అసలు వదిలి కొసరు వెంట... | kejriwal completely ignore delhi civic issues

Kejriwal completely ignore delhi civic issues

kejriwal, kejriwal busy with modi mantra, more important to them than Modi, citizens of Delhi for kejriwal, తెలుగు వార్తలు, కేజ్రీవాల్, తాజా వార్తలు, ఢిల్లీ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్, మొత్తం మోదీపైనే పడుతున్నాడు, కేజ్రీవాల్ అభివృద్ధిని విస్మరించాడు, ఢిల్లీ సమస్యలను లైట్ తీస్కుంటున్న కేజ్రీవాల్, latest news, telugu news, political news, kejriwal news, national news

Delhi CM kejriwal completely ignore delhi civic issues. Meanwhile the citizens of Delhi are getting restive over civic issues, which are more important to them than Modi. When you are suffering dry taps and the heat of Delhi with stinking garbage outside your house, it becomes quite difficult to even listen to a delusional messiah spouting non-stop conspiracy theories. More importantly, 21 MLAs might well be disqualified and Kejriwal will face the people of Delhi with a major election just one year after his 2015 victory.

అసలు వదిలి కొసరు వెంట...

Posted: 06/18/2016 01:20 PM IST
Kejriwal completely ignore delhi civic issues

దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఓ పిరికి పంద, పెద్ద సైకో అంటూ పరుషంగా తన ఆఫీస్ పై సీబీఐ దాడులు జరిగిన సమయంలో డిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్విటాడు. అక్కడే అరవిందుడి మానసిక స్థితి బయటపడిపోయింది. అయితే ఆ సాయంత్రానికి నేరాన్ని అరుణ్ జైట్లీ పైకి నెట్టేస్తూ టాపిక్ ను పక్కదారిపట్టించే ప్రయత్నం చేశాడు. అంత సులువుగా మరిచిపోతామా? కట్ చేస్తే కొన్ని నెలల తర్వాత తన రాజకీయ జీవితంలో పెను సవాలునే ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఇప్పుడీ ఏకే 47కు వచ్చింది.

రాజ్యాంగాన్ని ఉల్లంఘించి 21 మంది ఎమ్మెల్యేలు లాభదాయక పదవుల్ని చేపట్టారని, వారిపై అనర్హత వేటేయాలని అభ్యర్థనలు దాఖలయ్యాయి. దీని నుంచి వారిని తప్పించే క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదించిన ‘పార్లమెంటరీ సెక్రటరీ’ చట్ట సవరణ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి తిరస్కారం ఎదురైంది. దీంతో అసహనానికి లోనై కేజ్రీవాల్ ఓవైపు మోదీని తిడుతూనే పరోక్షంగా ప్రణబ్ పైనా విమర్శలు చేశాడు. నిజానికి రాజకీయ కురువృద్ధుడైన ప్రణబ్ పై ఎవరూ ఇంతవరకు విమర్శలు చేసింది లేదు. అలాంటిది ప్రస్తుతం సోషల్ మీడియాలో రాష్ట్రపతిని అవమానించిన క్రేజీవాల్ అంటూ తీవ్ర దుమారమే రేగుతోంది.

మొదటి నుంచి మోదీపై తిట్ల దండకం వల్లవేయటం మాట అటు ఉంచి, రాష్ట్రపతిగా, దేశం మొత్తం గౌరవించే నేతగా ఉన్న ప్రణబ్ పై విమర్శలు చేయటమే చర్చగా మారింది. అది పక్కనపెడితే... ఇన్నాళ్లూ తాను మాత్రమే ప్రదానిపై విరుచుకుపడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆపనిని తన అనుచర గణం మద్ధతు కూడా కూడగడుతున్నాడు. ఎమ్మెల్యేలపై వ్యక్తిగతంగా ఆరోపణలు రావటం, అధికారులపై ఎమ్మెల్యేల దాడులు వంటి విషయాల్లోనే కాదు దేశంలో ఏ సమస్య తలెత్తిన చివరాఖరికి ఉడ్తా పంజాబ్ సినిమా వివాదంలోనూ మోదీని లాగి,  తనతోపాటు తన ఎమ్మెల్యేల తలదూరిపించి మరీ విమర్శనాస్త్రాలు సంధించాడు. ఇన్ని చేస్తున్నా ఢిల్లీ ప్రజలు మాత్రం దీనంగా తమ సమస్యల మాటేంటీ అని ఓ చూపు చూస్తున్నారు.

మొదటిసారి అధికారంలోకి వచ్చాక చేసిన హడావుడి, రెండోసారి గ్రాండ్ విక్టరీ తర్వాత పాలన చేస్తున్న సమయంలో చూపలేకపోతున్నారాయన. దీనికి కారణం మొత్తం దృష్టంతా మోదీపై సారించడమేనని తెలిసిపోతుంది. దీంతో మాకంటే మీకు మోదీయే ఎక్కువయ్యారా అని ప్రజలు కేజ్రీపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో తీవ్ర నీటి ఎద్దడి, చెత్త సమస్య ఎక్కువగా ఉంది. అవేం పట్టించుకోకుండా అస్తమానం మోదీపై పడి ఏడవటం, పక్క రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపు కోసం పాకులాడటం చేస్తున్నాడు. ఇకనైనా అవన్నీ పక్కనబెట్టి హస్తినవాసుల గోడు పట్టించుకుంటే మంచిది. లేకుండా చివరకు రాజకీయ భంగపాటు తప్పదు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kejriwal  Modi  citizens of Delhi  delhi civic issues  

Other Articles