తమిళ రాజకీయాల్లో మరో సంచలనకరమైన వార్త ప్రస్తతుం జోరందుకుంది. తమిళనాడు నిర్మాతల మండలి అధ్యక్షుడు, నడిగార్ సంఘం ప్రధాన కార్యదర్శి, కాలీవుడ్ యువ హీరో విశాల్ రెడ్డి ఇప్పటికే సినీమా రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చి సంచలనాలకు తెరలేపిన నేపథ్యంలో ఆయన ఇక నేరుగా తమిళ రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారన్న వార్త ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా సంచలనంగా మారింది.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఖాళీగా మారిన అర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగుతున్న క్రమంలో విశాల్ కూడా బరిలో నిలుస్తారని తమిళ మీడియా నుంచి అందుతున్న వార్తలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అంతేకాదు కొత్త పార్టీ నెలకొల్పి 2021 ఎన్నికల్లో మొత్తం 234 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమౌతున్నాడని కూడా వార్తలు వినబడుతున్నాయి.
ప్రస్తుతం స్వతంత్ర్య అభ్యర్థిగా విశాల్ బరిలో దిగే అవకాశాలున్నాయన్న వార్తలు కూడా వినబడుతున్నాయి. ఆర్కే నగర్ ఉపఎన్నికకు సోమవారం విశాల్ నామినేషన్ కూడా దాఖలు చేయనున్నారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కాగా విశాల్ కు కమల్ హాసన్ కూడా మద్దతు తెలుపుతున్నారని సమాచారం. ఇదిలావుండగా, విశాల్ సన్నిహిత వర్గాలు మాత్రం ఈ వార్తలను తోసిపుచ్చుతున్నాయి. ఇప్పటికే బిజీగా వున్న విశాల్ రాజకీయాల్లోకి రారని వారు వాదిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more
May 19 | సీనియర్ కమేడియన్ అలీ అధికార వైసీపీ పార్టీకి రాజీనామా చేయనున్నారా.? అంటే ఔనన్న సమాధానాలే వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని అధికార వైసీపీ పార్టీలో సినీమారంగం నుంచి ఆశించినంత స్థాయిలో మద్దతు లేదు. జగన్ సర్కార్ అధికారంలోకి... Read more
May 18 | గుజరాత్ కాంగ్రేస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పటీదార్ ఉద్యమ నేత హర్థిక్ పటేల్.. సరిగ్గా ఎన్నికలకు ముందు తన మనసు మార్చుకున్నారు. 24 గంటల ముందు తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో చర్చించిన తరువాత... Read more
Mar 18 | కాంగ్రెస్ పార్టీకి కేరాఫ్ అడ్రస్గా చెప్పుకొనే కోమటిరెడ్డి బ్రదర్స్.. కాషాయ బాట పట్టనున్నారా?. అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొన్న తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నేత వివేక్ వెంకటస్వామితో భేటీ... Read more
Mar 18 | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీని మరింత ఆందోళనకు గురి చేశాయి. మరీ ముఖ్యంగా పంజాబ్లో అధికారాన్ని తిరిగి అందుకుంటామన్న అంచనాలు నెలకొనగా, తాజా పలితాలతో అక్కడి కూడా పరిస్థితి అద్వానంగా... Read more