తెలంగాణ రాష్ట్ర సమితికి కంచుకోటగా వున్న కరీంనగర్ జిల్లాలో జనసేన పార్టీ తమ రాజకీయ ప్రచారాన్ని ప్రారంభించింది. తెలంగాణలో ప్రజా యాత్రలో భాగంగా జనసేన అధ్యక్షుడు, సినీ నటడు పవర్ స్టార్ పవన్ కల్యాన్ ఇవాళ కొండగట్టు అంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కరీంనగర్ చేరుకుని అక్కడ ప్రేస్ మీట్ నిర్వహించారు. తెలంగాణ పార్టీ స్థాపనకు పునాది వేసి తొలి బహిరంగ సభకు వేదికైన కరీంనగర్ లో ఇవాళ పవన్ కల్యాన్ కు అభిమానులను పట్టిన బ్రహ్మరథంతో అధికార పార్టీలో బీటలు వారుతున్నాయా? అన్న అనుమానాలు కూడా తలెత్తనున్నాయి.
అయితే ఇన్నాళ్లు తమకు మాత్రమే కంచుకోటగా అని భావించిన టీఆర్ఎస్ సహా అంతకు ముందు ఈ ప్రాంతంలో అదిపత్యాన్ని చాటిన కాంగ్రెస్ పార్టీ నేతల్లో కూడా అందోళన ప్రారంభమైంది. పూర్తిగా యువత పవన్ కల్యాన్ అంటూ అతని వెంట తిరిగితే.. ఇక తమ పార్టీలో తమకు పల్లకీలు పట్టేది ఎవరన్న చర్చకు కూడా ఈ పరిణామాలు అంతర్గతంగా దారితీస్తున్నాయి. ఇక పవన్ కల్యాన్ ఇతర పార్టీ నేతలకు కూడా తమ పార్టీలోకి అహ్వనిస్తామని, అయితే వారు ప్రజాహితం కోసం కంకణబద్దులయితేనా తాము స్వాగతిస్తామని చెప్పడంతో.. కొందరు యువ నాయకులు కూడా అటువైపు చూస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో ఈ ఏడాది చివరి నాటికి సార్వత్రిక ఎన్నికలు జరిగితే లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా అనివార్యమన్న విషయాన్ని ఇప్పటికే అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం.. దానికి మద్దతుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వంత పాడినట్లు ప్రకటన చేయడంతో.. అసెంబ్లీ స్థానాల పెంపు ఈ లోగా జరగకపోవచ్చునని. దీంతో తమ పార్టీకి చెందిన నాయకులతో పాటు పార్టీలలోకి వలస వచ్చిన నాయకులను ఎలా బుజ్జగించాలన్ని విషయం అధికార పార్టీలకు శరాఘతంగా మారింది.
దీంతో పార్టీలోని యువ క్యాడర్ పవన్ కల్యాన్ పార్టీవైపు కూడా పయనించే అవకాశాలు వున్నాయని వార్తలు వినబడుతున్నాయి. ఇక ఇదే సమయంలో ఎలాగైనా ఈ సారి ఎన్నికలోనైనా విజయాన్ని సాధించాలంటే మాత్రం.. తాము తప్పక ఇతర పార్టీ వైపు పయనించాలని అలోచన వున్న విపక్షాలకు చెందిన పార్టీ నేతలు కూడా పవన్ జనసేన వైపు అకర్షితులవుతున్నారని సమాచారం.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more