ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తుందా..? అన్న ప్రశ్న ప్రస్తుతం తరుణంలో హాట్ టాపిక్ గా మారగా, టీడీపీకి చెందిన పలువురు ద్వీతీయ శ్రేణి నేతలు అప్పుడే తమ అటు వైసీపీ, ఇటు జనసేన పార్టీల వైపుకు మళ్లుతుండగా.. ఇక పార్టీలో నేతల మధ్య వున్న విభేదాలు మరోమారు అగ్రనేతల వలసలకు కూడా కారణమవుతున్నాయా..? అన్న సందేహాలు ఉత్పన్నం అవతున్నాయి. టీడీపీలోని మంత్రుల మధ్య ఉన్న విభేదాలతో పాటు, పలు నియోజకవర్గాల్లో వలస వచ్చిన నేతలు.. మొదటి నుంచి పార్టీలో కొనసాగుతున్న నేతలకు పొసడగం లేదన్న వార్తలు కూడా తెరపైకి వస్తున్నాయి.
ఇప్పటికే గత ఎన్నికలలో మిత్రపక్షాలుగా వున్న బీజేపి, జనసేన పార్టీలు అధికార తెలుగుదేశం ప్రభుత్వానికి దూరం కాగా, ఇక వామపక్షాలు కూడా టీడీపీతో జతకలసే అవకాశం లేక టీడీపీ ఒంటరిగా మిగిలిపోయింది. కేంద్రంలోని బీజేపి పార్టీని ముద్దాయిగా చేస్తూ రాష్ట్రంలో టీడీపీ పార్టీ ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన అరోపణలు, విమర్శలు చేస్తున్నా.. మీడియా మ్యానేజ్ మెంట్ తెలిసిన టీడీపీ.. అటు పత్రికలలో, ఇటు మీడియాలో తమ వార్తలను కవర్ చేయిస్తున్నా.. అదే స్థాయిలో మాత్రం ప్రజల్లోకి వెళ్లలేకపోతుందన్నది మాత్రం వాస్తవమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకు బీజేపిని పక్కనబెడితే.. జనసేన చేసిన అరోపణలు ప్రజల్లోకి బలంగా వెళ్లడమే కారణమని టాక్.
ఈ క్రమంలో ఏకంగా మంత్రుల మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు కేవలం పదవుల కోసమే టీడీపీలో చేరారని, గతాన్ని మరచిపోయి ఆయన మాట్లాడుతున్నారని మరో మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు. తొలుత తెలుగుదేశంలో ఉండి, ఆపై ప్రజారాజ్యం, అక్కడి నుంచి కాంగ్రెస్ లో చేరి, తిరిగి ఆయన మంత్రి పదవి కోసమే టీడీపీలోకి వచ్చారని, మూడు పార్టీలు మారిన విషయాన్ని మరచిపోయి, ఆయనకు మంత్రి పదవిని ఇస్తే, ఇప్పుడు రాజకీయ స్వలాభాన్నే ఆయన చూసుకుంటున్నారని నిప్పులు చెరిగారు.
అయితే నియోజకవర్గాల సంఖ్య పెరిగితే అందరినీ రాజీకీ తీసుకువచ్చా మళ్లీ అధికారం అందుకోవచ్చుకున్న టీడీపీ కల చెందిరింది. దీంతో ప్రస్తుతం వున్న 175 నియోజకవర్గల్లోనే తమ నేతలను పోటీ చేయించాలి. అయితే వలసవచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వాలా..? లేక తమ పార్టీకి చెందిన నేతలకే సీట్లు ఇవ్వాలా అన్నది పార్టీలో ప్రశ్నార్థకంగా మారింది. ఇక వలసదారుల వల్ల తమకు అవకాశం రాదన్న పలువరు నేతలు పక్క పార్టీల వైపు చూపును మరలిస్తున్నారని కూడా సమాచారం. ఇక టీడీపీ పరిస్థితిని అంచనా వేసిన పలువురు నేతలు కూడా మునిగిపోయే పడవలో ఎందుకున్నట్లు పార్టీలు మారేందుకు కూడా రెడీ అవుతున్నారని గుసగుసలు వినబడుతున్నాయి. ఇంకా ఏడాది సమయంలో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే మరి.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more