Newparty | Delhi | Yogendra yadav

The aap party rebals will sucess in the politics with new party

new party, delhi, yogendra yadav, prashant bhushan, aravind kejriwal, arvind kejriwal news, delhi politics, aap crisis, aap controversy, , lokpal ramdas, medha patkar

may new aprty in the indian politics soon. yogendra yadav and prashant bhushan planning to make new party against kejriwal : aap former leaders yogendra yadav and prashant bhushan planning to make new party against kejriwal to compete for eleminating them aap.

పార్టీ పెడతారా !.. పెట్టినా సక్సెస్ అవుతారా?

Posted: 03/31/2015 04:49 PM IST
The aap party rebals will sucess in the politics with new party

ఆమ్ ఆద్మీ పార్టీ ముందు నుండి సంచలనాలకు కేంద్రంగా మారింది. అయితే తాజాగా పార్టీ నుండి కీలక నేతలు బయటకు వెళ్లడం, కొంత మంది మేధావులు స్వచ్ఛందంగా పార్టీ నుండి నిష్క్రమించడం పార్టీకి కొంత నష్టాన్ని కలిగించే అవకాశాలున్నాయి. అయితే ఆప్ పార్టీకి నష్టం సంగతి అటుంచితే.. పార్టీ నుండి బయటకు వచ్చిన వారికి ఏమైనా లాభం కలుగుతుందా అనేది ప్రశ్న. ఎందుకంటే అభిప్రాయ భేదాలతో బయటకు వచ్చిన వారు ఎవరైనా సక్సెస్ అయిన దాఖలాలు లేవు. మరి ఆప్ లో కీలకంగా వ్యవహరించిన యోగేంద్రయాదవ్, ప్రశాంత్ భూషణ్ లు మాత్రం సక్సెస్ అవుతారా అన్నది అనుమానంగా ఉంది.

తమను తొలగించడంపై పార్టీ చర్యలను తీవ్రంగా పరిగణించిన యోగేంద్ర, భూషణ్.. ‘ఆప్’లో వున్న అసంతృప్తులను తమ దరికి చేర్చుకొని కొత్త పార్టీ స్థాపించాలని యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజ్యాంగనిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14వ తేదీన తమ మద్దతుదారులతో కీలక భేటీ నిర్వహించేందుకు వీరు ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. ‘ఆప్’లో లోక్ పాల్ స్థానం నుంచి బహిష్కరణకు గురైన రాందాస్ తోపాటు ఆ పార్టీని వీడిన సామాజిక ఉద్యమకారిణి మేధా పాట్కర్, ఇంకా తదితరులను తమ భేటీకి వారిద్దరు ఆహ్వానిస్తున్నారు. కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ పెట్టాలనే ఉద్దేశంతోనే వారు ప్రణాళికలు చేపడుతున్నారు.

అయితే పార్టీ పెట్టడానికి అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తైనట్లు సమాచారం. కాగా పార్టీ పెడితే ఆప్ కు నష్టం కలుగుతుందా లేక కొత్త పార్టీ ద్వారా యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ లాంటి వారికి లాభం చేకూరుతుందా చూడాలి. అయితే కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి, ప్రత్యేకంగా పార్టీని స్థాపించినా, ఎవరూ సక్సెస్ కాలేకపోయారు. తెలుగు రాష్ట్రాల్లోనూ అదే సీన్ రిపీట్ అయింది. తెలుగుదేశం పార్టీపై తిరుగుబాటు జెండా ఎగరవేసిని దేవేందర్ గౌడ్ తిరిగి తిరిగి మళ్లీ టిడిపి గూటికే చేరుకున్నారు. అలా ఇప్పటి వరకు పార్టీ మీద తిరుగుబాటు చేసిన వాళ్లు సక్సెస్ అయినట్లు లేదు. అయితే కొత్తగా పార్టీని పెట్టడం ద్వారా ఢిల్లీ చరిత్రలోనే కాదు భారత చరిత్రలోనే కొత్త అంకానికి తెర తీస్తారా అనేది ప్రశ్న. కానీ చాలా మంది మాత్రం పార్టీ పేరుకు మాత్రమే ఉంటుందని అప్పుడే చెవులు కొరుక్కుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yogendra yadav  prashant bhushan  arvind kejriwal  aam aadmi party  

Other Articles