రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. ఇప్పుడు ఏపీలో బీజేపీ-టీడీపీల పరిస్థితి ఇది. తొందరలోనే రెండు పార్టీల మధ్య మైత్రి బంధం తెగిపోతోంది అంటూ ఓ వార్త ఇప్పుడు హల్ చేస్తోంది. అయితే గతంలోనే ఇలాంటి వార్తే వచ్చినా.. తర్వాత మాత్రం పరిస్థితులు మారాయి. కానీ తాజాగా మాత్రం పరిస్థితులు వేరేలా ఉన్నాయి. అధినేతలు ఢిల్లీలో చంద్రబాబు, నరేంద్ర మోదీ ఎలా ఉన్నా.. గల్లీల్లో మాత్రం..రెండు పార్టీల మధ్య లొల్లి సాగుతోంది. రాష్ట్రంలో రెండు పార్టీల నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. మరి, ఇంతకీ ఈ రెండు పార్టీల మైత్రీబంధం దెబ్బతినడానికి, నేతలు కస్సుబుస్సులాడడానికి కారణాలేంటి? నిన్నటి దాకా చెట్ాపట్టాలేసుకొని ఏకంగా డ్యుయెట్లు కూడా పాడుకున్న పార్టీలు ఒక్కసారిగా దూరం దూరం అంటున్నాయి. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో... అధికారంలో మిత్రపక్షాలుగా ఉన్నాయి ఇదంతా గతం ఇప్పుడు తెలుగుదేశం-బీజేపీల బంధం క్రమంగా బీటలు వారుతోందని తెలుస్తోంది. రెండు పార్టీ నేతలు మాటల తూటాలతో హీట్ పెంచుతున్నారు. టీడీపీ శ్రేణులపై బీజేపీ బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తోంది. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా అడ్డుకునేలా టీడీపీ వ్యవహరిస్తోందని బీజేపీ నేతలు బహిరంగ విమర్శలకు దిగారు.
బీజేపీ-టీడీపీల ఏడాది ప్రయాణంలో ఇప్పుడు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రానికి కేంద్రం సరిగా సహకరించట్లేదనే భావన టీడీపీ నేతల్లో అనుకుంటుంటే.. ఏపీలో బీజేపీకి తగిన ప్రాధాన్యం లభించట్లేదనే అభిప్రాయం కమలదళంలో ఉంది. అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లలోపే టీడీపీ తీరుపై బిజెపి నాయకులు ఫైరవుతున్నారు. తాజాగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లోను రెండు పార్టీ మధ్య విభేధాలు బయటపడ్డాయి. బీజేపీ సభ్యత్వ నమోదును టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారని, బీజేపీలో చేరితే... సంక్షేమ పథకాలు అందకుండా చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని కూడా విమర్శలు వస్తున్నాయని సమాచారం.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. రాష్ట్రంలో ఎదురవుతున్న ఇబ్బందులకు... బీజేపీని దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అది సరికాదంటున్నారు.దేశంలో ఏ రాష్ట్రానికి చేయనంత లబ్ధి... ఏపీకి చేసినా, బీజేపీ వైఖరిపై బహిరంగ విమర్శలు గుప్పించడంపై చర్చించుకోవాల్సి ఉందంటున్నారు. నిజానికి ఏపీకి ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజీలు ఇతరత్రా డిమాండ్ల పరిష్కారం విషయంలో కూడా బీజేపీ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో బీజేపీ గెలుచుకున్న రెండు పార్లమెంటరీ స్థానాలను జాగ్రత్తగా కాపాడుకునేలా వ్యూహరచన చేస్తున్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు, భీమవరంలో ఎక్స్పోర్ట్ జోన్ వంటివి తమపై ఒత్తిడి పెంచేందుకేనని టీడీపీ అనుమానిస్తోంది. ఇక రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా మంత్రులకు ఆ స్వతంత్రం కూడా లేకుండా... టీడీపీ నేతలే అజమాయిషీ చేస్తుండటం కూడా బీజేపీకి అసంతృప్తి కలిగిస్తోంది. దేవాదాయ, వైద్య శాఖలు బీజేపీ నేతలకు కేటాయించినా వాటిపై...ఆయా జిల్లాల టీడీపే నేతలే, పెత్తనం చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ.
కేంద్రమంత్రి సీతారామన్ కు ఛేదు అనుభవమే ఎదురైంది. బీజేపీ ఛాయలు కానీ, మోడీ బొమ్మకానీ లేకుండా...కేవలం పసుపు జెండాలు, చంద్రబాబు బ్యానర్ల మధ్య కేంద్రమంత్రి ప్రసంగించాల్సి వచ్చింది. దీనికి ఇష్టపడని సీతారామన్...ఆ కార్యక్రమం నుంచి బయటకు వచ్చారు. ఇది స్థానికంగా రెండు పార్టీల మధ్య విభేదాలను బహిర్గతం చేసింది. అయితే, బీజేపీ-టీడీపీ...రెండూ కలిసే ప్రయాణిస్తాయని అందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని ఆమె చెబుతున్నారు. అది ఎంతకాలమన్నది మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. మొత్తం మీద టీడీపీ తీరుపై బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరకముందే అధినాయకత్వం జోక్యం చేసుకుంటుందో లేదంటే కావాలనే దూరం జరిగే ప్రయత్నాల్లో ఉన్నాయా అనేది మాత్రం ఇప్పటికిప్పుడు క్లారిటీ రావడం లేదు. మరి రెండు పార్టీలు గతంలోలాగా కలిసి ముందుకు వెలతాయో.. కలహాలతొ కుదరదు అని సెలవు తీసుకుంటాయో చూడాలి.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more