కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఏ శాఖ నిర్వహించినా.. ఆ శాఖలో తన అధిపత్యాన్ని కనబర్చాలని ప్రయత్నిస్తుంటారా..? శాఖ అధికారులు చేసే పనుల్లో జోక్యం కల్పించుకుని వారిని ఇబ్బందులకు గురిచేస్తారా..? శాఖపై అమె తన పెత్తనం చెలాయించాలని భావిస్తారా..? ఇలా అమె తనకు తానుగా వివాదాస్పదంగా మారుతారా..? అంటే అవుననే గత అనుభవాలు చెబుతున్నాయి. కేంద్రమంత్రిగా అమె బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అమెను వివాదాలు నిత్యం చుట్టుముట్టాయి.
కేంద్రమానవ వనురుల శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన క్రమంలో అమె విద్యార్హతల విషయమై ప్రారంభమైన వివాదాలు.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ స్కాలర్ రోహిత్ శర్మ ఆత్మహత్య.. జేఏన్యూ విద్యార్థుల అరెస్టులు.. దేశద్రోహం కేసులు.. అలా వివాదాల్లో చిక్కుకోగానే అటు రోడ్డు ప్రమాదంలో డాక్టర్ కారును ఢీకొన్నట్లు అభియోగాలు.. అపదలో వున్న వారిని రక్షించాలన్న కనీస మానవత్వం చూపించలేదని నెట్ జనులు విసుర్లు.. అన్ని చుట్టుముట్టి ఏకంగా అమెకు అత్యంత కీలకమైన మానవ వనరుల శాఖను దూరం చేశాయి.
అంత కీలకం కానీ జౌళి శాఖను అమెకు ప్రధాని అప్పగించారు. దీంతో అమె కాస్త నెమ్మదించారు. కేవలం శాఖా పరంగా తన పనులు చూసుకుంటూ.. అటు మీడియాలో కూడా అంతగా హైలెట్ కాకుండా జాగ్రత్తపడ్డారు. ఈ నేపథ్ంయలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు దేశ ఉప రాష్ట్రపతిగా ఎంపిక కావడంతో ఆయన శాఖలను కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి అదనంగా కేటాయించారు. దీంతో మళ్లీ మరో కీలక శాఖ పగ్గాలను అందుకున్న స్మృతి ఇరానీ.. తన అధిపత్యాన్ని మళ్లి ప్రదర్శించారన్న అభియోగాలను మరోమారు ఎదుర్కొంటున్నారు. అమె అహాన్ని గౌరవించనందుకే తనను పదవిలోనుంచి తొలగించారని సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్ సి) మాజీ చీఫ్ పహ్లజ్ నిహ్లాని అరోపించారు.
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేసిన ఒత్తిడి కారణంగానే తన పదవికి రాజీనామా చేశానని ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఇందు సర్కార్’ సినిమాకు తాను సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతోనే అసలు వివాదం మొదలైందని అన్నారు. అప్పుడు, స్మృతి ఇరానీ తనకు ఫోన్ చేసి ఈ విషయమై ప్రశ్నించగా, ‘నేను సినిమా ట్రైబ్యునల్ ను అనుసరిస్తున్నాను’ అని చెప్పానని అన్నారు. దీంతో, ఆగ్రహించిన ఆమె, తనను బోర్డు నుంచి తొలగించేలా చేశారని ఆరోపించారు. అయితే, ‘ఇందు సర్కార్’ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వొద్దంటూ అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు వచ్చాయని, అయినప్పటికీ, తాను 70 కత్తిరింపులతో ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చానని చెప్పారు. దీంతో కేంద్రమంత్రికి సంబంధించిన మరో తెరవెనుక బాగోతం వెలుగుచూసింది.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more