అక్రమాస్తుల కేసులో దోషిగా సుప్రీం కోర్టు ధర్మాసనం నుంచి నిర్ధారణ కావటంతో ప్రస్తుతం బెంగళూరు లోని పరప్పణ అగ్రహర జైలులో శశికళ నటరాజన్ శిక్ష అనుభవిస్తోంది. అయినప్పటికీ పొరుగు రాష్ట్రం నుంచే తమిళనాడు రాజకీయాలను శాసించే క్రమంలో ఆమెకు పలు చిక్కులు ఎదురవుతున్నాయి. జైల్లో అది కూడా ఓ పార్టీకి అధినేత కావటంతో ప్రత్యేకంగా టీవీ సౌకర్యం కల్పించామే తప్ప మరేయితర సదుపాయాలు ఆమెకు లేవని జైలు అధికారులు ఆర్టీఐ కింద దాఖలైన ఓ దరఖాస్తుకు సమాధానం ఇచ్చారు.
అంతేకాదు ఆమె చెన్నై జైలుకు మార్పించాలన్న విజ్నప్తి ఇప్పటిదాకా చేయలేదని వారు చెబుతున్నారు. ఆ లెక్కన సాధారణ ఖైదీలాగానే ఆమె జీవితం గడుపుతోందని అర్థమౌతోందని స్పష్టమైంది. కనీసం మంచం, పరుపు లాంటివి కూడా లేకుండా కటిక నేలపై దుప్పటితో ఆమె కాలం వెళ్లదీస్తుందంట. ఏసీ, హీటర్ లాంటి లగ్జరీ సదుపాయాలు లేకుండా తోటి ఖైదీలతో సమానంగా శశికి ట్రీట్ మెంట్ జరుగుతోంది.
అయితే దినకరన్ తర్వాత ఆమెను జైల్లో కలిసిన ముగ్గురు మంత్రులకు ‘చిన్నమ్మ’ క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ, పార్టీ పదవుల్లో ఎవరికి వారే బిజీగా ఉంటూ తన గురించి కొంచెం కూడా ఆలోచించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిందంట. తన కేసులో అప్పీలుకు వెళ్లకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారని నిలదీశారు. పార్టీ పదవిపై ఎన్నికల సంఘం పంపిన నోటీసుకు సంజాయిషీ ఇవ్వడంలో నిర్లక్ష్యం ఎందుకు వహించారంటూ మండిపడినట్లు సమాచారం.
అధికారంలో ఉన్నామన్న మాటే తప్ప తనను గట్టెక్కించే విషయంలో ఏమైనా ఆలోచిస్తున్నారా? లేదా? అంటూ ప్రశ్నించడంతో ఏం చెప్పాలో తెలియక మంత్రులు సెంగొట్టయ్యన్, కామరాజ్, దిండుగల్ శ్రీనివాసన్ నీళ్లు నమిలారని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా ఆమెకు ఎదురుతిరిగితే మాత్రం పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుందన్న భావనలో ఉన్న ఆమె పరిస్థితిని చక్కదిద్దాలంటూ పరోక్షంగా మన్నార్ గుడి మాఫియాకు సంకేతాలు పంపుతున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more