రానున్న మరికోద్ది నెలల్లో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీల దృష్టి ఈ ఎన్నికలపైనే వుంది. అటు జాతీయ పార్టీలతో పాటు ఇటు రాష్ట్రీయ పార్టీలు కూడా ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల బరిలో నిలిచి తమ సత్తా చాటుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కిసాన్ యాత్ర పేరుతో దియోదరా టు ఢిల్లీ యాత్రను నిర్వహించారు. అయన సుమారుగా 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి కాట్ పే చర్చ కార్యక్రమాలతో రైతులతో చర్చలు నిర్వహించారు. అయితే అది పార్టీకి మైలేజ్ ను ఇవ్వడం లేదని సర్వే తేల్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడే ప్రయత్నం మాత్రం రాహుల్ యాత్ర చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తంమైంది.
ఉత్తరప్రదేశ్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 170-183 స్థానాలను గెలుచుకుంటుదని తాజా సర్వేలో తేలింది. దీంతో రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరిస్తుందని అంటున్నారు. అయితే, ఇండియా టుడే - యాక్సిస్ నిర్వహించిన మరో సర్వేలో మాత్రం.. హంగ్ అసెంబ్లీ వస్తుందని అన్నారు. ఆ సర్వే ప్రకారం బీఎస్పీ 115-124 సీట్లతో రెండోస్థానంలో నిలుస్తుందని అంటున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న సమాజ్వాదీ పార్టీకి 94-103 స్థానాలు మాత్రమే వస్తాయని, కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, 8-12 సీట్లకు మించి గెలుచుకునే పరిస్థితి లేదని అంటున్నారు.
ముఖ్యమంత్రి అభ్యర్థులలో మాత్రం మాయావతికే పెద్దపీట వేస్తున్నారు. ఆమె సీఎం కావాలని 31 శాతం మంది చెబితే, అఖిలేష్ మళ్లీ సీఎం కావానేవాళ్లు 27 శాతమే ఉన్నారు. ములాయం సింగ్ యాదవ్, షీలాదీక్షిత్లకు కేవలం ఒక్కోశాతం మద్దతు మాత్రమే వచ్చింది. అదే ప్రియాంకను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామంటే మాత్రం ఆమెకు 2 శాతం మంది మద్దతు చెబుతున్నారు. కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్కు 18 శాతం మంది, యోగి ఆదిత్యనాథ్కు 14 శాతం మంది అండగా ఉన్నారు.
కాగా బీజేపి తీసుకున్న కాంగ్రెస్ ముక్త భారత్ నినాదం వారికి లాభించేట్లుగా లేదు. ఈ నినాదాన్ని సుమారుగా 54 శాతం మంది ఓటర్లు వ్యతిరేకిస్తున్నారు. కాగా ఈ నిర్ణయాన్ని 29 శాతం ప్రజల నుంచి మాత్రం మద్దతు లభించగా, మరో 17 మంది మాత్రం తటస్థంగా వున్నారు. కాగా రాహుల్ కిసాన్ యాత్రం లాభం చేకూర్చుతుందని 38 శాతం మంది ప్రజలు తమ అభిప్రాయాలను సర్వేలో వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికల్లో ప్రధానాంశాలుగా రామ మందిరం, గో సరంక్షణ కనిపిస్తున్నాయి. 2012 ఎన్నికల తర్వాత యూపీలో దళితులపై దాడులు పెరిగాయని 54 శాతం మంది ముక్తకంఠంతో చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more