రాజకీయ నాయకులు మైక్ దొరికితే ఇక రెచ్చిపోయి ఎంతసేపైనా మాట్లాడటం మామూలే. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సభలో కానీ మరెక్కడైనా మాట్లాడుతున్నాడంటే ఎవరినీ పట్టించుకోరు. ఎదుటి వ్యక్తులు తన ప్రసంగాన్ని విన్నా వినకున్నా వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని మాత్రం ముగించరు. కానీ ఒకప్పుడు చంద్రబాబు ప్రసంగం అలా సాగేది కానీ ప్రస్తుతం మాత్రం కొంత మార్పు వచ్చింది. కానీ చంద్రబాబు వదిలేసిన స్టైల్ ను మరోనేత ఫాలో అవుతున్నారు. తాజాగా ఆ నేత మీడియా సమావేశాన్నినిర్వహించి ఏకంగా రెండున్నర గంటలు మాట్లాడటంతో మీడియా వారికి బాగా విసుగు పుట్టిందట. మరీ ఇంత సేపు మాట్లాడతారా అని సీనియర్ జర్నలిస్ట్ లు అనుకున్నారట. ఇంతకీ ఆ నేత ఎవరో అనుకుంటున్నారా..
తెలుగు రాష్ట్రాల్లో అభిమానులను కలిగిన, వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్ తన మాటల తూటాలతో ఏపి అసెంబ్లీలో గందరగోళానికికారణమైన వైయస్ జగన్ గురించి ఈ ఉపోద్ఘాతం అంతా. ఇంతకీ విషయం ఏంటంటే తమ పార్టీ ఎమ్మెల్యేలను ఏపి అసెంబ్లీ స్పీకర్ సస్పండ్ చెయ్యడంపై జగన్ గుర్రుగా ఉన్నారు. సభకు హాజరుకాకుండా తన గెస్ట్ హౌజ్ లోటస్ పాండ్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీడియా ను ఉద్దేశించి జగన్ ప్రసంగం సుదీర్ఘంగా మాట్లాడారు.శాసనసభలో బడ్జెట్ పై తనను మాట్లాడనివ్వలేదని స్పీకర్ కోడెలపై ఆగ్రహం వ్యక్తం చేసి బయటకు వచ్చేసిన జగన్ మీడియా ముందు తన అబిప్రాయాలను చెప్పారు. అయితే ఒక్క జగన్ స్వంత మీడియా సిబ్బంది తప్ప మిగిలిన ఏ మీడియా సిబ్బంది పెద్దగా జగన్ ప్రసంగంపై ఆసక్తి కనబరచలేదు.
ఏదో ఓ ఐదు నిమిషాలు లేదంటే ఓ పదిహేను నిమిషాలు అంటే పర్లేదు కానీ గంటలుగంటలు మాట్లాడతాననంటే ఎలా కుదురుతుందని మీడియా వారు అభిప్రాయపడుతున్నారు. అయితే పాపం జగన్ బాబుకు ఏపి అసెంబ్లీలో కలిగిన అసౌకర్యం ఏమో కానీ వచ్చిన మీడియా వారికి మాత్రం జగన్ ప్రసంగం విసుగుపుట్టించింది. జగన్ తాను ఏం చెప్పతలుచుకున్నాడో సూటిగా చెప్పాలని కోడెల శివప్రసాద్ అసెంబ్లీలో ఎన్నో సార్లు చెప్పారు. అయినా అతను మారకపోవడంతో మైక్ కట్ చెయ్యాల్సి వచ్చింది. అయితే సభలో తన మైక్ కట్ చేశారని ఏకంగా గంట కొద్ది మాట్లాడిన జగన్, మీడియా సమావేశంలోనూ మైక్ కట్ చేస్తే బాగుండేదని కొందరు సీనియర్ పాత్రికేయులు అనుకున్నారట. మొత్తానికి మీడియా వారిని విసిగించి..విసిగించి చివరకు మీడియా వారు సహానాన్ని కోల్పోయిన తరువాత గానీ జగన్ తన ప్రసంగానికి ముగింపు పలకలేదట. ప్రసంగం ముగిసిన వెంటనే ఒక్క మీడియా విలేఖరి కూడా ఆలస్యం చెయ్యకుండా పరుగులు తీశారట. ఇక ఛస్తే ఇలాంటి మీడియా సమావేశాలకు హాజరుకాకూడదని నిర్ణయం కూడా తీసుకున్నారట.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more