సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంతో అందరి దృష్టి అత్యధిక ఎంపీ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్ పాలిటిక్స్ పైనే నెలకొంది. యూపీలో చక్రం తిప్పేవాళ్లే హస్తిన సింహాసాన్ని అధిరోహించగలరన్న అంచనాలు పెద్దస్థాయిలో ఉండటంతో.. రాజకీయ అవగాహన వున్న యావత్ దేశప్రజలు దృష్టి అక్కడే పడింది. యూపీలో పాగా వేసేదెవరు అన్న చర్చ జోరుగా జరుగుతోంది. ముఖ్యంగా ఎస్పీ-బీఎస్పీ పొత్తు ఈసారి ఉత్తరప్రదేశ్ ఎన్నికలను తీవ్రంగా ప్రభావం చేస్తుందన్న అంచనాలు ఉన్నాయి.
ఆ అంచనాలకు తగ్గట్టే ఫలితాలు ఉండబోతున్నాయని తాజాగా ఇండియా టుడే-కార్వీ సర్వే స్పష్టం చేసింది. యూపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ తన మిత్రపక్షం అప్నాదళ్తో కలిసి కేవలం 18 సీట్లకే పరిమితం అవుతుందని సర్వే వెల్లడించింది. అదే సమయంలో ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్డీ దాదాపు 58సీట్లను కైవసం చేసుకుంటాయని తెలిపింది. కాంగ్రెస్ 4 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉన్నట్టు వెల్లడైంది.
గత ఎన్నికల్లో యూపీలో బీజేపీ స్వతహాగా 71 స్థానాల్లో గెలిచింది. మిత్రపక్షం అప్నాదళ్ రెండు స్థానాల్లో విజయం సాధించింది. అంటే, ఇండియా టుడే సర్వే ప్రకారం.. యూపీలో బీజేపీ పరిస్థితి 71 నుంచి 16 స్థానాలకు పడిపోనుంది. అదే సమయంలో గత ఎన్నికల్లో కేవలం ఐదు సీట్లకే పరిమితమైన ఎస్పీ, అసలు ఖాతానే తెరవని బీఎస్పీ.. రెండూ కలిపి 58 స్థానాల వరకు కైవసం చేసుకోబోతున్నాయని సర్వే తెలపడం గమనార్హం.
ఈ లెక్కన యూపీ రాజకీయాల్లో సోషల్ ఇంజనీరింగ్ మరోసారి కీలక పాత్ర పోషించబోతున్న విషయం తేట తెల్లమవుతోంది. అలాగే గత ఎన్నికల్లో కేవలం రెండే స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్ ఈసారి మరో రెండు స్థానాల్లోనూ సత్తా చాటబోతుందని సర్వే వెల్లడించింది. సర్వేలో వెల్లడైన మరో ఆసక్తికర విషయమేంటంటే.. ఒకవేళ ఎస్పీ-బీఎస్పీ పొత్తులో కాంగ్రెస్ కూడా ఉండి ఉంటే.. బీజేపీ పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యేదని సర్వేలో తేలింది. ఎస్పీ-బీఎస్పీ-కాంగ్రెస్ కలిసి పోటీ చేసి ఉంటే బీజేపీ కేవలం 5 స్థానాలకు పరిమితమయ్యేదని సర్వే తెలిపింది.
ఇక ఓట్ల శాతానికి వస్తే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ-అప్నాదళ్ పక్షానికి 36శాతం ఓట్లు, ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్డీ పక్షానికి 46 శాతం, కాంగ్రెస్ 12శాతం ఓట్లు గెలుచుకుంటాయని సర్వే వెల్లడించింది. గత ఎన్నికల్లో ఎస్పీ 22.2శాతం, బీఎస్పీ 19.6శాతం, కాంగ్రెస్ 7.5శాతం, ఆర్ఎల్డీ 1శాతం ఓట్లను మాత్రమే గెలుచుకున్నాయి. ఈ సర్వే కోసం దాదాపు 2400 పైచిలుకు మంది నుంచి అభిప్రాయాలను సేకరించినట్టు సంస్థ వెల్లడించింది. కాగా, ఎస్పీ, బీఎస్పీ పొత్తులో కాంగ్రెస్ కూడా భాగస్వామి అయి ఉంటే యూపీలో బీజేపీ దాదాపుగా గల్లంతయిపోయేదని ఎక్కువమంది అభిప్రాయపడినట్టు తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more