ఆంద్రప్రదేశ్ లో నంద్యాల, కాకినాడ ఎన్నికలలో అధికార టీడీపీ పార్టీ విజయం సాధించినప్పటి నుంచి వైసీపీ పార్టీ శ్రేణుల్లో నిర్లిప్తత అవహించిందా..? అంటే అవుననే అంటున్నారు. ఈ క్రమంలో తన పార్టీ శ్రేణులను, కార్యకర్తలను, అభిమానులను, కాపాడుకుని వారితో నూతనోత్తేజం నింపేందుకు జగన్ ప్రయత్నాలు మొదలెట్టగానే.. ఇటు పార్టీకి చెందిన నాయకులు మాత్రం అందుకు దూరమవుతున్నారు. అన్ని జిల్లాల్లో ఈ పరిస్థితి కానరానప్పటికీ.. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో జిల్లాలో మాత్రం ఇదే సీన్ కనిపిస్తుంది.
ఉత్తరాంధ్రలో మరీ ముఖ్యంగా విజయనగరం జిల్లాలో మాత్రం వైసీపీ నేతలు ఆ పార్టీకి దూరమవుతున్నారు. దీంతో జిల్లాలో క్రమంగా పార్టీ ఆధిపత్యం తగ్గుదోందన్న వార్తలు తెరపైకి వస్తున్నాయి. జగన్ పాదయాత్ర నేపథ్యంలో జిల్లాలో హుషారేత్తాల్సిన నాయకత్వం.. పార్టీ శ్రేణులను, కార్యకర్తలు ఉత్తేజపర్చాల్సిందిపోయి.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఏకంగా పార్టీలకు రాజీనామా చేస్తూ.. అధికార పార్టీ వైపు పరుగులు పెడుతున్నారు. దీంతో ప్రతిపక్ష పార్టీకి బలహీనమవుతుందన్న వార్తలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది.
బొబ్బిలి నియోజకవర్గం నుంచి వైసీపీ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ కృష్ణ రంగారావు ఆ పార్టీని వీడి అధికార పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో.. ఆయనకు మంత్రి పదవి కూడా దక్కింది. దీంతో అదే బాటలో పయనించి చేకూరేలాభాన్ని అందుకోవాలని జిల్లాకు చెందిన వైసీపీ పార్టీ నేతలు భావిస్తున్నట్లు వున్నారు. ఈ బాటలో పయనించేవారిలో వైసీపీ జిల్లా సమన్వయకర్త, సీనియర్ రాజకీయ నాయకుడు కోలగట్ల వీరభద్ర స్వామి ముందువరుసలో వున్నారు. ఏకంగా వైసీపీ పార్టీకి పదవికి, పార్టీకి కూడా రాజీనామా చేసేశారు. రాజీనామా లేఖని వైసీపీ అధినేత జగన్ కి కూడా పంపించినట్లు ఆయన చెప్పారు.
వ్యక్తిగత కారణాలతో వైసీపీని వీడుతున్నానని.. జిల్లాలో పలువురు నాయకులతో పని చేయడం ఇష్టం లేకపోవడం తప్పనిసరి పరిస్థితిలో తప్పుకుంటున్నానని చెప్పారు. దీంతో జిల్లాలో వైసీపీ పార్టీకి మిగిలిన పెద్ద దిక్కు మాజీ మంత్రి బొత్ససత్యనారాయణే నన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. విజయనగరం జిల్లలో ఆధిపత్యం చూపించాలనుకున్న వైసీపీకి రానున్న ఎన్నికల నాటికి నేతలు వచ్చి చేరుతారా..? లేక నాయకుల కొరత ఏర్పడుతుందా..? అన్నది ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more