తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన యాద్రాది భువనగిరి జిల్లా హాజీపూర్ లో మర్డర్ మిస్టరీల కేసు దర్యాప్తులో హంతకుడు శ్రీనివాస్ రెడ్డిని ఎన్ కౌంటర్ లో అంతం చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో తమ పల్లెలోని ప్రతీ ఆడపడచు ఓ రుద్రమదేవిలా అర్థరాత్రి, అపరాత్రి అన్న తేడా లేకుండా స్వేచ్ఛగా, స్వతంత్రంగా పోలాలకు వెళ్లి వచ్చేవారని.. అలాంటి హాజీపూర్ గ్రామంతో పాటు పరిసర గ్రామాల్లోనూ ఆడపడచులను భాయాందోళనకు గురిచేసిన సైకో శ్రీనివాస్ రెడ్డి అని.. సదరు నిందితుడిని అంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు బొమ్మలరామారం మండలవాసులు.
బొమ్మలరామారాంలోని హాజీపూర్ పరిసర గ్రామాల అడపిల్లలను కన్న తల్లిదండ్రులకు కంటిమీద కునుకును కరువయ్యేలా చేసిన శ్రీనివాస్ రెడ్డి.. బతికి వున్నంతవరకు తమ ఆడపిల్లలు భయాందోళనకు గురవుతారని.. ప్రభుత్వం, పోలీసులు ఎంత భరోసా ఇచ్చినా.. నిందితుడు శ్రీనివాస్ రెడ్డి మరణమే వారికి పెద్ద భరోసా అంటూ గ్రామస్థులు తేల్చిచెబుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో ఆడపిల్లలపై కన్నెత్తి చూస్తే కన్నుపికేస్తానంటూ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన సందర్భంగా కేసీఆర్ చెప్పిన విషయాన్ని కూడా వీరు గుర్తు చేస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సార్.. మీరు కన్నెత్తి చూస్తేనే కన్ను పీకేస్తాననన్నారు. మరీ హాజీపూర్ గ్రామంలో అమాయక పిల్లలను తీసుకెళ్లి అఘాయిత్యానికి తెగబడి వారిని బావుల్లో పూడ్చిపెట్టి.. ఏమీ ఎరగనట్టు తీరుగుతున్న శ్రీనివాస్ రెడ్డిని తక్షణం ఎన్ కౌంటర్ చేయండీ సారూ అంటూ హాజీపూర్ గ్రామాస్థులు, మృతుల బంధువులు కోరుతున్నారు. ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోని పక్షంలో గ్రామప్రజల్లో మరీ ముఖ్యంగా ఆడపడచులు మానసిక స్థైర్యం కోల్పోతారాని, ఎవరు ఎటునుంచి వచ్చి వారిపై దాడి చేస్తారో అనే భయాందోళనకు గురవుతారని గ్రామస్థులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.
సైకో రేపిస్టు కిల్లర్ శ్రీనివాస్ రెడ్డే శ్రావణిపై అత్యాచారం, హత్య చేసిన నేపథ్యంలో అరెస్టు చేసిన పోలీసులు తమదైన శైలిలో నిందితుడ్ని విచారించగా, ఆ తరువాత నెల రోజుల క్రితం అదృశ్యమైన డిగ్రీ విద్యార్థిని మనీషా శవం లభ్యమైంది. ఆ తరువాత నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన పదకొండేళ్ల కల్పన మిస్సింగ్ కేసును విచారించగా అది కూడా తానే చేశానని నిందితుడు అంగీకరించాడని స్వయంగా రాచకోండ కమీషనర్ మీడియాకు తెలిపారని.. పేర్కోంటున్నారు.
దీంతో ఒక్క సైకో ముగ్గరు అమ్మాయిల జీవితాలను బుగ్గిపాలు చేసిన కాలరాసాడని, నిందితుడ్ని అంతమెందించడంతోనే తమకు న్యాయం జరుగుతుందని అంటున్నారు. ఈ మేరకు మీడియా ప్రతినిధులను, సీఎం సారు కానొచ్చిండా.. కానోస్తే జె్ప్పుండీ అంటూ వృద్దులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక మరికోందరు మాత్రం కవితపై చెడువార్తలు రాస్తేనే లోపలేసిన నిందితుడ్ని కటకటాల పాలుచేసిన ముఖ్యమంత్రిగారూ.. మా బిడ్డలను ఈ రాక్షసుడు అత్యాచారం చేసి మారీ చంపిండు.. వాడు బతికుంటే తమ అడబిడ్డలకు రక్షణ వుండదని కోరుతున్నారు.
(And get your daily news straight to your inbox)
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more
May 19 | సీనియర్ కమేడియన్ అలీ అధికార వైసీపీ పార్టీకి రాజీనామా చేయనున్నారా.? అంటే ఔనన్న సమాధానాలే వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని అధికార వైసీపీ పార్టీలో సినీమారంగం నుంచి ఆశించినంత స్థాయిలో మద్దతు లేదు. జగన్ సర్కార్ అధికారంలోకి... Read more
May 18 | గుజరాత్ కాంగ్రేస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పటీదార్ ఉద్యమ నేత హర్థిక్ పటేల్.. సరిగ్గా ఎన్నికలకు ముందు తన మనసు మార్చుకున్నారు. 24 గంటల ముందు తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో చర్చించిన తరువాత... Read more
Mar 18 | కాంగ్రెస్ పార్టీకి కేరాఫ్ అడ్రస్గా చెప్పుకొనే కోమటిరెడ్డి బ్రదర్స్.. కాషాయ బాట పట్టనున్నారా?. అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొన్న తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నేత వివేక్ వెంకటస్వామితో భేటీ... Read more
Mar 18 | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీని మరింత ఆందోళనకు గురి చేశాయి. మరీ ముఖ్యంగా పంజాబ్లో అధికారాన్ని తిరిగి అందుకుంటామన్న అంచనాలు నెలకొనగా, తాజా పలితాలతో అక్కడి కూడా పరిస్థితి అద్వానంగా... Read more