకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తానికి టీడీపీ అధినాయకత్వంలో అంటీముట్టనట్టుగా వ్యవహరించే ఎమ్మెల్యే వల్లభనేని వంశీ... రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం ఆసక్తికరంగా మారింది.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more