మెగాస్టార్ చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ క్రీయాశీలక రాజకీయాలలోకి పునరాగమనం చేయనున్నారా..? అంటే అవుననే సంకేతాలే వస్తున్నాయి. ఆయనుకు రాష్ట్ర పార్టీలో కిలక బాధ్యతలను అప్పగించే పనిలో అధిష్టానం వుందన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. తమ వినతి మేరకు ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజారాజ్యం పార్టీని పార్టీ.. కాంగ్రెస్ లో వీలినం చేసిన నాయకుడిని కొల్పోయేందుకు సుముఖంగా లేని అధిష్టానం.. ఆయనకున్న ప్రజాదరణ, ప్రేక్షకాదరణ దృష్ట్యా పార్టీలో కిలక బాధ్యతలను అప్పగించాలని సన్నధమైందని సమాచారం.
గత మూడేళ్లుగా పార్టీ వ్యవహరాల్లో పెద్దగా జోక్యం చేసుకున్నట్లు కనిపించని చిరంజీవికి.. కీలక బాధ్యతలు అప్పగిస్తే పూనాది స్థాయి నుంచి పార్టీని మళ్లీ బలోపేతం చేస్తారన్న భావిస్తున్న అధిష్టానం.. ఆయనకు కీలక బాధ్యతలను అప్పగించాలని సంకల్పించింది. ఈ నేపథ్యంలోనే ఆయనకు పశ్చివ గోదావరి జిల్లా కొవ్యూరు నుంచి పిసీసీ సభ్యుడిగా ఎంపిక చేశారని కూడా సంకేతాలు వస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకుంటున్న పరిమాణాలన్నింటినీ గమనిస్తే చిరంజీవి మాత్రమే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయగల అశాకిరణంగా అధిష్టానం భావిస్తుందా..? అన్న సంకేతాలు వెలువుడుతున్నాయి.
ఇందుకోసం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి కాంగ్రెస్ పార్టీ ముస్లిం మహిళా నేత అమర జహా బేష్ ని పిసిసి సభ్యురాలిగా నియమించిన అధిష్టానం.. చిరంజీవి కోసం అమెను తప్పించిందని కూడా వార్తలు వినబడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి గత ఎన్నికలకు ముందు, తరువాత దూరమైన నాయకులను సమీకరించి.. మళ్లీ పార్టీలో నూతనోత్తేజం తీసుకురాగల సత్తా కేవలం చిరంజీవికి మాత్రమే వుందని కూడా అధిష్టానం భావిస్తుంది.
ఇప్పటికే ఓ వైపు తన సోదరుడు పవర్ స్టార్ పవన్ కల్యాన్ జనసేన పార్టీని స్థాపించి.. రానున్న 2019 ఎన్నికల బరిలో నిలుస్తానని ప్రకటించారు. దీనికి తోడు తన పార్టీ సేనను కూడా సిద్దం చేశారు. కాగా అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇచ్చే పార్టీలతోనే తాను జతకడతానని కూడా ఇప్పటికే ప్రకటించారు. దీంతో జాతీయ పార్టీ బీజేపి హామీని నిలబెట్టుకోలేకపోవడంతో దానికి దూరంగా వున్న పవన్ రానున్న ఎన్నకలలో అన్న చిరంజీవికి మద్దుతునిస్తారా..? వీరిద్దరి కలయికతో రాష్ట్రంలో జనసేన, కాంగ్రెస్ కూటమి కూడా ఏర్పడుతుందా..? అన్న సందేహాలకు తావిస్తుంది. మారుతున్న రాజకీయ సమీకరణలు ఏ రూటు ఎంచుకుంటాయో వేచి చూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more